చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి పేరుతో భారీ మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. అల్కాపురి కాలనీ కొత్తపేట్కు చెందిన పనస మధు (30) అనే వ్యక్తి తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)లో గ్రేడ్-3 టెక్నికల్ మేనేజర్గా చెర్లపల్లిలో పనిచేస్తున్నానని నకిలీ ఐడీ కార్డు సృష్టించాడు. ఎఫ్సీఐలో ఉద్యోగం అంటూ నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతిని పెళ్లి పేరుతో వలలో వేసుకున్నాడు. మొదట పెళ్లి కోసం రూ.2 కోట్లు డిమాండ్ చేసిన…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతైన ఘటన కలకలం రేపింది. ఎస్ఆర్ నగర్ రూట్ పరిధిలో ఎస్బీఐ ఏటీఎంలలో నగదు గల్లంతైనట్లు సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఎస్బీఐ ఏటీఎంలలో నగదు ఫిల్ చేస్తున్న సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ ఫిర్యాదు చేసింది. రూ. 1, 20,98,500 రూపాయల నగదు గల్లంతైనట్లు ఫిర్యాదు చేసింది. ఏటీఎంలలో నగదు లోడింగ్ సమయంలో అవకతవకలు జరిగినట్లు…
హైదరాబాద్ నగరంలో రౌడీ షీటర్ లపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఎచ్ న్యూ సహాయంతో 250 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. 190 మంది రౌడీ షీటర్లకు గంజాయి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన రౌడీషీటర్లను ఆయా పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు రౌడీ షీటర్లకు డ్రగ్స్ పాజిటివ్ అయ్యిందని వెల్లడించారు. నలుగురితోపాటు, వెస్ట్ జోన్ పరిధిలోని డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన…
శత్రువుల వెన్నులో వణుకు పుట్టించాల్సిన ఆర్మీ అధికారి చైన్ స్నాచర్ గా మారాడు. చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేశారు రైల్వే పోలీసులు. నిందితుడి వద్ద నుంచి 7.5లక్షల విలువైన 5తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భారత ఆర్మీలో 30ఏళ్లు సేవలందించిన నిందితుడు అన్నపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి. Also Read:Yuvraj Singh 6 Sixes…
వనస్థలిపురం హస్తినాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని, బైక్ పై వెళ్తున్న మరో ఇద్దరు యువకులను కార్ ఢీకొన్నది. 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్ళి పల్టీ కొట్టింది హోండా సిటీ కార్. బైక్ పై వెళ్తున్న యువకులిద్దరూ మృతి, నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన యువకులిద్దరూ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ చెందిన ఈసీఈ రెండవ…
హైదరాబాద్ ఐటీ కారిడార్కు అత్యంత చేరువలో ఉన్న ఖానామెట్ ప్రాంతంలో ప్రభుత్వ భూములపై హైడ్రా (HYDRAA) మరోసారి ఉక్కుపాదం మోపింది. ఖానామెట్ సర్వే నంబర్ 55లో కొన్ని నిర్మాణ సంస్థలు అక్రమంగా ఆక్రమించుకున్న సుమారు 8 ఎకరాలకు పైగా భూమిని అధికారులు భారీ ఆపరేషన్ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ సుమారు 1200 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని హైడ్రా ప్రాథమికంగా అంచనా వేసింది. గత కొంతకాలంగా ఈ విలువైన ప్రభుత్వ…
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ప్రాంతమైన బంజారాహిల్స్లో వెలుగుచూసిన కుళ్లిన బిర్యానీ ఉదంతం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ‘లక్కీ బిర్యానీ షవర్మాస్’ అనే రెస్టారెంట్ బాగోతాన్ని బంజారాహిల్స్ పోలీసులు రట్టు చేశారు. అసలు వివరాల్లోకి వెళ్తే, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టూలోని వెంకటరమణ కాలనీకి చెందిన కొండారెడ్డి అనే వ్యక్తి ఆదివారం ఉదయం ఒక ఆన్లైన్ ఫుడ్ యాప్ ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే, డెలివరీ అయిన ప్యాకెట్ తెరవగానే అందులో…
గ్రేటర్ హైదరాబాద్ అంతా ఒకే గొడుగు కింద వుంటే నాయకత్వానికి కష్టమవుతుందని కాంగ్రెస్ పార్టీ మూడు జిల్లాలుగా విభజించుకుంది. ఓల్డ్ సిటీ అంతా హైదరాబాద్ జిల్లాగా.. సికింద్రాబాద్.. ఖైరతాబాద్లుగా డివైడ్ చేసుకుంది. జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి..హైదరాబాద్ జిల్లాకు సయ్యద్ ఖలిద్ సైఫుల్లాను…ఖైరతాబాద్ జిల్లాకు యూత్ లీడర్ మోత రోహిత్ ను..సికింద్రాబాద్కి దీపక్ జాన్ను అధ్యక్షులుగా నియమించింది. అంతవరకు బాగానే వుంది..అధ్యక్షులను పార్టీ నాయకత్వం వేసింది. కానీ. కమిటీ వెయ్యలేదు. అధ్యక్షులు గ్రౌండ్ లో పనీ చేయడం లేదు.…
Hyderabad: తెలంగాణ రాష్ట్ర న్యాయ వ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పనలో మరో కీలక అడుగు పడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేలులో నిర్మిస్తున్న అత్యాధునిక నూతన హైకోర్టు సముదాయంలో రెండవ దశ (జోన్-II) భవన నిర్మాణ పనులకు ఆదివారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా నిర్మాణానికి అంకురార్పణ చేశారు. Rashmika Mandanna : రష్మిక బర్త్ డే స్పెషల్.. జయమ్మకు రణబాలి టీమ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఈ కార్యక్రమంలో…
Hyderabad Crime: రోజురోజుకి సమాజంలో దారుణ ఘటనలు ఎక్కువతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని కూకట్పల్లి పరిధిలో ఒక విస్తుపోయే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఒక యువతిని నమ్మించి, అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, బలవంతంగా మత మార్పిడి చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. Riyan Parag: మ్యాచ్ పోయిందనుకున్నాం.. ఆ ఇద్దరే దేవుడిలా వచ్చి కాపాడారు, ఈసారి గట్టిగా…