China: శుభవార్త.. భారతీయులపై వీసా నిషేధాన్ని ఎత్తేసిన చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా నేపథ్యంలో భారతీయులపై విధించిన వీసా నిషేధాన్ని చైనా ఎత్తేసింది. చైనా విధించిన ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా స్వదేశంలోనే ఆగిపోయిన భారతీయ నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు డ్రాగన్ శుభవార్త తెలిపింది. భారతీయ ప్రొఫెషనల్స్, వారి కుటుంబసభ్యులకు వీసా మంజూరు ప్రణాళికను సోమవారం ప్రకటించింది. ఈ మేరకు భారత్లోని చైనా రాయబార కార్యాలయం కొవిడ్ వీసా పాలసీ అప్డేట్ చేసిం ది. వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. భారతీయులతో పాటు చైనీయుల కుటుంబసభ్యులు, చైనాలో శాశ్వత నివాసం ఉన్న విదేశీయులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. చైనా కాలేజీలు, వర్సిటీల్లో తిరిగి చేరాలనుకునే భారత విద్యార్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటున్నది.
చైనా కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో ఆగిపోయిన తమ చదువులను కొనసాగించేందుకు ఆసక్తిగా వేల మంది భారతీయ విద్యార్థుల విజ్ఞప్తులను ప్రాసెస్ చేస్తోంది. కొవిడ్ వీసా విధానంలో మార్పు చేస్తూ భారత్లోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. చైనాలో తమ ఉద్యోగాలను కొనసాగించాలనుకుంటున్న విదేశీయులు, వారి కుటుంబ సభ్యుల వీసా దరఖాస్తులను ఆమోదిస్తామని ప్రకటించింది. భారతీయులకు తోడు.. చైనా పౌరులు, చైనా శాశ్వత నివాస పర్మిట్లు ఉన్న విదేశీయులు, ఈ దేశంలో పనిచేసే విదేశీయుల బంధువులు కూడా వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పర్యాటక, ప్రైవేటు అవసరాల కోసం ఇచ్చే వీసాలపై మాత్రం ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది.
Also Read
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- 39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
- Explainer: చరిత్రలో దాచిన ఆకలి విషాదం.. 30లక్షల మంది భారతీయుల చావుకు చర్చిల్ కారణం?
- US Citizenship Fee Hike: ఎన్నారైలకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న అమెరికా సిటిజన్షిప్ ఫీజులు?
భారతీయులకు తోడు వివిధ కంపెనీల కోసం పనిచేసే అనేక మంది చైనా ఉద్యోగులు కూడా భారత్లో చిక్కుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. స్వదేశంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల్లో కొందరిని తమ దేశంలోకి అనుమతిస్తామని డ్రాగన్ ఏప్రిల్లో ప్రకటించింది. అలాంటివారి వివరాలను సేకరించాలని బీజింగ్లోని భారత రాయబార కార్యాలయానికి సూచించింది. దేశంలో ఇటీవల కేసులు పెరిగిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విదేశీయులను అనుమతించడానికి సుముఖంగా లేదు. వీసాలపై ఆంక్షలు సడలిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులను పునఃప్రారంభించే అంశంపై చైనా స్పష్టత ఇవ్వలేదు.
తాజావార్తలు
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..