స్థానిక సంస్థల ఎన్నికల ప్రకియ దుర్మార్గంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడే ఏకగ్రీవాలు పెరిగాయని, బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగిందన్నారు. ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపణలు చేశారు. అభ్యర్థులు కోర్టుకు వెళితే.. మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. రైతులు పాదయాత్ర చేస్తుంటే అక్కడ కూడా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందన్నారు.
ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని రైతుల మహా పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుందని అన్నారు. రైతుల మహా పాదయాత్ర చూసి సీఎం జగన్ భయపడుతున్నారని సెటైర్లు వేశారు. అందుకే రైతుల పాదయాత్రకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందన్నారు. రైతులు, మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు. రైతుల పాదయాత్ర…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది… ఇక, కుప్పం మున్సిపల్ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. కుప్పంలో మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి… కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఏదో జరిగిపోతోందని చెప్పి లబ్ధిపొందాలని చూస్తున్నారంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. 14వ వార్డులో ప్రపోజర్ విత్ డ్రా చేయడం వల్ల ఓ నామినేషన్ తిరస్కరణకు గురై మా అభ్యర్థి ఏకగ్రీవంగా…
చంద్రబాబు, నారా లోకేష్ను టార్గెట్ చేస్తూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొడాలి నాని.. లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ సంచలన కామెంట్లు చేశారు.. సీఎంను దున్నపోతు అంటూ లోకేష్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. ముఖ్యమంత్రి ఇంటిని తాకుతా అంటున్నాడు.. రా.. నా కొడకా… ముఖ్యమంత్రి ఇంటి గుమ్మాన్ని తాకు… చూస్తా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇక, లోకేష్, చంద్రబాబు తోలు ఒలిచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చెప్పులు కుట్టిస్తా అంటూ సంచలన…
ఏపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని బీజేపీ, టీడీపీ నానా యాగీ చేస్తున్నాయి. రూ. 50 ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెరిగేలా చేసింది బీజేపీ అని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తన హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయనే విషయాన్ని అల్జీమర్స్ సోకిన చంద్రబాబు మరిచారు. ధర్నాలు పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలాడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో వాస్తవాలు దాచి ధర్నాలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. చంద్రబాబుకు…
ఏపీలో జరుగుతోన్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు అధికార, ప్రతిక్షాల మధ్య మాటల యుద్దానికి తెరలేపాయి.. గడచిన స్థానిక ఎన్నికల మాదిరిగానే ఇప్పుడూ అరాచకాలు చేశారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. చాలా చోట్ల అభ్యర్థులని బెదిరించి విత్ డ్రా చేయించారన్న ఆయన.. పోలీసులే ఎన్నికల్లో సెటిల్మెంట్లు చేస్తూ అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు.. నామినేషన్ విషయంలో ఇన్ని జాగ్రత్తలు మేం ఎప్పుడూ తీసుకోలేదని గుర్తుచేసుకున్న టీడీపీ అధినేత.. పోటీ చేయాలనుకునే అభ్యర్థికి సహకరించాల్సిన…
ఏపీలో రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్ గా సాగుతుంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా విపక్షాలు ధర్నాలు చేస్తున్నాయి. మంగళవారం ఏపీలోని పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ నేతలు ధర్నాలకు పిలుపునిచ్చారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ ధర్నాలపై హాట్ కామెంట్స్ చేశారు. పెట్రోల్ డీజిల్ రేట్లు అంశంలో చంద్రబాబు ధర్నా ఏపీ లో కాదు…జంతర్ మంతర్ దగ్గర చేయాలన్నారు. దమ్ముంటే బీజేపీ పై ధర్నా చేయాలన్నారు కారుమూరి. తన స్వంత నియోజకవర్గం కుప్పం…
మీరు మారిపోయార్సార్ అంటున్నారు తమ్ముళ్లు..అయితే ఈ మార్పు ఫుల్ టైమా లేక, టెంపరరీనా అని అనుమాన పడుతున్నారట.అధికారానికి దూరమైన సమయంలో వచ్చిన మార్పు నమ్మశక్యంగా లేదనుకుంటున్నారట.ఇదే తీరు గతంలో కూడా ఉండి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా అనుకుంటున్నారని టాక్. ప్రతిపక్షంలోకి వచ్చాక చంద్రబాబు స్టైల్ మారిందా? అధికారంలో ఉండగా దర్శన భాగ్యమే గగనంగాడే పరిస్థితి. అలాంటిది ప్రతిపక్షంలోకి వచ్చాక నేరుగా కార్యకర్తలతో ఫోన్-ఇన్ కార్యక్రమాలు నడిపించేస్తున్నారట. ప్రతి రెండు రోజులకోసారి క్షేత్ర స్థాయిలో…
ఏపీలో ఎన్నికలు జరగని మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు, పంచాయతీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల అక్రమాల పై హైకోర్టును ఆశ్రయించనుంది తెలుగుదేశం పార్టీ. రిటర్నింగ్ అధికారి ఏకపక్ష నిర్ణయాలపై హైకోర్టు కు వెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి రిటర్నింగ్ అధికారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. నామినేషన్ల తిరస్కరణను సీరియస్ గా తీసుకున్న…
బెజవాడ టీడీపీ రాజకీయాల్లో కుదుపు. టీడీపీ కి మరో షాక్ తగిలింది. పశ్చిమ నియోజకవర్గంకు చెందిన కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య టీడీపీ గుడ్ బై చెప్పారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ లో చేరారు లావణ్య. ఇటీవల జరిగిన విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో లావణ్య టీడీపీ తరఫున గెలిచారు. విజయవాడ కార్పోరేషన్ కైవసం చేసుకోవాలని టీడీపీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్ధిగా ప్రకటించి…