విశ్వవ్యాప్తంగా యాపిల్ ఫోన్ అత్యంత విలువైనదని అందరికీ తెలుసు. ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్ కూడా అదే. అయితే, యాపిల్ సంస్థ తన ఉత్పత్తి కేంద్రాలను చైనా నుంచి ఇతర దేశాలకు విస్తరిస్తోంది. చైనాకు బదులు ఇండియాలో తమ ప్రొడక్ట్ల తయారీని పెంచాలని భావిస్తోంది. కొన్ని నెలల కిందట లేటెస్ట్ మోడల్ అయిన ఐఫోన్ 13 సిరీస్ను కూడా ఇండియాలో తయారు చేయడం ప్రారంభించింది. ఇక్కడి నుంచే ఎగుమతులు పెంచుతోంది. యాపిల్ ప్రొడక్ట్లు కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్ల ద్వారా తయారవుతాయి…
కరోనా పుట్టినిల్లు డ్రాగన్ దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు భయపెడుతున్నాయి.. చైనా ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా… కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రాజధాని బీజింగ్ మరోసారి కఠిన ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయింది. చైనాలో కొత్తగా 157 కోవిడ్ కేసులు నమోదుకాగా.. వీటిలో 52 బీజింగ్లోనే వెలుగు చూశాయి. జీరో కోవిడ్ పాలసీకి అనుగుణంగా ఆదివారం నుంచి నగరంలో లాక్డౌన్ అమలు చేశారు. దీంతో మరిన్ని నగరాలు లాక్డౌన్ పరిధిలో వెళుతున్నాయి. హయిడియన్, చావోయాంగ్, ఫెంతాయ్, షన్యి,…
కరోనా పుట్టినిల్లు చైనాలో ఇప్పటికీ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. డ్రాగన్ కంట్రీ నుంచి ప్రపంచదేశాలను చుట్టేసి కోవిడ్.. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్.. ఇలా విరుచుకుపడుతూనే ఉంది.. అయితే, ఇటీవలే ఒమిక్రాన్ వేరియంట్ల కారణంగా చైనీయులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు వెలుగు చూస్తుండడంతో.. కట్టడికోసం సుదీర్ఘ లాక్డౌన్లు విధిస్తోంది చైనా సర్కార్.. దీంతో, ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి.. ఇదే…
చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచంలో ఏ దేశంలో లేనివిధంగా చైనాలో కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి. ఇప్పటికే షాంఘైతోపాటు అనేక నగరాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేస్తోంది ప్రభుత్వం. మరికొన్ని ప్రాంతాల్లో స్థానికంగా కరోనా ఆంక్షలు, నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా చైనాలో 40కోట్ల మంది ప్రజలు ఆంక్షల గుప్పిట్లో ఉన్నారు. కరోనా విజృంభణతో చైనాలోని ప్రధాన నగరాలు వణికిపోతున్నాయి. ఫిబ్రవరి నెలలో షేన్ఝేన్లో మొదట కొవిడ్ ఆంక్షలు మొదలుపెట్టారు. ఇప్పుడు షాంఘై వరకు ఆంక్షలు…
కరోనాకు పుట్టినిలైన చైనాను మహమ్మారి మరోసారి కుదిపేస్తోంది. షాంఘైలో కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో ఆకలి కేకలతో చైనా అల్లాడిపోతోంది. కరోనా కఠిన లాక్డౌన్తో జనం అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి దొరకడం లేదని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నిత్యం 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం గరిష్ఠంగా ఒక్కరోజే 25 వేల కేసులు రికార్డయ్యాయి. మార్చిలో కరోనా తీవ్రత పెరిగినప్పటి…
ఇండియాలో కరోనా కేసుల్లో భారీ తగ్గుదల నమోదైంది. అయితే గతంలో పోలిస్తే మరణాలు బాగా తగ్గాయి. గత 24 గంటల్లో 1,270 పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యాయి. కరోనా కారణంగా 31 మంది మరణించారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,859గా నమోదైంది. గత 24 గంటల్లో 4,32,389 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… కొత్తగా 1,270 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే…
అంతా అయిపోయింది. మనం ఇక సేఫ్ అనుకోవడానికి అవకాశం లేదు. ప్రపంచాన్ని వణికించిన కరోనా…అదుపులోనే ఉందా? అంటే ఇంకా లేదనే చెప్పాలి. కొవిడ్ సృష్టించిన విలయం నుంచి దేశాలు కోలుకోలేకపోతున్నాయి. వైరస్ సోకిన వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సమస్యలు వస్తున్నాయని నిపుణుల అధ్యయనాల్లో తేలింది. చైనాలో కోవిడ్ కేసులు 50 వేలకు పైగా నమోదవడం మరో మృత్యుఘంటికలు మోగిస్తోంది. యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికించింది. ప్రస్తుతం కేసులు అదుపులోనే ఉన్నప్పటికీ… అది సృష్టించిన విలయం…
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. చైనాలోని టెక్ హబ్ ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన షెన్జెన్లో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఒకవేళ షెన్జెన్లో లాక్డౌన్ విధిస్తే.. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను సరఫరా చేసే నగరాల్లో షెన్జెన్ ఒకటి. అక్కడి నుంచే 20 నుంచి 50 శాతం ఉత్పత్తులు…
చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. చైనా ఈస్టర్న్ కంపెనీకి చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 133మంది మరణించారు. ప్రమాదం ధాటికి విమానం పూర్తిగా దగ్ధమైంది. కన్ మింగ్ నుంచి వెళ్తుండగా గ్వాంగ్జీ ప్రాంతంలోని వుజౌ నగరానికి సమీపంలో విమానం క్రాష్ ల్యాండ్ అయి ప్రమాదం జరిగింది. పర్వతాలలో మంటలు చెలరేగాయని సీసీటీవీ ఫుటేజ్ తెలిపింది. ఈ విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ టీమ్లను ఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా…
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన కామెంట్లు చేశారు. కేటీఆర్ ఇప్పటికే పలు దేశాలు పర్యటించారు. భారీగా పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క పెట్టుబడి రాలేదు. సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానం వేసుకొని చైనా వెళ్లారు. వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆ సంగతి ఏమైంది? వీళ్ళు పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్లడం లేదు. వేరే దేశలో…