Cyber Crime: రిటైర్డ్ ఇంజనీర్పై వలపు వల.. రూ.4 కోట్లు నొక్కేసిన కిలాడీ
- రిటైర్డ్ ఇంజనీర్పై వలపు వల
- రూ.4 కోట్లు నొక్కేసిన కిలాడీ
- మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా సైబర్ నేరాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా థానేలో సెక్స్టార్షన్ కేసు వెలుగు చూసింది. ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఇంజనీర్పై మహిళ వలపు వల విసిరింది. అందులో చిక్కుకున్న వృద్ధుడు రూ.4 కోట్లు వదిలించుకున్నాడు. దీంతో బాధితుడు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ, ఆమె అనుచరులు రిటైర్డ్ ఇంజనీర్ (62)ను ఉచ్చులోకి లాగారు. ఒక మహిళ భావోద్వేగంతో రెచ్చగొట్టింది. దీంతో అతడు ఆమె వలలో చిక్కుకున్నాడు. అనంతరం నెమ్మది నెమ్మదిగా బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది.
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
ఇది కూడా చదవండి: PCB Decision: భారత్–పాక్ మ్యాచ్.. హై వోల్టేజ్ పోరుపై పీసీబీ సంచలన నిర్ణయం?
జూలై 17, 2025న బాధితుడికి తెలియని వాట్సాప్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తడంతో ఒక మహిళ మాట్లాడుతూ వ్యాపారం గురించి చర్చించింది. అంతర్జాతీయ వ్యాపారాలతో కోట్లు గడించవచ్చని నమ్మించింది. అటు తర్వాత నెమ్మది.. నెమ్మదిగా వలపు వల విసిరింది. ప్రేమ కురిపిస్తూ నటించింది. నిజమే అనుకుని వృద్ధుడు నమ్మేశాడు. అనంతరం అమెరికాలో తన మామ ద్వారా మంచి లాభదాయక వ్యాపారం ఉందని నమ్మ బలికింది. అటు తర్వాత ట్రేడింగ్ ఖాతా లింక్ పంపించింది. 7 నెలల్లో వివిధ ఖాతాల నుంచి లావాదేవీలు జరిగాయి. అయితే గత నెలలో విత్డ్రా చేసుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా మోసం బయటపడింది. ఆ మహిళ నుంచి అసభ్యకరమైన సందేశాలు, ఫొటోలు రావడం ప్రారంభమయ్యాయి. నగ్న ఫొటోలను పంపించాలని ఒత్తిడి పెరిగింది.
ఈ క్రమంలో జనవరి 25న ఒక వ్యక్తి ఫోన్ చేసి మహిళ మామగా పరిచయం చేసుకున్నాడు. రూ.2 కోట్ల ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానని బెదిరించాడు. దీంతో చేసేదేమీలేక మొత్తానికి ఏడు నెలల్లో దాదాపు రూ.4 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
ఇది కూడా చదవండి: PUBG: ప్రాణం తీసిన పబ్జీ .. మెదడులో రక్తస్రావం జరిగి యువకుడు మృతి
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
-
Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!