Sprite Cool Drink bottle colour changed: కూల్డ్రింక్ అనగానే చాలా మంది స్ర్పైట్ తాగుతుంటారు. ఎందుకంటే సోడా తరహాలో ఉండటమే కాకుండా స్ర్పైట్ రుచి చాలా బాగుంటుంది. పాన్ షాపులకు వెళ్లినా.. షాపింగ్ మాళ్లకు వెళ్లినా మనకు ఆకుపచ్చని స్ర్పైట్ బాటిల్స్ దర్శనమిస్తూ ఆకర్షిస్తుంటాయి. అయితే ఇప్పటివరకు స్ర్పైట్ బాటిల్ గ్రీన్ కలర్లోనే ఉంటూ వచ్చింది. 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్ర్పైట్ తన బాటిల్ కలర్ మార్చుకుంటోంది. ఈ మేరకు పర్యావరణ అనుకూలమైన తెల్లని…
Life Insurance Corporation: మన దేశంలో ఎల్ఐసీ గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. భారతీయ జీవిత బీమా సంస్థ(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ఎల్ఐసీ) అంటే ప్రతిఒక్కరికీ భరోసా. జీవితంపై ధీమా.
Business Headlines: హైదరాబాద్లోని ప్రముఖ ఫార్మాస్యుటికల్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది. ఈ సంస్థ నికర లాభం ఏకంగా 108 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 3 నెలల్లో 571 కోట్లు మాత్రమే ప్రాఫిట్ రాగా ఈసారి 11 వందల 88 కోట్లు వచ్చాయి.
Gold ans Silver Prices: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం ధరలు పెరగడం ఓ రకంగా షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మాసంలో శుభాకార్యాలు భారీస్థాయిలో జరుగుతాయి. దీంతో పసిడికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే పసిడికి రెక్కలు రావడంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించిన వాళ్లు ఊసురుమంటున్నారు. ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో నెలకొన్న అనిశ్చితులు, బంగారం ధరల…
America: అగ్రరాజ్యం అమెరికాలో మొత్తం 582 స్టార్టప్ కంపెనీలు ఉండగా అందులో సగానికి పైగా అంటే 319 సంస్థల వ్యవస్థాపకుల్లో కనీసం ఒక్కరైనా ఇతర దేశాల వాళ్లు ఉన్నారు. అందులోనూ ఇండియన్లే ఎక్కువ మంది ఉండటం విశేషం.
Highest Salary in India: ప్రముఖ కంపెనీల సీఈవోలకు లక్షల్లో, కోట్లల్లో శాలరీ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఓ కంపెనీ సీఈవో ఏకంగా ఏడాదికి రూ.123 కోట్ల శాలరీ అందుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు హెచ్సీఎల్ టెక్ సీఈవో సి.విజయ్ కుమార్. ప్రస్తుతం అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సీఈవోగా విజయ్ కుమార్ నిలవడం విశేషం. ఇటీవల హెచ్సీఎల్ టెక్ కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదికలో గత ఏడాది తమ చీఫ్…
Business Headlines: ప్రపంచ బ్యాంక్లో ప్రధాన ఆర్థికవేత్తగా ఇందర్మీత్ గిల్ సెలెక్ట్ అయ్యారు. ఈ పదవిని చేపడుతున్న రెండో భారతీయుడిగా పేరొందారు. సెప్టెంబర్ ఒకటిన బాధ్యతలు చేపడతారు. 2012-16 మధ్య కాలంలో తొలిసారిగా కౌశిక్ బసు ఈ హోదాలో పనిచేశారు.
Business Headlines: డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ త్వరలోనే 82 రూపాయలకు పడిపోనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాణిజ్య లోటు, అమెరికాలో వడ్డీ రేట్లు పెరగనుండటమే దీనికి కారణమని చెబుతున్నారు.
income tax returns: 2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువు జూలై 31తో ముగియనుంది. ఒకవేళ గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అయితే ఐటీఆర్ దాఖలు ప్రక్రియలో కొందరికి మాత్రం చట్టం మినహాయింపు ఇచ్చింది. వీరు గడువు దాటిన తర్వాత సమర్పించినా ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయంలో కనీస మినహాయింపు పరిమితి దాటకపోతే తుది గడువు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయవచ్చని అధికారులు వెల్లడించారు. సెక్షన్…
Amazon Satellite internet services in india: దేశంలో మరో టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం దేశంలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సాధారణంగా మారిపోయింది. ఇంటర్నెట్ లేని ఇల్లు అనేది కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సుమారు రూ. 80 వేల కోట్ల వ్యయంతో మొత్తంగా 3,236 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్…