Election Commission: ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల నుంచి రూ.లక్ష దాటిన లావాదేవీలపై నిఘా ఉంచాలని రాష్ట్రాలకు ఈసీ లేఖ రాసింది.
రాష్ట్రంలోని హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ఆరా తీస్తోంది. కాసేపట్లో ఎన్నికల సంఘం ముందు మూడు జిల్లాల ఎస్పీలు హాజరు కానున్నారు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలను తన వద్దకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా ఆదేశించారు.
Lok Sabha Elections 2024 : లోక్సభ ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించినందుకు బిజెపి ప్రభుత్వంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు నమోదైంది.
ఎలక్టోరల్ బాండ్ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కఠినంగా వ్యవహరించింది. ఎలక్టోరల్ బాండ్ల సమాచారం ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎందుకు పూర్తి నంబర్లు ఇవ్వలేదు.. ఎలక్టోరల్ బాండ్ కేసులో ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Electoral Bonds : ఇటీవల కాలంలో ఎలక్టోరల్ బాండ్ల విషయం ఎంతటి సంచలనంగా మారిందో చెప్పాల్సిన పనిలేదు. గత ఐదేళ్లలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అత్యధిక డబ్బును విరాళంగా అందించిన ఫ్యూచర్ గేమింగ్ సంస్థ ఒక్క డీఎంకే పార్టీకి రూ.509 కోట్లు విరాళంగా అందించింది.
తాజాగా భారతదేశ ఎన్నికల సంఘం ఎలక్ట్రోరల్ బాండ్ల సంబంధించి.. పార్టీల వారీగా రిడీమ్ చేసిన మొత్తంతో పాటు బ్యాంకు ఖాతాల సమాచారం లాంటి పూర్తి వివరాలను విడుదల చేసింది. ఈ సమాచారం ఎలక్షన్ కమిషన్ కి ఇదివరకే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుండి డిజిటల్ రూపంలో అందింది. ఎలక్ట్రో ఎలక్టోరల్ బాండ్ డేటాను రాజకీయ పార్టీలు సీల్డ్ కవర్లో ఏప్రిల్ 12, 2019 న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు దాఖలు చేశాయి. అయితే ఇలా చేసిన సీల్డ్…
అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీని మారుస్తూ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు రాష్ట్రాల్లో జూన్ 2న కౌంటింగ్ నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది.
Lok Sabha Elections 2024: ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నట్లు ఈసీ వెల్లడించింది. దాదాపుగా 82 రోజుల సుదీర్ఘ కాలం పాటు ఎన్నికల ప్రక్రియ జరగబోతోంది.