హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ఎత్తున హవాలా డబ్బు పట్టుబడింది. చిట్యాల పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల తనిఖీలను పసిగట్టిన కారు డ్రైవర్ రూటు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేయబోయి.. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. కాగా టీఎస్ 10 EY 6160 నెంబర్ గల కియా కారును పోలీసులు తనిఖీ చేయగా అందులో రూ.4 కోట్ల నగదు పట్టుబడింది. దీంతో…
స్మార్ట్ ఫోన్ల విభాగంలో దూసుకుపోతున్న లాట్షోరూం నూతన ప్రచారకర్తగా రష్మిక మందన నియామాకం అయ్యారు. ఇప్పటికే 150 స్టోర్లకు చేరువలో చేరి ఎప్పటికప్పుడు నూతన మొబైల్స్ను వినియోగదారులకు అందిస్తున్నారు షోరూం నిర్వాహకులు. లాట్ మొబైల్స్ (NO QUESTION ASKED) ASSURED PAY BACK విధానాన్ని పాటిస్తూ, పాత మొబైల్స్ స్థానంలో కొత్త మొబైల్స్ను అందజేస్తుందన్నారు. కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు (90 Mins Delivery App) ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రచారకర్తగా నియామాకం అయిన రష్మిక…
హైదరాబాద్ లోని చందానగర్ పాపిరెడ్డి కాలనీ లో విషాదం చోటు చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పాపిరెడీ కాలనీ లోని ఓ సెప్టిక్ ట్యాంక్ లో పడి బాలుడు మృతి చెందాడు. నిన్న గాలి పటం ఎగురవేస్తూ పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో పడి అరవింద్ (7) అనే బాలుడు మృతి చెందాడు. నిన్నటి నుండి బాలుడు కనిపించడం లేదంటూ చందనగర్ పోలీసులకు బాలుడి తల్లి తండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన…
పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఇవాళ కూకట్పల్లి, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమైన ఆయన.. పార్టీ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై కీలక సూచనలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలలో టీఆర్ఎస్ బలంగా ఉందని తెలిపారు.. పార్టీ ఉంటేనే పదవులు ఉంటాయి.. ఆ పార్టీ కోసం అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు.. ఇక, రాష్ట్ర ప్రజలకు, పార్టీ అధినేత,…
షార్ట్ సర్క్యూట్ కారణంగా గాంధీ ఆస్పత్రిలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆస్ప్రతి సిబ్బంది, రోగులు బయటకు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ) రమేష్ రెడ్డి ఆస్ప్రతిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఫైర్ సిబ్బంది 15 నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఆస్పత్రిసిబ్బంది, రోగులకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. ఆస్పత్రిలో ఉపయోగించే పరికరాలు పాడవ్వలేదన్నారు రమేష్ రెడ్డి . 120 మంది పేషంట్లను…
సికింద్రాబాద్లోని గాంధీ ఆస్ప్రతి అగ్నిప్రమాదం జరిగింది.. లేబర్ రూమ్లోషార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ బ్లాక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్రమంగా మంటలు థర్డ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు వ్యాపించాయి. ఊహించని ఘటనతో షాక్ తిన్న సిబ్బంది, రోగులు.. భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. పలువురు రోగులు ఆస్పత్రిలోపలే ఉండిపోయారు.. దీంతో మంటల్లో చిక్కుకు పోయిన రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. వెంటనే…
మధ్యప్రదేశ్లో మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్-నబీ ఉరేగింపులో మంగళవారం అల్లర్లు చెలరేగాయి. మధ్యప్రదేశ్ లోని దార్, భర్వాని, జబల్పూర్ జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లో కూడా తీవ్రంగా అల్లర్లు చెలరేగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేశారు.
తన ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది తెలంగాణ ఆర్టీసీ.. ప్రయాణికులకు అందిస్తున్న సేవలలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.. ఇప్పటి వరకు నగదు చెల్లింపుల ద్వారానే ఆర్టీసీ లావాదేవీలు నిర్వహిస్తుండగా.. క్రమంగా డిజిటలైజేషన్కు ప్రాధాన్యత ఏర్పడిన సమయంలో.. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. యూపీఐ/క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులను స్వీకరించడానికి ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది ఆర్టీసీ.. మొదటగా.. మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్సెల్, కార్గో సెంటర్ అలాగే రేథిఫైల్ బస్ స్టేషన్ (సికింద్రాబాద్)…
తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు సంచలనం సృష్టించింది.. 2019లో జయరాం అత్యంత దారుణంగా హత్యకు గురికాగా.. మరోసారి ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.. ఏకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్నే నిందితులు బెదిరించండం సంచలనంగా మారింది.. ఈ హత్య కేసు నుంచి బయటపడేందుకు సాక్షులు, పీపీకి బెదిరింపు లేఖలు రాసినట్టుగా గుర్తించారు.. ముఖ్యమైన సాక్షులను బెదిరించి కేసు నుండి బయట పడేందుకు పక్కా ప్లాన్ వేశారు నిందితులు.. జైలులో ఉన్న రాకేష్…
ఆంధ్రప్రదేశ్ నర్సీపట్నం _అన్నవరం-విజయవాడ-సూర్యాపేట మీదుగా గంజాయి తరలిస్తున్న నిందితుడు వనపల్లి నాగసాయి అరెస్ట్ చేశారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. దీని పై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… నగరంలో ఉన్న ఏజెంట్ల సాయంతో గంజాయి విక్రయిస్తున్న నిందితుడు… దేశంలోని పలు నగరాల్లో ఉన్న స్థానిక ఏజెంట్ల తో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసాడు నిందితుడు. అవసరం ఉందని ఆర్డర్ రాగానే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గంజాయి సాగు చేసే వారితో డీల్ చేస్తాడు.…