Voting Rule: బూత్లో ఓటేయడానికి తిరస్కరిస్తున్న ఓటర్లను అధికారులు బలవంతం చేయలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Voting Rule: తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులైన ఓటర్లను పోలింగ్ స్టేషన్కి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల సంఘం చెబుతోంది. ఇదే తరుణంలో పోలింగ్ బూత్లో ప్రిసైడింగ్ అధికారి ముందు తన గుర్తింపును నమోదు చేసుకున్న తర్వాత కూడా ఓటేయడానికి నిరాకరించిన ఓటర్లను అధికారులు బలవంతం చేయలేరని ఓటింగ్ రూల్స్ తెలియజేస్తున్నాయి.
నోటా కింద ఈ హక్కుని ఓటర్లు కలిగి ఉన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి 1961 రూల్ 49-O కింద ఈ హక్కును వినియోగించుకోవచ్చు. పోలింగ్ సెంటర్కి చేరుకున్న తర్వాత కూడా ఓటర్లు ఈ హక్కుని వినియోగించుకోవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. NOTA (నన్ ఆఫ్ ది ఎబోవ్) అనేది ఏ అభ్యర్థి నచ్చకపోయినప్పుడు ఓటర్ ఎంచుకునే ఒక ఆప్షన్. తమకు ఏ అభ్యర్థిపై విశ్వాసం లేదని చెబుతుంది. అయితే ‘ఓటు తిరస్కరణ’ అనేది పోలింగ్ ప్రక్రియను పూర్తిగా విస్మరించడానికి అనుమతిస్తుంది.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
49-O నిబంధన ప్రకారం.. ఒకసారి ప్రిసైడింగ్ అధికారి ఓటర్ ఆధారాలను ధృవీకరించిన తర్వాత, బూత్లో ఓటేయడానికి నిరాకరిస్తే, అధికారి ఫారం 17 Aలో ఓటర్ సంతకం లేదా, బొటనవేలు ముద్రకు వ్యతిరేకంగా ఈ విషయాన్ని పొందుపరచాలి. ఇది కొత్తగా సంక్రమించిన హక్కు కాదని, అయితే ఓటర్కి దీనిపై పెద్దగా అవగాహన లేదని ఈసీ అధికారులు చెబుతున్నారు.
Read Also: Mahesh Babu : మహేష్ బాబు వెళ్లింది దుబాయ్ కి కాదా..అక్కడకు ఎందుకు వెళ్లాడు?
49-O నిబంధన బోగస్ ఓటింగ్ని పర్యవేక్షిస్తూనే, అభ్యర్థులందరిని తిరస్కరించే అవకాశాన్ని కల్పిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశం అంతటా ఇతర కారణాల వల్ల 1389 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నియమం ప్రకారం.. ఒక వేళ ఓటర్ తన ఎలక్టోరల్ రోల్ నంబర్ని అనుసరించి, అలాగే తన సంతకం లేదా బొటనవేలు ముద్రను ఫారం 17Aలో సక్రమంగా నమోదు చేసిన తర్వాత, ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటే, ఓటు వేయమని బలవంతం చేయకూడదు. ఫారంలో, ఓటర్ల రిజిస్టర్లో సంతకం చేసిన తర్వాత ఓటు వేయకుండా వెళ్లిపోవాలనుకునే ఓటర్లకు ‘అండర్ రూల్’ స్థానంలో, ఓటు వేయకుండా వదిలేయబడుతుంది లేదా ఓటు వేయడానికి నిరాకరించాడని చేర్చబడుతుంది.
ఒక వేళ ఈవీఎంలో ఓటేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, ఓటేయడానికి ఓటర్ నిరాకరిస్తే ఆ సమయంలో ప్రిసైడింగ్ అధికారి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తారు. ఒకవేళ ఓటర్ ఓటేయడానికి బటన్ నొక్కితే, ప్రిసైడింగ్ అధికారి కంట్రోల్ యూనిట్ని రీబూట్ చేయడం, VVPATని డిస్కనెక్ట్ చేయాలి. బిజీ ఇండికేటర్ ఆఫ్ అయిన తర్వాత పవర్ స్విచ్ ఆన్ చేయాలి.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!