PCB Decision: భారత్–పాక్ మ్యాచ్.. హై వోల్టేజ్ పోరుపై పీసీబీ సంచలన నిర్ణయం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PCB Decision: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై అనిశ్చితి ఇంకా కుదుటపడలేదు. ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్ను బహిష్కరించాలన్న ప్రతిపాదనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. పీసీబీ తన నిర్ణయాన్ని వచ్చే 24 గంటల్లో స్పష్టం చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లాహోర్లో ఐసీసీ పెద్దలతో జరిగిన దీర్ఘ సమావేశం తర్వాత ఈ అంశం మరింత హాట్ టాపిక్గా మారింది. లాహోర్ గద్దాఫీ స్టేడియంలో జరిగిన ఈ సమావేశం ఐదు గంటలకు పైగా సాగింది. ఇందులో పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ, ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం పాల్గొన్నారు. వరల్డ్ కప్లోనే అతిపెద్ద మ్యాచ్గా భావించే భారత్–పాకిస్థాన్ పోరు అనిశ్చితిలో పడకుండా చూడాలన్నదే ఐసీసీ ప్రధాన ఉద్దేశం. టోర్నీ ఇప్పటికే ప్రారంభమై ఉండటంతో సమయం చాలా కీలకంగా మారింది.
READ MORE: Funky : ఫంకీ’లో క్రేజీ సర్ప్రైజ్.. ఆ ఇంట్రెస్టింగ్ కామియో ఎవరిదో తెలుసా?
Also Read
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
ఈ సమావేశం తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తుది నిర్ణయం తీసుకునే ముందు తమ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించాలనుకుంటోంది. రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ ప్రభావాలు, క్రికెట్కు కలిగే నష్టం అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకే రాబోయే 24 గంటలు చాలా కీలకంగా మారాయి. అంతే కాదు.. భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాక్ మూడు షరతులు సైతం పెట్టినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్కు పెరిగిన పరిహారం ఇవ్వాలి. టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినప్పటికీ.. బంగ్లాదేశ్కు ఐసీసీ పూర్తి ఫీజులను చెల్లించాలి. భవిష్యత్తులో జరగనున్న ఐసీసీ టోర్నమెంట్కు ఆతిథ్య హక్కులు కల్పించాలని పీసీబీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఈ అంశంపై ఇటు ఐసీసీ నుంచి అటు పీసీబీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ఇప్పటికే వరల్డ్ కప్ సాగుతున్న వేళ, ఈ వివాదం ఎలా ముగుస్తుందో అన్న అంశంపై ప్రపంచ క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వచ్చే 24 గంటల్లో భారత్-పాకిస్థాన్ పోరు జరుగుతుందా లేదా తేలనుంది.
తాజావార్తలు
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
-
Robbery : గచ్చిబౌలిలో బస్సు దోపిడీ.. రూ.లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయం
-
Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్కి తిరుగులేదు!”.
-
Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!