Hydra Marshals: వీక్ ఆఫ్ ఇవ్వడం లేదు.. అధికారులు అరేయ్, ఒరేయ్ అంటున్నారు!
- విధులు బహిష్కరించిన హైడ్రా మార్షల్స్
- హైదరాబాద్ నగరంలో నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు
- 45 వేలు జీతం ఇవ్వాలని డిమాండ్
- అధికారులు గౌరవం ఇవ్వడం లేదు
Hydra Marshals Comments on Salary Cuts: హైడ్రా మార్షల్స్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వేతనాలు తగ్గించడంతో ఆగ్రహించిన మార్షల్స్.. నేడు తమ విధులను బహిష్కరించారు. దాంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోవడంతో పాటు 51 హైడ్రా వాహనాలు కూడా ఆగిపోయాయి. నగరంలోని 150 డివిజన్లలో హైడ్రా సేవలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. విధుల బహిష్కరణపై మార్షల్స్ స్పందించారు. తమ డైరెక్టర్ జనరల్ ఆదేశాల ప్రకారం తమకు రూ.45 వేలు జీతం ఇవ్వాలని, ఇక్కడ చాలా తక్కువ జీతం ఇస్తున్నారన్నారు. ఇచ్చేది తక్కువ అంటే.. ఇప్పుడు మరలా తగ్గించడం దారుణం అని పేర్కొన్నారు. తమకు సరిపడ జీతం ఇస్తేనే పని చేస్తాం అని మార్షల్స్ స్పష్టం చేశారు.
‘మాకు హైడ్రా నుంచి పే స్కేల్ రూ.22500 అని జీఓ వచ్చింది. మొన్నటి వరకు రూ.29000 జీతం వచ్చేది. దానిపై మాట్లాడానికి రంగనాథ్ గారిని కలవడానికి వచ్చాము. మేము ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాము కాబట్టి పెన్షన్ వస్తుంది. కానీ కొందరు మా పెన్షన్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేము దేశానికి చేసిన సేవను గుర్తించి పెన్షన్ ఇస్తున్నారు. కూలీ పని చేసుకునే వాళ్లకు కూడా జీతం పెరుగుతుంది.. మాకు ఇచ్చే జీతం తగ్గించారు. మాకు సరైన గౌరవం ఇవ్వాలి. మాన్సూన్ ఎమర్జెన్సీ అని కనీసం వీక్ ఆఫ్ ఇవ్వడం లేదు. పైగా గౌరవం ఇవ్వడం లేదు. కొందరు అధికారులు రెస్పెక్ట్ ఇవ్వకుండా.. అరేయ్, ఒరేయ్ అంటున్నారు. మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటాదని గుర్తుంచుకోవాలి’ అని మార్షల్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
Also Read: Bhatti Vikramarka: ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదు.. సమాజానికి అందించే బాధ్యత!
‘కరోనా సమయంలో ఎవ్వరూ ఇంటి నుండి బయటకు రాలేదు. కానీ మేము ప్రాణాలకు తెగించి ముందుకు వచ్చి పని చేశాం. మా సేవకు గుర్తింపుగా జీతాలు పెంచడం పోయి, తగ్గించారు. మా డైరెక్టర్ జనరల్ ఆదేశాల ప్రకారం రూ.45 వేలు జీతం ఇవ్వాలి. కానీ ఇక్కడ చాలా తక్కువ జీతం ఇస్తున్నారు. అందులో ఇప్పుడు తగ్గించడం దారుణం.మాకు సరిపడ జీతం ఇస్తేనే పని చేస్తాం. గతంలో 30 శాతం జీతం పెంచిపిస్తా అని రంగనాథ్ గారు చెప్పారు. కానీ పెంచడం పక్కన పెట్టి, తగ్గించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు రెండు రోజులు, మూడు రోజులు కంటిన్యూగా పని చేస్తున్నాము. జీహెచ్ఎంసీ ఈవీడిఏంలో పని చేసినప్పుడు 8 గంటల డ్యూటీ మాత్రమే ఉండేది. ఇప్పుడు 12 గంటలు, ఆపై సమయం పని చేయిస్తున్నాము. మాకు న్యాయం చేయాలి’ అని మార్షల్స్ కోరారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!