హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులు పశ్చిమ బెంగాల్కు చెందిన విష్ణు (25), జగన్నాథ్ (30)గా పోలీసులు గుర్తించారు. అనంతరం క్లూస్ టీమ్ బృందం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. Read Also: దీపావళి వేడుకల్లో అపశృతి.. పలువురికి గాయాలు అయితే…
దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. కరోనా కారణంగా గతేడాది దీపావళి పండుగను ప్రజలు చేసుకోలేదు. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈసారి రెండురోజుల ముందు నుంచే పండుగ వాతావరణం ఏర్పడింది. ఉదయాన్నే పూజలు చేసి, శుభం కలగాలని కోరుతూ పండుగను చేసుకుంటున్నారు. సాయంత్రం ప్రజలు ఆరుబయటకు వచ్చి బాణా సంచా కాల్చూతూ పండుగను నిర్వహించుకుంటున్నారు. హైదరాబాద్లో వివిధ కమ్యూనిటీల్లో ప్రజలు బాణా సంచా కాల్చుతూ పండుగను చేసుకుంటున్నారు. ఈ సారి గ్రీన్ కాకర్స్నే కాల్చుతు…
దీపావళి సందర్భంగా ఉత్తరాధికి చెందిన వ్యక్తులు లక్ష్మీ పూజను నిర్వహిస్తుంటారు. దీపావళికి ముందురోజు ఈ పూజను నిర్వహిస్తారు. పూజగదిలో డబ్బును ఉంచి పూజిస్తారు. ఇలానే హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో నివశించే ప్రకాశ్ చంద్ జైన్ అనే వ్యక్తి తన ఇంట్లో లక్ష్మీపూజను నిర్వహించారు. పూజ నిర్వహించేసమయంలో గదిలో మూడున్నర లక్షల డబ్బును ఉంచారు. ఇంటికి వచ్చిన అతిధుల కోసం క్యాటరింగ్ ఆర్డర్ చేశాడు. అతిథులు భోజనాలు చేసిన తరువాత వారిని పంపించేందుకు యజమాని జైన్ బయటకు రాగానే, కేటరింగ్…
ఇండియాలో పసిడికి ఉన్న డిమాండ్ మరేదానికి ఉండదు. ఇక పెళ్లిళ్ల సీజన్ వస్తే… మాత్రం… బంగారం ధరలు అమాంతం పెరిగిపోతాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 44,550 కి చేరింది. 10 గ్రాముల…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో.. దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం.. ఇక, తెలంగాణలో మొదటల్లో వ్యాక్సిన్ లేక కొన్ని రోజులు వ్యాక్సిన్కు హాలిడేస్ ప్రకటించినా.. ఆ తర్వాత క్రమంగా వ్యాక్సినేషన్లో వేగం పుంజుకుంది.. ఫస్ట్ డోస్ కొనసాగిస్తూనే.. ఫస్ట్ డోస్ తీసుకుని.. సెకండ్ డోస్ వేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నవారిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. అయితే, పండుగ సమయంలోనూ వ్యాక్సిన్కు హాలిడే ఇస్తూ వస్తున్నారు.. రేపు దీపావళి…
దేశంలో పుత్తడికి రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతున్నది. ఇక పండుగ సీజన్ వచ్చింది అంటే బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూసుతుంటారు. కొనుగోలు పెరిగితే ధరలు పెరిపోతుంటాయి. కరోనా నుంచి కోలుకొని మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో దీని ప్రభావం ధరలపై పడింది. తాజాగా మరోసారి పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. పుత్తడితో పాటుగా వెండి ధరలు కూడా పెరగడం విశేషం. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఇలా ఉన్నాయి. Read: నవంబర్ 3,…
హైదరాబాద్ నగరానికి శివారులో ఉండే చిలుకూరు బాలాజీ ఆలయంలో స్వామివారి దర్శనం వేళల్లో మార్పులు చేసినట్లు ప్రధాన అర్చకుడు రంగరాజన్ వెల్లడించారు. ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటలకు ఆలయం తెరిచి ఉంటుందని తెలిపారు. Read Also: తెలంగాణ కరోనా అప్ డేట్ కరోనా పాజిటివ్ కేసులు పూర్థిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు ఈ టైమింగ్సే కొనసాగుతాయని రంగరాజన్ స్పష్టం చేశారు.…
అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకున్నాకా ఎవరి పనుల్లో వారు బిజిగా మారిపోయారు. చైతూ తన సినిమాలతో బిజీగా మారగా.. సామ్ వెకేషన్ లలో ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే విడాకుల తర్వాత సామ్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటుంది.. చైతూ , సామ్ ఎంతో ప్రేమగా తీసుకున్న విల్లాలో ఎవరు ఉండబోతున్నారు అనేదానికి క్లారిటీ వచ్చేసింది. చైతు విడాకుల అనంతరం హైదరాబాద్ లో ఒక కొత్త ఇల్లును కొనుగోలు చేసి అందులోకి షిఫ్ట్ కానున్నాడు. సామ్…
ఎంబీబీఎస్, బీడీఎస్తో పాటు మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ -యూజీ 2021 ప్రవేశపరీక్షా ఫలితాలను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. 16,14,777 మంది ఈ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోగా 15,44,275 మంది పరీక్షకు హాజరయ్యారు.. వారిలో 8,70,074 మంది అర్హత సాధించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫలితాలను విడుదల చేసింది.. ఈ ఫలితాల్లో తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.. తెలంగాణకు చెందిన మృణాల్ కుటేరి, ఢిల్లీకి చెందిన తన్మయ్గుప్తా, మహారాష్ట్రకు చెందిన…
బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం ఎమ్మెల్యే రాజాసింగ్ అధ్యక్షతన సోమవారం జరిగింది.ఈ సందర్భంగా ఆయన కేసీఆర్పై విమర్శలు సంధించారు. ప్రధానంగా హుజురాబాద్ ఉప ఎన్నికపైనే ఈ సమావేశం జరిగినట్టు ఆయన వివరించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయ త్నాలు కేసీఆర్ చేశారన్నారు. సర్వేల ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజాసింగ్ విమర్శించారు. కేసీఆర్ ఎన్ని సర్వేలు చేయించుకున్నా బీజేపీ గెలుస్తుందని రిపోర్ట్ రావడంతో చివరకు డబ్బులు పంచి గెలవాలని చూశాడని…