Chinese rocket reenters atmosphere over Indian Ocean: ప్రపంచాన్ని కలవరపెడుతున్న చైనా రాకెట్ ఎలాంటి నియంత్రణ లేకుండా హిందూ మహాసముద్రంలో కూలిపోయినట్లు యూఎస్ఏ ధ్రువీకరించింది. తూర్పు కాలమాన ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు చైనా రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించినట్లు యూఎస్ స్పెస్ కమాండ్ శనివారం వెల్లడించింది.
China's response to Rishi Sunak's comments: యూకే ప్రధానమంత్రి అభ్యర్థి రిషి సునక్ పై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. రిషి సునక్ చైనాపై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యమైనవిగా చైనా ఆరోపించింది. ప్రధాని మంత్రి రేసులో భాగంగా ఆయన చైనాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ స్పందింస్తూ... ‘‘ చైనా ముప్పు’’అని ప్రచారం చేసినంత మాత్రాన ఒకరి సొంత సమస్యలను పరిష్కరించలేమని ఆయన వ్యాఖ్యానించారు.…
కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల తర్వాత కూడా, చైనా యుద్ధ విమానాలు తూర్పు లద్ధాఖ్లో మోహరించి భారత బలగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. గత మూడు నాలుగు వారాల్లో వాస్తవాధీన రేఖకు దగ్గరగా డ్రాగన్కు చెందిన విమానాలు ఎగురుతూనే ఉన్నాయి.
india and china population decreased by year of 2100: ప్రపంచంలో జనాభా పరంగా భారత్ రెండో స్థానంలో ఉంది. చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2022 లెక్కల ప్రకారం చైనాలో జనాభా 142.6 కోట్లుగా ఉంటే భారత్ జనాభా 141.2 కోట్లుగా ఉంది. అయితే ఓ సర్వే ప్రకారం 2100 నాటికి చైనా జనాభా 49.4 కోట్లకు తగ్గిపోనుంది. అంతేకాకుండా భారత్లో కూడా జనాభా 100.3 కోట్లకు చేరనుంది. అంటే భారత్లో జనాభా 41 కోట్లు…
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. సింగపూర్ ఓపెన్-2022 విజేతగా నిలిచింది. ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్ ఫైనల్స్లో చైనా ప్లేయర్ వాంగ్ జి యీని 21-9, 11-21, 21-15 తేడాతో పీవీ సింధు ఓడించింది. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ప్రారంభసెట్ను సింధు 12 నిమిషాల్లోనే ముగించింది. దీంతో 21-9తో తొలి సెట్ను సింధు గెలవగా రెండో సెట్ను 21-11 తేడాతో వాంగ్ జి యీ గెలిచింది. దీంతో మూడో సెట్లో…
కొన్ని సంవత్సరాల నుంచి భారత్ జనాభా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది నాటికి చైనాను దాటి.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా నిలవనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐరాస సోమవారం 2022 ప్రపంచ జనాభా అంచనాల నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్కల్లా ప్రపంచ జనాభా 800 కోట్ల మార్క్ను తాకే అవకాశం ఉందని, ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న…
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో ఓ దుండగుడు కాల్చి చంపాడు. అయితే తాజాగా సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో షింజో అబే పార్టీ లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ(ఎల్డీపీ) విజయం సాధించింది. జపాన్ పార్లమెంట్ ఎగువ సభ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకు గానూ 148 స్థానాలు సాధించింది. షింజో అబే మరణం తరువాత సానుభూతి పవనాల వీయడంతో ఆయన పార్టీ భారీ విజయం సాధించింది.…
డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి దుందుడుకు చర్యకు దిగింది. భారత్ ను కవ్వించే ప్రయత్నం చేసింది. తూర్పు లడఖ్ సెక్టార్ లో ఘర్షణ ప్రాంతం సమీపంలోకి చైనా యుద్ధవిమానం వచ్చింది. ఈ ఘటన గత నెల చివరి వారంలో జరిగింది. జూన్ చివరి వారంలో ఒక రోజు సాయంత్రం 4 గంటలకు చైనా యుద్ధవిమానం వాస్తవ నియంత్రణ రేఖకు దగ్గరగా భారత భూభాగానికి దగ్గర వచ్చిందని తెలుస్తోంది. ఈ ఘటనతో అప్రమత్తం అయిన భారత సైన్యం వెంటనే…
కరోనా వైరస్ చైనాను దశలవారీగా తిప్పలు పెడుతోంది. ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్ననగరాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. అయితే.. బుధవారం జియాన్.. షాంఘై నగరాల్లో 300పైగా కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ కొత్త కేసులు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఎదుర్కొన్న లాక్ డౌన్ గురించి తలుచుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ నుంచి రేషన్ అందిందని షాంఘై ప్రజలు సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా.. తాజాగా విజృంభణ…
చైనాలో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఆదివారం మరోసారి భూకంపం వచ్చింది. జిన్ జియాంగ్ ఉయ్గర్ అటానమస్ రీజియన్ లో ఆదివారం 5.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని చైనా ఎర్త్క్వేక్ నెట్వర్క్ సెంటర్ వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. అంతకుముందు రోజు శనివారం కూడా జిన్జియాంగ్ ప్రావిన్స్ లో రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. జూన్ నెలలో చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో 5.8 తీవ్రతతో భూకంపం…