India vs West Indies: “భారత్ ఓడితే షో వదిలేస్తా”.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్!
India vs West Indies: టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసు ఉత్కంఠ భరితంగా మారింది. నేడు భారత్ వెస్టిండీస్తో తలపడనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ సాగనుంది. ఈ మ్యాచ్ భారతీయుల కంటే పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్, టీవీ షో యాంకర్లకు బాగా ఆసక్తికరంగా మారింది. తాజాగా ఓ టీవీ షోల్ పాకిస్థాన్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భారత్ సూపర్ 8లో ఎలిమినేట్ అవుతుందని పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ అంచనా వేశాడు. దీన్ని షెహజాద్ తీవ్రంగా విమర్శించాడు. భారత్ ఖచ్చితంగా వెస్టిండీస్ను ఓడించి సెమీఫైనల్కు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాదు.. ఈ మ్యాచ్ పై ఛాలెంజ్లు, సవాళ్లు సైతం విసిరాడు అహ్మద్. “భారత్ గెలిస్తే అమీర్ నుంచి జ్యోతిష్కుడు బిరుదు తీసుకుంటాం, భారత్ ఓడితే ఈ షోనే వదిలేస్తా” అంటూ ‘Haarna Mana Hai’ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు. ఈ మాటలతో మ్యాచ్కు ముందు మైండ్ గేమ్స్ మరింత వేడెక్కాయి. ఈ వీడియే కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
READ MORE: Israel-Iran War: ఇరాన్ను ముంచిన “చైనా ఆయుధ వ్యవస్థలు”.. మరోసారి ఘోరంగా విఫలం..
Also Read
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ఇదిలా ఉండగా.. భారత్, వెస్టిండీస్ మ్యాచ్లో ప్రధాన లక్ష్యం ఒక్కటే. ప్రస్తుతం అన్ని జట్లు బలమైన బ్యాటింగ్ లైనప్తో దాడికి దిగుతున్నాయి. హై రిస్క్ – హై రివార్డ్ స్టైల్ ఇప్పుడు సాధారణమైపోయింది. వెస్టిండీస్ జట్టు ఇందుకు మంచి ఉదాహరణ. దక్షిణాఫ్రికా (ప్రొటియాస్) చేతిలో భారీ ఓటమి ఎదురైనా, వారి బ్యాటింగ్ ఒక్కసారిగా పుంజుకుంది. బ్యాటర్లు అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిశారు. 90 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయినా, నంబర్ 9లో వచ్చిన రొమారియో షెఫర్డ్ 37 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టును 176 పరుగుల దాకా తీసుకెళ్లాడు. నంబర్ 9లో ఇలాంటి ఆటగాడు రావడం చాలా అరుదని భారత అసిస్టెంట్ కోచ్ రయన్ టెన్ డోషాటే సైతం ఒప్పుకున్నాడు. వెస్టిండీస్ మాత్రమే కాదు, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత్ జట్లు బలమైన బ్యాటింగ్తోనే ముందుకు సాగుతున్నాయి. భారత్ తరఫున అక్షర్ పటేల్ లాంటి ఆటగాడు నంబర్ 8లో వస్తే ఊచకోత తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ వికెట్లు పడగొట్టడం భారత్కు చాలా ముఖ్యం. చివరికి ఏం జరుగుతోందో చూద్దాం..
READ MORE: Iran Attacks Oil Tanker: ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి.. నౌకలో భారతీయులు
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!