సరోగసీ ముసుగులో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సాగించిన మోసాలు అన్ని ఇన్ని కావు. గత కొన్ని రోజులుగా సృష్టి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. సృష్టి తరహాలో మేడ్చల్లో మరో అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) సెంటర్లపై పోలీసుల దాడి చేసి అసలు గుట్టు రట్టు చేశారు. క్లినిక్ల ముసుగులో అక్రమంగా సరోగసి చేస్తున్న 6 క్లినిక్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లోనే సరోగసి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తున్న భార్య భర్తలను…
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్రంగా వాడుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుసినప్పుడు గతంలో పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి భేరీజు వేడుకోండన్నారు. ఎంత భారీ వర్షం పడినా గంటా, రెండు గంటల వ్యవధిలోనే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి.. వరద నీటిని మళ్లించడంలో హైడ్రా బాగా పని చేస్తోందని ప్రశంసించారు. అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోవడం, చెరువుల పునరుద్ధరణలో హైడ్రా సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్…
బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్థాన్ యువకుడి రాసలీలలు వెలుగుచూశాయి. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తుండగా కీర్తి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పాకిస్థాన్ యువకుడు ఫహద్. హిందూ అమ్మాయిని మతం మార్చి 2016 లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కీర్తి పేరును దోహా ఫాతిమా గా మార్చాడు. ఆ తర్వాత సిపాల్ కంపెనీలో పనిచేసిన మరో మహిళతో పాకిస్థాన్ యువకుడు ఫహద్ అక్రమసంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో…
Old Building Collapses in Begum Bazar: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జోరు వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు భారీ వర్షాలకు నగరంలోని బేగంబజార్లో ఓ పురాతన బిల్డింగ్ కుప్పకూలింది. ఘటన సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. Also Read: Coolie Review: రజనీకాంత్ ‘కూలీ’ రివ్యూ! భవనం…
హైదరాబాద్ నగరంలోకి బంగ్లాదేశ్ వాసులు భారీగా చొరబడ్డారు. హైదరాబాద్, సైబరాబాద్ శివారు ప్రాంతాల్లో అక్రమ వలసదారులు భారీ సంఖ్యలో నివసిస్తున్నారు. హైదరాబాద్లోకి అక్రమంగా వచ్చిన వారిని పోలీసులు గుర్తిస్తున్నారు. ఇప్పటికే 20 మంది అక్రమ బంగ్లాదేశ్ వలస దారులను పోలీసులు పట్టుకున్నారు. 20 మంది బంగ్లాదేశ్ వాసులను పట్టుకొని.. భారత సరిహద్దు ప్రాంతంలో ఉన్న బీఎస్ఎఫ్కు తెలంగాణ పోలీసులు అప్పగించారు. Also Read: Crime News: మైలపోలు తీస్తుండగా పెళ్లి ఆపిన పోలీసులు.. ఆఖరి నిముషంలో ఏం…
Hyderabad Rains Today: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ‘హైడ్రా’ అప్రమత్తమైంది. 24/7 సేవలందించే పనిలో నిమగ్నమైంది. రహదారులపై నీరు నిలవకుండా.. ఎప్పటికప్పుడు క్యాచ్పిట్లలో, కల్వర్టుల్లో చెత్తను తొలగిస్తూ వరద సాఫీగా సాగేలా హైడ్రా బృందాలు పని చేస్తున్నాయి. నగర వ్యాప్తంగా 436 ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని హైడ్రా గుర్తించింది. ఇందులో 150 ప్రాంతాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఆ ప్రాంతాల్లో హెవీ మోటార్లు ఏర్పాటు చేయడమే కాకుండా.. వరద సాఫీగా వెళ్లేలా ఏర్పాట్లను చేసింది.…
మంగళవారం హైదరాబాద్ చందానగర్లోని ఖాజానా జ్యువెలరీ షాప్లో దొంగలు దోపిడీకి ప్రయత్నించిన విషయం తెలిసిందే. పట్టపగలు తుపాకులతో చొరబడిన దుండగులు 10 నిమిషాల పాటు షాప్లో బీభత్సం సృష్టించారు. ఖాజానా జ్యువెలరీ సిబ్బందిలో ఒకరిపై కాల్పులు జరిపి.. వెండి వస్తువులు, 1గ్రామ్ గోల్డ్ ఆభరణాలతో పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం 12 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై తాజాగా మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ స్పందించారు. ఈ కేసును ఛాలెంజ్గా…
తెలుగు సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా వేతన పెంపు వివాదం కారణంగా నిలిచిపోయిన చిత్రీకరణల సమస్యను పరిష్కరించేందుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మధ్య చివరి దశ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సాంకేతిక, ఆర్థిక, మరియు నిర్మాణ సవాళ్లపై విస్తృతంగా చర్చించారు. ఈ కీలక సమావేశంలో ఫెడరేషన్ తరపున కోఆర్డినేషన్ ఛైర్మన్ వీరశంకర్, యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన…
Srushti Ivf Center : ఆ ఆడవాళ్లు.. అమ్మతనాన్ని అంగట్లో పెట్టారు. అలాంటి వాళ్లను.. ఆడవాళ్లు అనేకంటే కిరాతకులని చెప్పవచ్చు. 18 మంది ఆడవాళ్లు కలిసి ఏకంగా ఒక ముఠాగా ఏర్పడ్డారు. అమ్మతనం కోసం వెంపర్లాడుతున్న మహిళలు టార్గెట్గా చేసుకొని నీచపు దందాకు తెగబడ్డారు. కోట్ల రూపాయలు సంపాదించారు. డాక్టర్ నమ్రత గ్యాంగ్లో మొత్తం 18 మంది సభ్యులు ఉన్నారు. తల్లితనం కోసం తల్లడిల్లుతున్న వారిని టార్గెట్ చేసుకుని.. IVF పేరుతో ఆ తర్వాత సరోగసీ పేరుతో…
Khazana Jewellery : సాధారణంగా దొంగతనాలు అర్ధరాత్రి దాటాకే జరుగుతుంటాయి. కానీ ఈసారి హైదరాబాద్లో దోపిడీ దొంగలు రూట్ మార్చారు. అర్ధరాత్రి తాళాలు పగలగొట్టడం లేదా గోడలకు కన్నాలు పెట్టడం..లాంటివి రిస్క్ అనుకున్నారో ఏమో.. తెల్లవారి షాపు తెరిచిన వెంటనే లోపలికి చొరబడ్డారు. నిజానికి భారీగా బంగారు ఆభరణాలు దోచుకుందామని జువెలరీ షాపుకు వచ్చారు. కానీ వారికి వెండి ఆభరణాలు తప్ప మరేమీ దొరకలేదు. తుపాకులతో కొద్దిసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. ఉదయం 10:30 గంటల సమయం..…