Sexual assault on girl: దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలుడు 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మాణంలో ఉన్న భవనంలో దొంగతనం చేయాలని ప్రవేశించిన బాలుడు అక్కడే పనిచేస్తున్న 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. వాయువ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో మంగళవారం ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది.
భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ పరారీలో ఒకరైన దీపక్ బాక్సర్ను పట్టుకున్నారు. మెక్సికోలో పోలీసు అధికారులకు పట్టుబడిన దీపక్ బాక్సర్ను బుధవారం న్యూఢిల్లీకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
Delhi Hit And Drag Case: కొత్త సంవత్సరం తొలిరోజున ఢిల్లీలో యువతిని ఢీకొట్టి దాదాపుగా 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దాదాపుగా 13 కిలోమీటర్ల మేర కారుతో ఈడ్చుకెళ్లారు. కారు కింద చిక్కుకుపోయిన యువతి తీవ్ర గాయాలపాలై మరణించింది. ఈ కేసులో తాజాగా ఢిల్లీ పోలీసులు 800 పేజీల ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నారు. ఛార్జిషీట్ లో 117 మంది సాక్షులను చేర్చింది. ఐదుగురు…
Rahul Gandhi: మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయన్న వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ పోలీసులు ఆదివారం ఆయన ఇంటికి వెళ్లారు. ఈ వ్యాఖ్యలపై ఆయన నుంచి వివరాలు కోరుతున్నారు పోలీసులు. ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సాగర్ ప్రీత్ హుడా నేతృత్వంలోని పోలీస్ టీం తుగ్లక్ లేన్ లో ఉన్న రాహుల్ ఇంటికి వెళ్లింది.
ఢిల్లీలోని రాహుల్గాంధీ నివాసానికి ఆదివారం ఢిల్లీ పోలీసులు వెళ్లారు. ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన “మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారు” అనే వ్యాఖ్యకు సంబంధించి ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఈరోజు ఆయన నివాసానికి చేరుకున్నారు.
Shraddha Walkar Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో పోలీసులు కోర్టులో విస్తూపోయే నిజాలు చెబుతున్నారు. గతేడాది శ్రద్ధావాకర్ ను ఆమె బాయ్ ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా చంపేసి అత్యంత దారుణంగా శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. కొన్ని రోజలు పాటు ఫ్రిజ్ లో నిల్వచేసి ఢిల్లీ శివారు ప్రాంతమైన మోహ్రౌలి సమీపంలోని అడవుల్లో పారేశారు. శ్రద్ధావాకర్ తండ్రి మిస్సింగ్ కేసు పెట్టడంతో ఆరు నెలల తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుడిపై ఆరోపణలను ధ్రువపరిచే ఆధారాలను ఢిల్లీ పోలీసులు కోర్టులో వెల్లడించారు. ఈ వాదనలో పోలీసులు కీలక విషయాలను తెలిపారు.
Delhi Girl Murder: ఢిల్లీలో ఇటీవల 11 ఏళ్ల బాలిక ఆచూకీ కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత హత్యకు గురై శవంగా దొరికింది. అయితే ఈ కేసును ఓ మిస్డ్ కాల్ ఆధారంగా పోలీసులు ఛేదించారు. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో బాలిక కనిపించకుండా పోయిన రోజున ఆమె తల్లికి తెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది.
గ్యాంగ్స్టర్లపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. గ్యాంగ్స్టర్లు, టెర్రర్ గ్రూపులు, డ్రగ్స్ మాఫియా మధ్య సంబంధానికి సంబంధించిన కేసులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఎనిమిది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తోందని అధికారులు తెలిపారు.