Delhi Girl Murder: ఒక్క మిస్డ్ కాల్తో బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Girl Murder: ఢిల్లీలో ఇటీవల 11 ఏళ్ల బాలిక ఆచూకీ కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత హత్యకు గురై శవంగా దొరికింది. అయితే ఈ కేసును ఓ మిస్డ్ కాల్ ఆధారంగా పోలీసులు ఛేదించారు. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో బాలిక కనిపించకుండా పోయిన రోజున ఆమె తల్లికి తెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఉదయం 11.50 గంటలకు ఆమె తల్లికి మిస్డ్ కాల్ వచ్చింది, ఆమె తిరిగి కాల్ చేసినప్పుడు, నంబర్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ తరువాత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 12 రోజుల తర్వాత హత్యకు సంబంధించి రోహిత్ అలియాస్ వినోద్ అనే 21 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Kondagattu Temple: కొండగట్టు ఆలయంలో చోరీ.. బంగారు నగలతో పాటు విగ్రహాలు మాయం
Also Read
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
ఫిబ్రవరి 9న ఉదయం 7:30 గంటల ప్రాంతంలో తన కూతురు స్కూల్ బస్సులో వెళ్లిందని బాధితురాలి తల్లి తెలిపింది. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో తమ కుమార్తె కిడ్నాప్కు గురైందని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిబ్రవరి 10న కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
మిస్డ్ కాల్ ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు, మొబైల్ నంబర్ ను ట్రాక్ చేసి పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. ఫిబ్రవరి 21న నిందితుడి పట్టుకుని విచారించగా.. ఫిబ్రవరి 9న బాలికను హత్య చేసి శవాన్ని ఘోవ్రా మోర్ సమీపంలో పడేసినట్లు వెల్లడించారు. ముండ్కా గ్రామంలో కుళ్లిపోయిన స్థితిలో బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా నిందితుడు మృతదేహాన్ని పడేసిన చోటులో ఫోరెన్సిక్ టీం సాక్ష్యాలను సేకరించింది. నిందితుడిని రిమాండ్ నిమిత్తం జైలుకు పంపించారు. ఈ కేసులో హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బాలికపై లైంగిక వేధింపులు జరిగాయా..? అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తెలియనుంది.
తాజావార్తలు
-
Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
-
PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
-
Preity Mukhundhan: ఫైట్స్తో పవన్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!