Khazana Jewellery Robbery: కేసును ఛాలెంజ్గా తీసుకున్నాం.. త్వరలోనే ఛేదిస్తాం: డీసీపీ
- చందానగర్లోని ఖాజానా జ్యువెలరీ షాప్లో దొంగలు
- పట్టపగలు తుపాకులతో చొరబడిన దుండగులు
- కేసును ఛాలెంజ్గా తీసుకున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళవారం హైదరాబాద్ చందానగర్లోని ఖాజానా జ్యువెలరీ షాప్లో దొంగలు దోపిడీకి ప్రయత్నించిన విషయం తెలిసిందే. పట్టపగలు తుపాకులతో చొరబడిన దుండగులు 10 నిమిషాల పాటు షాప్లో బీభత్సం సృష్టించారు. ఖాజానా జ్యువెలరీ సిబ్బందిలో ఒకరిపై కాల్పులు జరిపి.. వెండి వస్తువులు, 1గ్రామ్ గోల్డ్ ఆభరణాలతో పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం 12 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై తాజాగా మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ స్పందించారు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్నాం అని, త్వరలోనే ఛేదిస్తాం అని చెప్పారు.
డీసీపీ వినీత్ కుమార్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఖజానా జ్యువెలరీ దోపిడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశాం. 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టాము. ఘటన అనంతరం గోల్డెన్ అవర్ టైం లీడ్ తీసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఎస్ఓటీ పోలీసులు, సీసీఎస్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ ఆర్మడ్ ఫోర్సెస్ టీమ్స్ పని చేస్తున్నాయి. ఈ కేసులో కొన్ని లీడ్స్ వచ్చాయి. టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నాం. దొంగలు రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. ఖజానా జ్యువెలరీ సిబ్బంది నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. డే అండ్ నైట్ మా పోలీస్ టీమ్స్ గాలిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల బోర్డర్, ఆయా జిల్లాల పోలీసులని అప్రమత్తం చేశాం. ఏ క్షణంలోనైనా దుండగులని పట్టుకుంటాం. దొంగలు రాబరీ కోసం అటెంప్ట్ చేసిన తీరు పరిశీలిస్తే మధ్యప్రదేశ్, హర్యానా, బీదర్ రాష్ట్రల చెందిన దోపిడి దొంగల ముఠాలు అనుమానిస్తున్నాం. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ప్రత్యేకంగా ఈ కేసు మానిటరింగ్ చేస్తున్నారు. దుండగులను త్వరలో పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెడతాం. ఈ కేసు ఛాలెంజ్గా తీసుకున్నాం, త్వరలోనే ఛేదిస్తాం’ అని మాదాపూర్ డీసీపీ చెప్పారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!