దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు : సజ్జల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుప్పం మొత్తం ఓటర్లు సుమారుగా 37 వేలు. మొదటి సారి మున్సిపాలిటీ అయిన కుప్పం ఎన్నికల గురించి చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే బాధేసింది అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇటువంటి వ్యక్తిని రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఎలా భరించింది అనిపించింది. జనసేన, టీడీపీ, బీజేపీ ఒకే తాను ముక్కలు. ఈ మూడు పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకుని వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు కుప్పాన్ని చెరబట్టారు. ఆయన చెరలో కుప్పం దశాబ్దాలుగా నలిగిపోయింది. ఇన్నాళ్లు మకుటం లేని మహారాజులా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు వెలిగారు. ఇప్పుడు ఆ కోట బద్దలయ్యింది. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం ప్రభావాన్ని కుప్పం ప్రజలు చూస్తున్నారు. దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు అని సజ్జల అన్నారు.
అందుకే ఎంతో ధైర్యంతో ముఖ్యమంత్రి ప్రత్యేక చట్టమే తీసుకుని వచ్చారు. చంద్రబాబుకు సందర్భంతో సంబంధం లేదు. ఒక మున్సిపాలిటీ ఎన్నికల గురించి చెబుతూ ప్రజాస్వామ్య విలువలు వంటి భారీ మాటలు మాట్లాడుతున్నాడు. మధ్యాహ్నం ఒంటి గంటకే 60 శాతం పోలింగ్ నమోదయ్యింది. ప్రజలు స్వచ్ఛందంగా వస్తేనే ఈ స్థాయిలో పోలింగ్ నమోదవుతుంది. దొంగ ఓట్లకు అవకాశం ఎక్కడ ఉంటుంది అని ప్రశ్నించారు. అక్కడ మీ ఏజెంట్లే ఉంటారుగా.. అసలు టీడీపీ కార్యకర్తలు అంత మంది ఎందుకు గుమిగూడారు… టీడీపీ నేతలు డబ్బులు పంచి ఎవరి పై మాట్లాడుతున్నారు అని అడిగారు.
Also Read
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..