దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు : సజ్జల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుప్పం మొత్తం ఓటర్లు సుమారుగా 37 వేలు. మొదటి సారి మున్సిపాలిటీ అయిన కుప్పం ఎన్నికల గురించి చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే బాధేసింది అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇటువంటి వ్యక్తిని రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఎలా భరించింది అనిపించింది. జనసేన, టీడీపీ, బీజేపీ ఒకే తాను ముక్కలు. ఈ మూడు పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకుని వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు కుప్పాన్ని చెరబట్టారు. ఆయన చెరలో కుప్పం దశాబ్దాలుగా నలిగిపోయింది. ఇన్నాళ్లు మకుటం లేని మహారాజులా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు వెలిగారు. ఇప్పుడు ఆ కోట బద్దలయ్యింది. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం ప్రభావాన్ని కుప్పం ప్రజలు చూస్తున్నారు. దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు అని సజ్జల అన్నారు.
అందుకే ఎంతో ధైర్యంతో ముఖ్యమంత్రి ప్రత్యేక చట్టమే తీసుకుని వచ్చారు. చంద్రబాబుకు సందర్భంతో సంబంధం లేదు. ఒక మున్సిపాలిటీ ఎన్నికల గురించి చెబుతూ ప్రజాస్వామ్య విలువలు వంటి భారీ మాటలు మాట్లాడుతున్నాడు. మధ్యాహ్నం ఒంటి గంటకే 60 శాతం పోలింగ్ నమోదయ్యింది. ప్రజలు స్వచ్ఛందంగా వస్తేనే ఈ స్థాయిలో పోలింగ్ నమోదవుతుంది. దొంగ ఓట్లకు అవకాశం ఎక్కడ ఉంటుంది అని ప్రశ్నించారు. అక్కడ మీ ఏజెంట్లే ఉంటారుగా.. అసలు టీడీపీ కార్యకర్తలు అంత మంది ఎందుకు గుమిగూడారు… టీడీపీ నేతలు డబ్బులు పంచి ఎవరి పై మాట్లాడుతున్నారు అని అడిగారు.
Also Read
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!