ఎన్నికల సమయంలో కనిపించే హడావుడి మణిపుర్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక, ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన హోర్డింగులు మాత్రమే కనిపిస్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు ,మార్కాపురం,బాపట్ల సభల్లో చంద్ర బాబు ఎన్నికల ప్రచార ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ ఫిర్యాదు చేసింది.
జనసేన పార్టీని వదలని సింబల్ టెన్షన్ కొనసాగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాస్ ఉంది. దీంతో ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు కేటాయించొద్దని కోర్టులో జనసేన పిటిషన్ దాఖలు చేసింది.
రాబోయే లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇవాళ ( సోమవారం ) తొలిసారి భేటీ అయింది. సీనియర్ బీజేపీ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల మేనిఫెస్టో కమిటీలో పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి నలుగురు ముఖ్యమంత్రులతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు.
INDIA Bloc: ఢిల్లీ రామ్ లీలా మైదానం వేదికగా ఇండియా కూటమి నేతలు మహార్యాలీని నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేయడంపై బీజేపీపై విరుచుకుపడ్డారు.
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటనను రిలీజ్ చేసింది. లోక్సభ ఎన్నికలు 2024లో ప్రారంభ దశ ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి ఏడవ దశ పోలింగ్ జరగాల్సిన జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది.
ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ఇండియా కూటమి తలపెట్టిన భారీ ర్యాలీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
Voting Rule: తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులైన ఓటర్లను పోలింగ్ స్టేషన్కి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల సంఘం చెబుతోంది. ఇదే తరుణంలో పోలింగ్ బూత్లో ప్రిసైడింగ్ అధికారి ముందు తన గుర్తింపును నమోదు చేసుకున్న తర్వాత కూడా ఓటేయడానికి నిరాకరించిన ఓటర్లను అధికారులు బలవంతం చేయలేరని ఓటింగ్ రూల్స్ తెలియజేస్తున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అనుమతి లేకుండా ఇంటింటికి ప్రచారం చేపడితే కేసులు తప్పవని తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ అంశం సంబంధించి ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఆంక్షలు పెట్టడంతో రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్ కమిషన్ కు అభ్యంతరాలు తెలుపుతున్నాయి. Also read: Game Changer : జరగండి జరగండి.. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ వచ్చేనండి.. తాజాగా…