Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో ప్రసంగం చిచ్చు.. రాహుల్ గాంధీ నివాసానికి పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఢిల్లీలోని రాహుల్గాంధీ నివాసానికి ఆదివారం ఢిల్లీ పోలీసులు వెళ్లారు. ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన “మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారు” అనే వ్యాఖ్యకు సంబంధించి ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఈరోజు ఆయన నివాసానికి చేరుకున్నారు. లైంగిక వేధింపులకు సంబంధించి తనను సంప్రదించిన మహిళల వివరాలను కోరుతూ పోలీసులు మార్చి 16న కాంగ్రెస్ నాయకుడికి నోటీసు జారీ చేశారు. సోషల్ మీడియా పోస్ట్లను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు రాహుల్ గాంధీకి ప్రశ్నావళిని పంపారు. దీనిపై రాహుల్ గాంధీ ఇంకా స్పందించలేదు.
భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ శ్రీనగర్లో ‘మహిళలపై లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు నేను విన్నాను’ అని వాంగ్మూలం ఇచ్చారని పోలీసులు తెలిపారు. రాహుల్ గాంధీ అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాలో పెట్టిన పోస్ట్ల ఆధారంగా ఈ కేసును నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ పోలీసు బృందానికి ఢిల్లీ పోలీసు శాంతిభద్రతల విభాగం ప్రత్యేక పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా నాయకత్వం వహించారు. రాహుల్ గాంధీ నివాసం బయట సాగర్ ప్రీత్ హుడా మీడియాతో మాట్లాడారు. భారత్ జోడో యాత్రలో తనను ఇద్దరు మహిళలు కలిశారని, తమపై అత్యాచారాలు జరిగాయని చెప్పారని రాహుల్ గాంధీ జనవరి 30న కశ్మీరులో జరిగిన సభలో చెప్పారని హుడా తెలిపారు. ఆ బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చేయడం కోసం వారి వివరాలను తమకు ఇవ్వాలని ఆయనను కోరేందుకు వచ్చామని చెప్పారు. ఈ అంశంపై సమాచారాన్ని సేకరించేందుకు మార్చి 15న ప్రయత్నించామని, అప్పుడు విఫలమయ్యామని చెప్పారు. మార్చి 16న ఆయనకు నోటీసు పంపించామని తెలిపారు.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
Read Also: Harassment : చదువేమో పీహెచ్డీ గ్రాడ్యుయేట్.. చేసేది చిన్నారుల లైంగిక వేధింపులు
ఢిల్లీ పోలీసులు ఆ మహిళల వివరాలను రాహుల్ గాంధీ నుంచి తెలుసుకోవాలని, తద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత మహిళలకు సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు గాంధీతో మాట్లాడేందుకు ప్రత్యేక పోలీసు కమీషనర్ స్థాయి అధికారితో పాటు ఉన్నత పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాహుల్గాంధీ వివరాలు ఇవ్వకపోతే, అతనికి మరో నోటీసు ఇవ్వబడుతుంది అని ఢిల్లీ పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Sugar Price: సామాన్యులకు గుడ్న్యూస్! కేంద్రం సంచలన నిర్ణయం.. చక్కెర ధరలు దిగి వస్తాయా?
-
Vivo V80 Lite 5G: వివో వి80 లైట్ 5జీ వచ్చేసింది.. 10,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 16GB వరకు RAM!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
-
Duniya Vijay: పెళ్లి బంధానికి గుడ్బై చెప్పిన విజయ్.. విడాకులు తీసుకున్న స్టార్ హీరో!
-
GSLV-F17: ISRO మరో ఘన విజయం.. GSLV-F17 ప్రయోగం సక్సెస్.. EOS-05 ఉపగ్రహం ఏం చేస్తుంది? భారత్కు ఎలా ఉపయోగపడుతుంది?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!