కారణాలు ఏవైనా సరే భర్తలను కాటికి పంపుతున్నారు కొందరు భార్యలు. పరాయి వ్యక్తుల మోజులో పడి భర్తలను అంతమొందిస్తున్నారు. మరికొందరు కుటుంబ కలహాల కారణంగా ప్రాణాలు తీస్తున్నారు. కాగా ఈనెల 12న వ్యక్తి బోడుప్పల్ లోని ఓ ప్లే స్కూల్లో అశోక్ అనే వ్యక్తి అనుమానస్పద మృతి చెందిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బృందావన్ కాలనీలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు భార్యపై…
మేడ్చల్ లో జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి కార్తీక్(14) మిస్సింగ్ కలకలం రేపింది. ఎనిమిది రోజుల కింద మిస్సింగ్ కాగా, ఇప్పటి వరకు ఆచూకీ లభించకపోవడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యులు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎనిమిది రోజుల నుండి స్కూల్ పరిసర ప్రాంతాల్లో వెతికినా లభించని బాబు ఆచూకీ.. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. Also Read:BMW : భర్త మహాశయులకు విజ్ఞప్తితో రవితేజ బౌన్స్…
సైబర్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సరికొత్త ఎత్తుగడలతో బురిడి కొట్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్ క్రిమినల్స్. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. నిరక్ష్యరాస్యులే కాదు.. అక్షరాస్యులు కూడా సైబర్ మోసాల భారిన పడుతున్నారు. తాజాగా పోలీస్ ఇన్స్పెక్టర్ సైబర్ వలలో పడ్డారు. ఏకంగా రూ.1.62 లక్షలు పోగొట్టుకున్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్కే షాక్ ఇచ్చిన సైబర్ క్రైమ్ నేరగాళ్లు. రాచకొండ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్నే మోసం చేసిన కేటుగాళ్లు. తిరుమల దర్శనం, వసతి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రోగ్రెస్ ఉండదు.. రెండేళ్లు మనకు కష్టాలు తప్పవు అని సెటైర్లు వేశారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారని అనుకోవడం లేదు.. పంచాయతీ ఎన్నికల ఫలితాల విషయంలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఐదు నిమిషాలకే మాట మార్చారు అని పేర్కొన్నారు.
నార్సింగి లో దారుణం చోటుచేసుకుంది. కాళ్ల పట్టీల కోసం వివాహితను దారుణంగా హత్య చేశారు. నిర్మానుష్య ప్రాంతంలో వివాహిత ను హత్య చేసి కాళ్లకు ఉన్న పట్టిలను ఎత్తుకెళ్లారు హంతకులు. ఖానాపూర్ లో కలకలం రేపిన వివాహిత హత్య. నిన్నటి నుండి కనిపించకుండా పోయిన మోగుళమ్మ. భర్త నార్సింగీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో నిర్మానుష్య ప్రాంతంలో శవమై కనిపించింది మోగుళమ్మ. స్థానికుల…
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా కబ్జాదారుల నుంచి వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకుని రక్షిస్తోంది. ప్రభుత్వ స్థలాలు, నాలాలు, చెరువులు, బఫర్ జోన్ లోని స్థలాలను కబ్జాదారుల చెరనుంచి కాపాడుతోంది. ఈ క్రమంలో పాతబస్తీలో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసుల సమక్షంలో అక్రమ ప్రహారీలను హైడ్రా సిబ్బంది తొలగించారు. ప్రభుత్వ భూమి అని స్పష్టంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు…
నక్సలిజాన్ని రూపుమాపేందుకు, మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్రం ఆపరేషన్ కగార్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది మావోలు భద్రతబలగాల ఎన్ కౌంటర్ లో మృతిచెందారు. మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 40 మంది మావోయిస్టులు లొంగిపోయారు. డీజీపీ సమక్షంలో జనజీవన స్రవంతిలో మావోయిస్టులు కలిసిపోయారు.. లొంగిపోయిన వాళ్లలో ముగ్గురు రాష్ట్రస్థాయి లీడర్లు.. కొందరు హిడ్మా బెటాలియన్ కమాండర్స్ ఉన్నారు. లొంగిపోయిన వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వక భేటీ అయ్యారు. RBI బోర్డ్ మీటింగ్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా RBI గవర్నర్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను RBI గవర్నర్ కు వివరించారు సీఎం రేవంత్. విద్యుత్ రంగంలో సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటుపై…
టెర్రరిస్టుల అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అమాయకపు ప్రజల మీద విరుచుకుపడి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ప్రాణాలను బలిగొంటున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలో సాజిద్ అనే ఉగ్రవాది కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్లో యూదులు లక్ష్యంగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. బోండి బీచ్ కాల్పుల్లో నిందితుడి సహా 16 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ సమయంలో అంతా ప్రాణభయంతో వణికిపోతుంటే అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి మాత్రం.. ఉగ్రవాదులతో వీరోచితంగా…