Khazana Jewellery Robbery: కేసును ఛాలెంజ్గా తీసుకున్నాం.. త్వరలోనే ఛేదిస్తాం: డీసీపీ
- చందానగర్లోని ఖాజానా జ్యువెలరీ షాప్లో దొంగలు
- పట్టపగలు తుపాకులతో చొరబడిన దుండగులు
- కేసును ఛాలెంజ్గా తీసుకున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళవారం హైదరాబాద్ చందానగర్లోని ఖాజానా జ్యువెలరీ షాప్లో దొంగలు దోపిడీకి ప్రయత్నించిన విషయం తెలిసిందే. పట్టపగలు తుపాకులతో చొరబడిన దుండగులు 10 నిమిషాల పాటు షాప్లో బీభత్సం సృష్టించారు. ఖాజానా జ్యువెలరీ సిబ్బందిలో ఒకరిపై కాల్పులు జరిపి.. వెండి వస్తువులు, 1గ్రామ్ గోల్డ్ ఆభరణాలతో పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం 12 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై తాజాగా మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ స్పందించారు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్నాం అని, త్వరలోనే ఛేదిస్తాం అని చెప్పారు.
డీసీపీ వినీత్ కుమార్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఖజానా జ్యువెలరీ దోపిడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశాం. 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టాము. ఘటన అనంతరం గోల్డెన్ అవర్ టైం లీడ్ తీసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఎస్ఓటీ పోలీసులు, సీసీఎస్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ ఆర్మడ్ ఫోర్సెస్ టీమ్స్ పని చేస్తున్నాయి. ఈ కేసులో కొన్ని లీడ్స్ వచ్చాయి. టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నాం. దొంగలు రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. ఖజానా జ్యువెలరీ సిబ్బంది నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. డే అండ్ నైట్ మా పోలీస్ టీమ్స్ గాలిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల బోర్డర్, ఆయా జిల్లాల పోలీసులని అప్రమత్తం చేశాం. ఏ క్షణంలోనైనా దుండగులని పట్టుకుంటాం. దొంగలు రాబరీ కోసం అటెంప్ట్ చేసిన తీరు పరిశీలిస్తే మధ్యప్రదేశ్, హర్యానా, బీదర్ రాష్ట్రల చెందిన దోపిడి దొంగల ముఠాలు అనుమానిస్తున్నాం. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ప్రత్యేకంగా ఈ కేసు మానిటరింగ్ చేస్తున్నారు. దుండగులను త్వరలో పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెడతాం. ఈ కేసు ఛాలెంజ్గా తీసుకున్నాం, త్వరలోనే ఛేదిస్తాం’ అని మాదాపూర్ డీసీపీ చెప్పారు.
Also Read
- Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
- CM Revanth Reddy: శాసనసభలో చర్చిద్దామా..? బీఆర్ఎస్కు ఓపెన్ ఛాలెంజ్ చేసిన సీఎం రేవంత్..
- PM Modi: మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణం.. పిల్లలతో సంభాషణ
- Pappu Yadav: భారీగా సన్నబడ్డ పప్పు యాదవ్.. గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
-
Tortoise: ప్రతి 25 నిమిషాలకూ ఓ బాంబ్ లాంటి ట్విస్ట్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!
-
CM Revanth Reddy: శాసనసభలో చర్చిద్దామా..? బీఆర్ఎస్కు ఓపెన్ ఛాలెంజ్ చేసిన సీఎం రేవంత్..
-
PM Modi: మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణం.. పిల్లలతో సంభాషణ
-
R. Narayana Murthy: ‘కామ్రేడ్’ పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!