GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో పాలనా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసింది. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా పౌర సేవలను వేగవంతం చేసే ఉద్దేశంతో జిహెచ్ఎంసి డీలిమిటేషన్కు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నూతన సంస్కరణల ప్రకారం భాగ్యనగరంలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్ల సంఖ్యను ఏకంగా 300కు పెంచుతూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.…
మాజీమంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మార్పు అని చెప్పి ఊదరగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిందన్నారు. ఈ రెండేళ్లలో కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అప్పుడు కాలేశ్వరం బ్యారేజ్ ని పేల్చారు.. ఇప్పుడు చెక్ డ్యాం లను పేలుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు దొంగతనంగా ఇసుక తరలించేందుకు కష్టమవుతుంది అని చెక్ డ్యాం లు పేలుస్తున్నారు. నిన్న మొన్న పెద్ద…
Story Board: ప్రభాకర్ రావు విదేశాల నుంచి వచ్చాక.. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వేగం పెరిగింది. ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు.. కీలక వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు.
Nandyal Tragedy: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వాలిస్ వాహనం రోడ్డు డివైడర్ ను కొట్టి CGR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ పోలీసు కమిషనర్ (సీపీ) వీసీ సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పర్యవేక్షించారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా.. సీపీ పాల్గొని తనిఖీల విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించారు. పోలీసు సిబ్బందికి సూచనలు ఇవ్వడమే కాకుండా.. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను సజ్జనార్ వివరించారు. క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్…
డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. యువత మత్తుపదార్థాలకు అలవాటుపడి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. డ్రగ్స్ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో డ్రగ్ నెట్వర్క్ గుట్టురట్టైంది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రగ్స్ ను విక్రయిస్తోంది. కాకినాడ నుంచి వచ్చి ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన వైనం. Also Read:Mysaa First Glimpse…
కారణాలు ఏవైనా సరే భర్తలను కాటికి పంపుతున్నారు కొందరు భార్యలు. పరాయి వ్యక్తుల మోజులో పడి భర్తలను అంతమొందిస్తున్నారు. మరికొందరు కుటుంబ కలహాల కారణంగా ప్రాణాలు తీస్తున్నారు. కాగా ఈనెల 12న వ్యక్తి బోడుప్పల్ లోని ఓ ప్లే స్కూల్లో అశోక్ అనే వ్యక్తి అనుమానస్పద మృతి చెందిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బృందావన్ కాలనీలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు భార్యపై…
మేడ్చల్ లో జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి కార్తీక్(14) మిస్సింగ్ కలకలం రేపింది. ఎనిమిది రోజుల కింద మిస్సింగ్ కాగా, ఇప్పటి వరకు ఆచూకీ లభించకపోవడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యులు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎనిమిది రోజుల నుండి స్కూల్ పరిసర ప్రాంతాల్లో వెతికినా లభించని బాబు ఆచూకీ.. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. Also Read:BMW : భర్త మహాశయులకు విజ్ఞప్తితో రవితేజ బౌన్స్…
సైబర్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సరికొత్త ఎత్తుగడలతో బురిడి కొట్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్ క్రిమినల్స్. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. నిరక్ష్యరాస్యులే కాదు.. అక్షరాస్యులు కూడా సైబర్ మోసాల భారిన పడుతున్నారు. తాజాగా పోలీస్ ఇన్స్పెక్టర్ సైబర్ వలలో పడ్డారు. ఏకంగా రూ.1.62 లక్షలు పోగొట్టుకున్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్కే షాక్ ఇచ్చిన సైబర్ క్రైమ్ నేరగాళ్లు. రాచకొండ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్నే మోసం చేసిన కేటుగాళ్లు. తిరుమల దర్శనం, వసతి…