China-India: మరోసారి చైనా దుర్బుద్ధి.. పాక్ ఉగ్రవాదికి యూఎన్ లో మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవకాశం దొరికితే భారత్ ను ఎలా ఇరికించాలనే ఆలోచనతోనే ఉంటుంది డ్రాగన్ కంట్రీ చైనా. మరోసారి తన భారత వ్యతిరేకతను బయటపెట్టింది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదిని, అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో ఐక్యరాజ్యసమితిలో మోకాలడ్డు పెట్టింది. యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్ లో ఐఎస్ఐఎస్, అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద పాక్ ఉగ్రవాద అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ‘ గ్లోబల్ టెర్రరిస్ట్’గా గుర్తించాలని భారత్, యూఎస్ఏ చేసిన ప్రతిపాదనను చైనా తన వీటో పవర్ తో అడ్డుకుంది.
అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్, 26/11 ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్ హఫీస్ సయూద్ కు స్వయానా బామమరిది. యూఎన్ఓ లో 1267 ఐసిస్, ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ కింది మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగ గుర్తించాలని పెట్టిన ప్రతిపాదనలను చివరి నిమిషంలో చైనా నిలిపివేసింది. గతంలో కూడా చైానా పాకిస్తాన్ కు మద్దతుగా నిలచింది. పలువురు ఉగ్రవాదులను గ్లోబల్ టెర్రిరిస్టులుగా గుర్తించేందుకు అంగీకరించలేదు. ఐరాస శాశ్వత సభ్యదేశాలకు ఉండే వీటో అధికారంలో ఈ ప్రక్రియను అడ్డుకుంది.
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Trump - Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా - ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
గతంలో కూడా చైనా, పాక్ ఉగ్రవాది జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో కూడా ఇలానే చేసింది. అయితే నాలుగు సార్లు ప్రయత్నించిన తర్వాత మసూద్ అజహర్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించారు. 2016లో పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి, పుల్వామా దాడిలో ఇతను కీలకంగా వ్యవహరించాడు. గతంలో 2010లో యూఎస్ ట్రెజరీ మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా పేర్కొంది. దీంతో యూఎస్ లో ఎలాంటి లావాదేవీలు నడపకుండా మక్కీని నిషేధించారు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ రివార్డ్స్ ఫర్ జస్టిస్ మక్కీ గురించి సమాచారం అందించిన వారికి 2 మిలియన్ డాలర్ల రివార్డ్ అందిస్తామని ప్రకటించింది. అబ్దుల్ రెహ్మన్ మక్కీ ప్రస్తుతం లష్కరే తోయిబాలో విదేశీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, నిధుల సేకరణలో కీలకంగా వ్యహరిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
-
PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
-
OPPO Find X9 Ultra: 200MP కెమెరా, 7050mAh బ్యాటరీతో.. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా రిలీజ్
-
YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!