ఏపీ రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ సమావేశాల్లో రెండవ రోజు అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, తన భార్యను కూడా అవమానిస్తున్నారంటూ చంద్రబాబు సభను వెళ్లిపోయారు. అంతేకాకుండా ఇక సభలోకి ముఖ్యమంత్రిని అయ్యాకే అడుగుపెడుతానంటూ శపథం చేశారు. అనంతంర తన ఛాంబర్లో టీడీఎల్పీ సమావేశం నిర్వహించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే మీడియాతో మాట్లాడుతూనే చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాకుండా…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు సభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. మొదటి సభలోకి చంద్రబాబు రాకపోవడంతో కుప్పం ఫలితాల కారణంగా రాలేదని జగన్ వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ నేతలు చంద్రబాబును సభలోకి ఆహ్వానించారు. అయితే వైసీపీ మంత్రి కొడాలి నాని సభలో మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై చర్చించడానికి టీడీపీ ధైర్యం లేదని.. వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అంతేకాకుండా ఇక్కడ రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నామని వేరే…
కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం తీసుకువచ్చిన రైతు చట్టాలను తీసుకువచ్చింది. ఈ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నయంటూ రైతులు దేశవ్యాప్తంగా నిరసనలు దిగారు. అంతేకాకుండా చాలా మంది చనిపోయారు కూడా. ఈ నేపథ్యంలో నేడు ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన చట్టాలను రద్ద చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. రైతుల ఆందోళనను కేంద్రం అర్ధం చేసుకోవడం శుభ పరిణామని…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఏపీ అసెంబ్లీలో ఆమె మహిళా సాధికారతపై చర్చ సందర్భంగా ప్రసంగించారు. సింహంతో వేట.. జగన్తో ఆట మంచిది కాదని.. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషించదా అని ఆడపిల్ల పుట్టుకను చంద్రబాబు అవమానించారని… కానీ ఇప్పుడు అదే మహిళలు చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా తీర్పు చెప్పారని రోజా వ్యాఖ్యానించారు. ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు…
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం నిర్వహించిన బీఏసీ సమావేశానికి చంద్రబాబు వస్తారని తాము భావించామని.. కానీ ఆయన బీఏసీకి రాలేదని జగన్ తెలిపారు. కొంచెం సేపు బీఏసీ సమావేశాన్ని తాము ఆలస్యం చేశామని.. అయినా చంద్రబాబు రాలేదని.. ఆయనకు ఏం కష్టం వచ్చిందో తనకైతే తెలియదని జగన్ వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబుపై కుప్పం ఎన్నికల ఎఫెక్ట్ పడిందని మా వాళ్లు చెప్తున్నారు’ అంటూ జగన్ ఎద్దేవా చేశారు. Read Also:…
ఏపీలో రాజకీయాలకు తావులేకుండా సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని అసెంబ్లీలో సీఎం జగన్ వెల్లడించారు. ఏపీలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని… మొత్తం 1.21 కోట్ల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని జగన్ తెలిపారు. రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మంది ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన అనుచరులు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలను కోర్టులకు…
ఏపీలో ఏ ఎన్నిక జరిగినా టీడీపీకి పరాభవం మాములు విషయంగా మారిపోయింది. రాజకీయాలు అన్న తర్వాత గెలుపోటములు మాములే. అయితే ఓ ఎన్నికలో పరాభవం ఎదురైతే.. తరువాత జరిగే ఎన్నికల్లో పుంజుకోవాలని ఏ రాజకీయ పార్టీ అయినా భావిస్తుంది. ఈ మేరకు వ్యూహాలకు పదును పెట్టి ప్రత్యర్థిపై పోటీకి సై అంటుంది. కానీ ఏపీలో ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఓటములను సీరియస్గా తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికలు మొదలు.. ఇప్పటి లోకల్ బాడీ ఎన్నికల…
కుప్పం మున్సిపాలటీ ఎన్నికల్లో టీడీపీని చిత్తు చేసి… వైసీపీ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విజయం పై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫుల్ జోష్ లో కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా వైసీపీ గెలవడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ… ఏ ఎన్నికలు వచ్చిన వార్ వన్ సైడేనని… నలబై ఏళ్ళు ఇండ్రస్టీ అయినా చంద్రబాబు తరిమి కొట్టారని ఎద్దేవా చేశారు. కుప్పంలోనే ఇల్లు…
ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది.. టీడీపీ డీలాపడిపోగా.. వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి… ఈ ఫలితాలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఏ ఎన్నికలు వచ్చినా వార్ వన్సైడే అన్నారు.. ఈ ఎన్నికల్లో నలబై ఏళ్ల ఇండ్రస్టీ అయినా చంద్రబాబుని తరిమి కొట్టారని సెటైర్లు వేసిన ఆమె.. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును… హైదరాబాదు ఇంటికి పరిమితం చేశారని వ్యాఖ్యానించారు… ఇకనైనా చంద్రబాబు, లోకేష్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని…
ఏపీలో నెల్లూరు కార్పోరేషన్తో పాటు పెండింగ్లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు పోలింగ్ జరిగిన విషయం తెలసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తాజాగా ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ని టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ-టీడీపీ మధ్య హోరాహోరీగా ఎన్నికల పోరు సాగింది. మొత్తం 20 వార్డులకు గాను టీడీపీ 13 వార్డులు గెలుచుకొని దర్శి నగర పంచాయతీ చైర్మన్…