తెలంగాణలో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో జూన్ 23 నుంచి 10 ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరించారు. ఏడాదిన్నర తర్వాత ప్రారంభమైన ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో జూలై 1వ తేదీ నుంచి మరో 45 ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో రేపటి నుంచి 55 ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్లోని ఎంఎంటీఎస్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో 45…
కరోనా సమయంలో పీజీ విద్యార్థులకు వెసులుబాటు కల్పించింది ఉస్మానియా యూనివర్సిటీ… పీజీ పరీక్షలు రాసే విద్యార్థులు.. తమకు దగ్గర్లో ఉన్న జిల్లా కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది… విద్యార్థి తనకు ఏ సెంటర్ అందుబాటులో ఉందని భావిస్తున్నాడో… ఏ సెంటర్లో పరీక్ష రాయాలని అనుకుంటున్నాడో.. ముందే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.. ఒకవేళ ఒక సెంటర్ లో 20 మంది విద్యార్థులు ఉంటే ఆ సెంటర్ ను మార్చడం జరుగుతుందని ఓయూ తెలిపింది..…
హైదరాబాద్లోని లోటస్పాండ్ వద్ద ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకోన్నాయి. లోటస్ పాండ్లోని సోషల్ మీడియాకు సంబందించిన మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు ముందు షర్మిల తెలంగాణ ఒక్క నీటిబొట్టును కూడా వదులుకోదని ట్వీట్ చేశారు. దీనిపై అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు లోటస్పాండ్ను ముట్టడించేందుకు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో షర్మిల అనుచరులకు అమరావతి పరిరక్షణ సభ్యుల మధ్య వివాదం జరిగింది. షర్మిల అనుచరులు అమరావతి పరిరక్షణ సమితి సభ్యులను బూటుకాలితో తన్నడంతో వివాదం…
దేశంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి. ఒకప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో లేని బంగారం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మార్కెట్ పుంజుకోవడంతో ముదుపరులు బంగారంతో పాటుగా లాభసాటిగా ఉండే ఇతర రంగాలలో కూడా పెట్టుబడులు పెడుతుండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. Read: షూటింగ్ రీస్టార్ట్ చేసిన “గ్యాంగ్ స్టర్ గంగరాజు” ఈరోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా…
హైదరబాద్ లో మరోసారి ఉగ్రవాదుల మూలాలు బయటపడ్డాయి. ఈ నెల 17న బీహార్ లోని దర్భంగా రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న పేలుడు మూలాలు హైదరాబాద్ లో బయటపడ్డాయి. ఈ నెల 16న దర్భంగా రైల్వే స్టేషన్ కు సికింద్రాబాద్ నుంచి పార్సెల్ వెళ్లినట్లు గుర్తించారు బీహార్ రైల్వే పోలీస్ & ఏటిఎస్ బృందం. బీహార్ దర్భన్ లో రైలు నుంచి ఓ వస్త్రాల పార్సిల్ దిగుతుండగా ఈ నెల 17న పేలుడు సంభవించింది. అనంతరం…
హైదరాబాద్లో పోలీసులు వాహనాలపై దృష్టిసారించారు. నిత్యం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనీఖీలు చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న చలానాలను వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో, జూబ్లీహిల్స్లోని చెక్పోస్ట్ వద్ద ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా ఆ వాహనంపై దాదాపుగా 130 చలాన్లు ఉన్నాయి. టీఎస్ 10 ఈఆర్ 7069 నెంబర్ గల స్కూటీని చెక్ చేయగా 2017 నుంచి చలానాలు పెండింగ్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ చలానాల మొత్తం రూ.35,950…
కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. చాలా రాష్ట్రాల్లో అన్లాక్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. తిరిగి మార్కెట్లు యధావిధిగా నడుస్తున్నాయి. కరోనా సమయంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పుత్తడి ఆ తరువాత తగ్గుతూ వచ్చింది. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధర రూ.44,110 వద్ద స్థిరంగా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,110 వద్ద నిలకడగా ఉన్నది.…
గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం, సాధారణ సర్వ సభ్య సమావేశం మంగళవారం ఉదయం 10 .30 గంటలకు వర్చ్యువల్ గా జరుగుతుందని జీహెచ్ఎంసీ తెలిపింది. కోవిడ్ నియమ, నిబంధనల నేపథ్యంలో మొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ సమావేశం వర్చ్యువల్ గా నిర్వహించేందుకు సభ్యులందరికి ఐ.డి లను పంపించారు. రేపు జరిగే ఈ సమావేశంలో మొదటగా నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి ప్రసంగిస్తారు. నగరంలో జరగుతున్న అభివృద్ధిని వివరిస్తూ మేయర్ ప్రసంగించనున్నారు. అనంతరం.. 2021…