Warangal: ఎండకాలం పూర్తిగా రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండ దంచి కొడుతుంది. ఇక మధ్యాహ్నం సంగతి చెప్పనక్కరలేదు. ఇదిలా ఉంటే ఎండల తీవ్రత పెరగడంతో మందుబాబులు హార్డ్కు గుడ్ బై చెప్పి బీర్లవైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్లోని ఓ మందుబాబు కేఎఫ్ లైట్ బీర్ కొన్నాడు. కొంత వరకు ఆ బీర్ను తాగడం స్టార్ట్ చేశాడు. మధ్యలో బీర్ కొంచెం తేడా కొట్టింది. అందులో చూస్తే ఓ పురుగు కనిపించింది. నగరంలో కరీమాబాద్ వైన్స్లో ఈ ఘటన జరిగింది. బీరు కొనుగోలు చేసిన వ్యక్తి వైన్స్ నిర్వాహకులను ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇక ఈ వీడియో చూసిన బీర్ ప్రియులు షాక్కు గురవుతున్నారు. కంపెనీల నిర్లక్ష్యం కారణంగానే పురుగులు వస్తున్నాయని, ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు. ఇక ఈ వేసవికాలంలో మద్యం అమ్మకాల్లో బీర్లదే అగ్రస్థానం. ప్రస్తుత కాలంలో ఎండలనుంచి తట్టుకోవడానికి శీతలపానీయాల వైపు చూడడం కామన్. అయితే మద్యం ప్రియులు మాత్రం చల్లని బీర్లవైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో బీర్ల అమ్మకాలు ఘననీయంగా పెరుగుతాయి. అక్కడక్కడా ఈ ఘటనలు చోటు చేసుకోవడంతో బీర్ ప్రియులు అసహనానికి గురవుతున్నారు.
READ MORE: AA22 Update: టైటిల్, ఫస్ట్ లుక్ మాత్రమే కాదు.. ఏప్రిల్ 8న అంతకుమించి!