INDIA Bloc: ఎన్నికల కమీషన్ ముందు ఇండియా కూటమి 5 డిమాండ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA Bloc: ఢిల్లీ రామ్ లీలా మైదానం వేదికగా ఇండియా కూటమి నేతలు మహార్యాలీని నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేయడంపై బీజేపీపై విరుచుకుపడ్డారు. ఈడీ, ఐటీ, సీబీఐలతో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. అయితే, ‘‘సేవ్ ఫ్యామిలీ’’, ‘‘అవినీతిని దాచిపెట్టు’’ అనే దాని కోసమే ఈ ర్యాలీని ప్రతిపక్షాలు నిర్వహించాయని బీజేపీ ఆరోపించింది.
ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికల కమీషన్(ఈసీ)కి 5 డిమాండ్లను చేసింది.
Also Read
- Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
* కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నిధులను స్తంభింపచేయడం, ఐటీ శాఖ నోటీసుల గురించి ప్రస్తావిస్తూ.. ప్రతిపక్ష పార్టీల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం ఆపాలని కోరారు.
* ఈడీ, సీబీఐ, ఐటీ శాఖ చర్యలను నిలిపేయాలని డిమాండ్ చేశారు.
* ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ ద్వారా బిజెపి “దోపిడీ” చేసిన నిధులను సుప్రీం కోర్టు పర్యవేక్షించే ద్వారా ప్రత్యేక దర్యాప్తు బృందం చేత దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
* లోక్సభ ఎన్నికల్లో అందరికి సమాన అవకాశాలు ఉండేలా చూడాలి.
* హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్ని తక్షణమే విడుదల చేయాలి.
ఈ ఎన్నికల తర్వాత బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోందని, ఆ తర్వాత దేశం మంటల్లో కూరుకుపోతుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం కావాలో, నియంతృత్వం కావాలో తేల్చుకోవాలని ప్రజలే నిర్ణయించుకోవాలని మల్లికార్జున ఖర్గే అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదని ఒక సిద్ధాంతమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.
తాజావార్తలు
-
AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
-
TheParadise : నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
-
AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం…
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!