Elon Musk: జనవరిలో ఇండియాకు ఎలాన్ మస్క్..?
Elon Musk: వరల్డ్ బిలియనీర్ ఎలాన్ మస్క్కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టెస్లా, భారత ప్రభుత్వం మధ్య చర్చలు తుది దశకు వచ్చాయి. వచ్చే ఏడాది నుంచి భారత్ లోకి టెస్లా కార్లు దిగమతి కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు టెస్లా సిద్ధమైంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్లోని ఏదో చోట ప్లాంట్ నెలకొల్పనున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి సంబంధించి ఎకో సిస్టమ్ ఉంది.
ప్రస్తుతం టెస్లాకు అమెరికా బయట జర్మనీ, చైనాలో మాత్రమే ప్లాంట్స్ ఉన్నాయి. అయితే పెట్టుబడి పెట్టే విషయంలో టెస్లా ఓ కండిషన్ పెట్టినట్లు వినికిడి. వచ్చే రెండేళ్లలో దిగుమతి చేసుకునే వాహనాలపై 15 శాతం రాయితీ సుంకాన్ని తగ్గించాలని భారత ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి భారత్ అంగీకరిస్తే, ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు టెస్లా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
- Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
- Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
Read Also: Royal Enfield Bikes : రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్.. కళ్లు చెదిరే ఫీచర్స్.. ధర ఎంతంటే?
జూన్ నెలలో ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్తో భేటీ అయ్యారు. ఎలాన్ మస్క్ భారత్ లో టెస్లా లాంచ్ని ప్రారంభించేందుకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి నెలలో జరిగే వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా ఎలాన్ మస్క్ భారత్ సందర్శించే అవకాశం ఉంది.
గతేడాది భారతదేశంలో 50,000 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే ఈ ఏడాది లక్ష దాటే అవకాశం ఉంది. 140 కోట్ల మంది ఉన్న అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్ని సద్వినియోగం చేసుకోవాలని టెస్లా ఉంది. కానీ సుంకాలు ఎక్కువగా ఉండటంపై టెస్లా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
టెస్లా 12,000 వాహనాలకు రాయితీ టారిఫ్ ప్రకటిస్తే 500 మిలియన్ల పెట్టుబడి, 30,000 వాహనాలపై దిగుమతి సుంకాలు తగ్గిస్తే 2 బిలియన్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. అయితే 2023లో అంచనా వేస్తున్న ఒక లక్ష వాహనాల్లో 10 శాతం అంటే 10,000 వాహనాలకు సుంకాలను తగ్గించాలని భారత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో