బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ (జూలై 2న) తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. తీవ్ర జ్వరంతోనే కేసీఆర్ హాస్పిటల్ లో చేరారని, పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనకు షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగినట్టు ఆసుపత్రి వైద్యుల బృందం పేర్కొన్నారు. అలాగే, సోడియం లెవెల్స్ కూడా భారీగా పడిపోయాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని యశోద ఆస్పత్రి…
తెలంగాణలో నేటి నుంచి పది రోజుల పాటు ఊరువాడ ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించనున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు మహిళా శక్తి విజయాలను పురస్కరించుకొని సంబరాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కొత్త సభ్యులను చేర్పించేలా అన్ని స్థాయిల్లో కళా జాతాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా బ్యాంకు రుణాలు, మహిళా సంఘాలకు వడ్డీలు, ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కుల పంపిణీ చేయనున్నారు. Also Read:Bihar: పాట్నాలో దారుణం..…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిపించాలని టార్గెట్ ఫిక్స్ చేసిందట అధిష్టానం. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది.
Telangana CM: ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సామాజిక న్యాయం సమరభేరి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి.. కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చిన చోట బాధ పడకండి.. మీకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది అని భరోసా ఇచ్చారు.
CM Revanth Reddy: హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయం సమరభేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మాకు తిరుగులేదని అహంకారంతో విర్రవిగిన కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమి కొట్టింది మీరు.. ఇదే వేదిక నుంచి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసుకున్నాం.. ప్రతీ గుండె తడుతూ పరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు.
Election Commission: తెలంగాణ రాష్ట్రంలోని 13 గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సీ. సుధర్శన్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
రేవంత్ రెడ్డి డిమాలిషన్ మాన్, ఇపుడు డైవర్షన్ మాన్ అని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ లీజుపై రేవంత్ ఎన్నో మాట్లాడారు.. ఇపుడు ఏమీ చేయడం లేదన్నారు. బీఆర్ఎస్- కాంగ్రెస్ హై కమాండ్స్ ఎప్పుడో ములాఖత్ అయ్యాయని ఆరోపించారు. కుటుంబ పార్టీలకి కాకుండా బీజేపీకి ఓటు వేయాలని బూర నర్సయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు.
మన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర వేయాలి.. మనందరం కలిసికట్టుగా ఈరోజు నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుని కష్టపడి మళ్లీ రెండోసారి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకు రావాలని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన అరుదైన ఘనత మల్లికార్జున ఖర్గేది.. వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Allu Aravind : సినీ నిర్మాత అల్లు అరవింద్ కు ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నడూ ఎలాంటి కేసుల్లో ఇరుక్కోని అరవింద్ సడెన్ గా ఈడీ ముందు హాజరుకావడం సంచలనం రేపింది. ఆయన్ను మూడు గంటల పాలు అధికారులు ప్రశ్నించారు. ఓ బ్యాంక్ స్కామ్ లో ఆయన్ను ప్రశ్నించారు 2018- 19 మధ్య రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అండ్ రామకృష్ణ టెలోక్ట్రానిక్స్ పేరుతో రెండు సంస్థలు ఏర్పాటు చేశారు. ఈ రెండు సంస్థలు కలిసి యూనియన్ బ్యాంక్…
డీమార్ట్ స్టోర్ లలో కాస్త తక్కువ ధరలకే కావాల్సిన సరుకులు లభిస్తుండడంతో కస్టమర్లు క్యూ కడుతుంటారు. గృహోపకరణాలు, వంటింటి సామాన్లు, దుస్తులు ఇలా ఒకటేమిటి డీమార్ట్ లో దాదాపు అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి. అయితే ఇటీవల కొంతమంది కస్టమర్లు డీమార్ట్ లోకి వెళ్లి చాక్లెట్స్ తినడం, నట్స్ తిని డీమార్ట్ సిబ్బందికి దొరక్కుండా ఎలా తప్పించుకోవాలో చెప్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఘటనలు తెలిసిందే. కాగా తాజాగా ఓ కస్టమర్…