Elon Musk: జనవరిలో ఇండియాకు ఎలాన్ మస్క్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: వరల్డ్ బిలియనీర్ ఎలాన్ మస్క్కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టెస్లా, భారత ప్రభుత్వం మధ్య చర్చలు తుది దశకు వచ్చాయి. వచ్చే ఏడాది నుంచి భారత్ లోకి టెస్లా కార్లు దిగమతి కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు టెస్లా సిద్ధమైంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్లోని ఏదో చోట ప్లాంట్ నెలకొల్పనున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి సంబంధించి ఎకో సిస్టమ్ ఉంది.
ప్రస్తుతం టెస్లాకు అమెరికా బయట జర్మనీ, చైనాలో మాత్రమే ప్లాంట్స్ ఉన్నాయి. అయితే పెట్టుబడి పెట్టే విషయంలో టెస్లా ఓ కండిషన్ పెట్టినట్లు వినికిడి. వచ్చే రెండేళ్లలో దిగుమతి చేసుకునే వాహనాలపై 15 శాతం రాయితీ సుంకాన్ని తగ్గించాలని భారత ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి భారత్ అంగీకరిస్తే, ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు టెస్లా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీకి కేంద్రం ఆమోదం.. ఎంత శాతం? జమ ఎప్పుడంటే..?
- US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడికి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
- Best Investment Plans: పిల్లల భవిష్యత్తు కోసం.. అద్భుతమైన పెట్టుబడి మార్గాలు.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిందే
- Tata Motors: ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన టాటా మోటార్స్.. ఒకే రోజులో లక్షల కోట్లు లాస్! ఎందుకో తెలుసా?
Read Also: Royal Enfield Bikes : రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్.. కళ్లు చెదిరే ఫీచర్స్.. ధర ఎంతంటే?
జూన్ నెలలో ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్తో భేటీ అయ్యారు. ఎలాన్ మస్క్ భారత్ లో టెస్లా లాంచ్ని ప్రారంభించేందుకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి నెలలో జరిగే వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా ఎలాన్ మస్క్ భారత్ సందర్శించే అవకాశం ఉంది.
గతేడాది భారతదేశంలో 50,000 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే ఈ ఏడాది లక్ష దాటే అవకాశం ఉంది. 140 కోట్ల మంది ఉన్న అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్ని సద్వినియోగం చేసుకోవాలని టెస్లా ఉంది. కానీ సుంకాలు ఎక్కువగా ఉండటంపై టెస్లా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
టెస్లా 12,000 వాహనాలకు రాయితీ టారిఫ్ ప్రకటిస్తే 500 మిలియన్ల పెట్టుబడి, 30,000 వాహనాలపై దిగుమతి సుంకాలు తగ్గిస్తే 2 బిలియన్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. అయితే 2023లో అంచనా వేస్తున్న ఒక లక్ష వాహనాల్లో 10 శాతం అంటే 10,000 వాహనాలకు సుంకాలను తగ్గించాలని భారత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..