India vs West Indies: “భారత్ ఓడితే షో వదిలేస్తా”.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs West Indies: టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసు ఉత్కంఠ భరితంగా మారింది. నేడు భారత్ వెస్టిండీస్తో తలపడనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ సాగనుంది. ఈ మ్యాచ్ భారతీయుల కంటే పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్, టీవీ షో యాంకర్లకు బాగా ఆసక్తికరంగా మారింది. తాజాగా ఓ టీవీ షోల్ పాకిస్థాన్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భారత్ సూపర్ 8లో ఎలిమినేట్ అవుతుందని పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ అంచనా వేశాడు. దీన్ని షెహజాద్ తీవ్రంగా విమర్శించాడు. భారత్ ఖచ్చితంగా వెస్టిండీస్ను ఓడించి సెమీఫైనల్కు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాదు.. ఈ మ్యాచ్ పై ఛాలెంజ్లు, సవాళ్లు సైతం విసిరాడు అహ్మద్. “భారత్ గెలిస్తే అమీర్ నుంచి జ్యోతిష్కుడు బిరుదు తీసుకుంటాం, భారత్ ఓడితే ఈ షోనే వదిలేస్తా” అంటూ ‘Haarna Mana Hai’ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు. ఈ మాటలతో మ్యాచ్కు ముందు మైండ్ గేమ్స్ మరింత వేడెక్కాయి. ఈ వీడియే కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
READ MORE: Israel-Iran War: ఇరాన్ను ముంచిన “చైనా ఆయుధ వ్యవస్థలు”.. మరోసారి ఘోరంగా విఫలం..
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ఇదిలా ఉండగా.. భారత్, వెస్టిండీస్ మ్యాచ్లో ప్రధాన లక్ష్యం ఒక్కటే. ప్రస్తుతం అన్ని జట్లు బలమైన బ్యాటింగ్ లైనప్తో దాడికి దిగుతున్నాయి. హై రిస్క్ – హై రివార్డ్ స్టైల్ ఇప్పుడు సాధారణమైపోయింది. వెస్టిండీస్ జట్టు ఇందుకు మంచి ఉదాహరణ. దక్షిణాఫ్రికా (ప్రొటియాస్) చేతిలో భారీ ఓటమి ఎదురైనా, వారి బ్యాటింగ్ ఒక్కసారిగా పుంజుకుంది. బ్యాటర్లు అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిశారు. 90 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయినా, నంబర్ 9లో వచ్చిన రొమారియో షెఫర్డ్ 37 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టును 176 పరుగుల దాకా తీసుకెళ్లాడు. నంబర్ 9లో ఇలాంటి ఆటగాడు రావడం చాలా అరుదని భారత అసిస్టెంట్ కోచ్ రయన్ టెన్ డోషాటే సైతం ఒప్పుకున్నాడు. వెస్టిండీస్ మాత్రమే కాదు, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత్ జట్లు బలమైన బ్యాటింగ్తోనే ముందుకు సాగుతున్నాయి. భారత్ తరఫున అక్షర్ పటేల్ లాంటి ఆటగాడు నంబర్ 8లో వస్తే ఊచకోత తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ వికెట్లు పడగొట్టడం భారత్కు చాలా ముఖ్యం. చివరికి ఏం జరుగుతోందో చూద్దాం..
READ MORE: Iran Attacks Oil Tanker: ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి.. నౌకలో భారతీయులు
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!