Internet Shutdown: శ్రీనగర్లో ఇంటర్నెట్ క్లోజ్.! భారీ నిరసనలతో అలజడి.!
- భారీ నిరసనలు.. శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- పుకార్ల నివారణకే నిర్ణయం.. భద్రతా వర్గాల స్పష్టం
- రోడ్లపై నిరసనకారులు.. కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం
- కర్ఫ్యూ తరహా ఆంక్షలు.. అదనపు బలగాల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం జమ్మూ కాశ్మీర్లో తీవ్ర అలజడి సృష్టించింది. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించారన్న వార్త తెలియగానే శ్రీనగర్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారకుండా ఉండేందుకు, శాంతిభద్రతలను కాపాడేందుకు అధికారులు శ్రీనగర్ అంతటా మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు లోయలో అదనపు భద్రతా బలగాలను మోహరించారు.
Vishnu Vinyasam: బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు హవా.. రెండు రోజు కలేక్షన్ ఎంత అంటే..?
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
శ్రీనగర్తో పాటు కాశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. భద్రతా బలగాల చర్యలను నిరసిస్తూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్ట్లు వెలువడకుండా ఉండేందుకు అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను స్తంభింపజేశారు.
అకస్మాత్తుగా ఇంటర్నెట్ నిలిపివేయడంతో శ్రీనగర్ నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ సేవలు, విద్యార్థుల చదువులు , బ్యాంకింగ్ లావాదేవీలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడమే కాకుండా, అదనపు బలగాలను మోహరించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు సూచించారు. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ లాంటి ఆంక్షలు కూడా విధించినట్లు సమాచారం. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, పుకార్లను నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి శ్రీనగర్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, భద్రతా బలగాలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి.
Vishnu Vinyasam: బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు హవా.. రెండు రోజు కలేక్షన్ ఎంత అంటే..?
తాజావార్తలు
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!