Cyber Crime: రిటైర్డ్ ఇంజనీర్పై వలపు వల.. రూ.4 కోట్లు నొక్కేసిన కిలాడీ
- రిటైర్డ్ ఇంజనీర్పై వలపు వల
- రూ.4 కోట్లు నొక్కేసిన కిలాడీ
- మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా సైబర్ నేరాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా థానేలో సెక్స్టార్షన్ కేసు వెలుగు చూసింది. ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఇంజనీర్పై మహిళ వలపు వల విసిరింది. అందులో చిక్కుకున్న వృద్ధుడు రూ.4 కోట్లు వదిలించుకున్నాడు. దీంతో బాధితుడు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ, ఆమె అనుచరులు రిటైర్డ్ ఇంజనీర్ (62)ను ఉచ్చులోకి లాగారు. ఒక మహిళ భావోద్వేగంతో రెచ్చగొట్టింది. దీంతో అతడు ఆమె వలలో చిక్కుకున్నాడు. అనంతరం నెమ్మది నెమ్మదిగా బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఇది కూడా చదవండి: PCB Decision: భారత్–పాక్ మ్యాచ్.. హై వోల్టేజ్ పోరుపై పీసీబీ సంచలన నిర్ణయం?
జూలై 17, 2025న బాధితుడికి తెలియని వాట్సాప్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తడంతో ఒక మహిళ మాట్లాడుతూ వ్యాపారం గురించి చర్చించింది. అంతర్జాతీయ వ్యాపారాలతో కోట్లు గడించవచ్చని నమ్మించింది. అటు తర్వాత నెమ్మది.. నెమ్మదిగా వలపు వల విసిరింది. ప్రేమ కురిపిస్తూ నటించింది. నిజమే అనుకుని వృద్ధుడు నమ్మేశాడు. అనంతరం అమెరికాలో తన మామ ద్వారా మంచి లాభదాయక వ్యాపారం ఉందని నమ్మ బలికింది. అటు తర్వాత ట్రేడింగ్ ఖాతా లింక్ పంపించింది. 7 నెలల్లో వివిధ ఖాతాల నుంచి లావాదేవీలు జరిగాయి. అయితే గత నెలలో విత్డ్రా చేసుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా మోసం బయటపడింది. ఆ మహిళ నుంచి అసభ్యకరమైన సందేశాలు, ఫొటోలు రావడం ప్రారంభమయ్యాయి. నగ్న ఫొటోలను పంపించాలని ఒత్తిడి పెరిగింది.
ఈ క్రమంలో జనవరి 25న ఒక వ్యక్తి ఫోన్ చేసి మహిళ మామగా పరిచయం చేసుకున్నాడు. రూ.2 కోట్ల ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానని బెదిరించాడు. దీంతో చేసేదేమీలేక మొత్తానికి ఏడు నెలల్లో దాదాపు రూ.4 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
ఇది కూడా చదవండి: PUBG: ప్రాణం తీసిన పబ్జీ .. మెదడులో రక్తస్రావం జరిగి యువకుడు మృతి
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?