Elon Musk: జనవరిలో ఇండియాకు ఎలాన్ మస్క్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: వరల్డ్ బిలియనీర్ ఎలాన్ మస్క్కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టెస్లా, భారత ప్రభుత్వం మధ్య చర్చలు తుది దశకు వచ్చాయి. వచ్చే ఏడాది నుంచి భారత్ లోకి టెస్లా కార్లు దిగమతి కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు టెస్లా సిద్ధమైంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్లోని ఏదో చోట ప్లాంట్ నెలకొల్పనున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి సంబంధించి ఎకో సిస్టమ్ ఉంది.
ప్రస్తుతం టెస్లాకు అమెరికా బయట జర్మనీ, చైనాలో మాత్రమే ప్లాంట్స్ ఉన్నాయి. అయితే పెట్టుబడి పెట్టే విషయంలో టెస్లా ఓ కండిషన్ పెట్టినట్లు వినికిడి. వచ్చే రెండేళ్లలో దిగుమతి చేసుకునే వాహనాలపై 15 శాతం రాయితీ సుంకాన్ని తగ్గించాలని భారత ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి భారత్ అంగీకరిస్తే, ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు టెస్లా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
- LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
- Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
Read Also: Royal Enfield Bikes : రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్.. కళ్లు చెదిరే ఫీచర్స్.. ధర ఎంతంటే?
జూన్ నెలలో ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్తో భేటీ అయ్యారు. ఎలాన్ మస్క్ భారత్ లో టెస్లా లాంచ్ని ప్రారంభించేందుకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి నెలలో జరిగే వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా ఎలాన్ మస్క్ భారత్ సందర్శించే అవకాశం ఉంది.
గతేడాది భారతదేశంలో 50,000 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే ఈ ఏడాది లక్ష దాటే అవకాశం ఉంది. 140 కోట్ల మంది ఉన్న అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్ని సద్వినియోగం చేసుకోవాలని టెస్లా ఉంది. కానీ సుంకాలు ఎక్కువగా ఉండటంపై టెస్లా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
టెస్లా 12,000 వాహనాలకు రాయితీ టారిఫ్ ప్రకటిస్తే 500 మిలియన్ల పెట్టుబడి, 30,000 వాహనాలపై దిగుమతి సుంకాలు తగ్గిస్తే 2 బిలియన్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. అయితే 2023లో అంచనా వేస్తున్న ఒక లక్ష వాహనాల్లో 10 శాతం అంటే 10,000 వాహనాలకు సుంకాలను తగ్గించాలని భారత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
తాజావార్తలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్కే ఓటు..
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!