RBI Update: ఆర్బీఐలోకి ఆ నలుగురు మళ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Update: కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బోర్డుకి నలుగురు స్వతంత్ర డైరెక్టర్లను మళ్లీ నామినేట్ చేసింది. సతీష్ కాశీనాథ్ మరాఠే, స్వామినాథన్ గురుమూర్తి, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది.. పార్ట్ టైమ్, నాన్ అఫిషియల్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. గురుమూర్తి, సతీష్ కాశీనాథ్లు నాలుగేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ పదవిలో కొనసాగుతారని, ఈ నియమకం గురువారం (నిన్నటి) నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆర్బీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. అయ్యర్, సచిన్లు కూడా నాలుగేళ్లు ఈ పదవిలో కొనసాగుతారని, అయితే వాళ్లు ప్రస్తుతం ఉన్న పదవుల కాలం సెప్టెంబర్ 18న ముగిశాక ఈ నియామకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
‘గో’ ఫ్యూచర్ ప్లాన్
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
బ్రాండెడ్ ఉమెన్స్ బోటమ్ వేర్ మార్కెట్లో దాదాపు 8 శాతం వాటా కలిగిన గో ఫ్యాషన్ ఇండియా లిమిటెడ్.. విస్తరణ ప్రణాళికలు రచిస్తోంది. ఏటా దాదాపు 120 నుంచి 130 వరకు కొత్త స్టోర్లను ప్రారంభించాలని భావిస్తోంది. గో కలర్స్ అనే బ్రాండ్ ప్రొడక్ట్లను విక్రయిస్తున్న ఈ సంస్థ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 24 కోట్ల రూపాయలకు పైగా లాభాలను ప్రకటించింది.
Vijayawada: ఫ్రీడం ఫైటర్స్ @ విజయవాడ. నగరం నలువైపులా వెల్లివిరుస్తున్న దేశభక్తి.
‘పవర్’ పెరిగింది
జులైలో దేశవ్యాప్తంగా విద్యుత్ వాడకం పెరిగింది. దీంతో పవర్ ప్లాంట్లకి 17 శాతం అధికంగా బొగ్గును సరఫరా చేయాల్సి వచ్చింది. డిమాండ్కి తగ్గట్లుగా విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు 58 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును వినియోగించారు. గత నెలలో బొగ్గు ఉత్పత్తి కూడా 11 శాతానికి పైగా పెరగటం విశేషం. 2022 జులైలో 54 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా ఈసారి 60 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయింది.
8 ఏళ్లలో డబుల్
2 వేల 30 నాటికి అంటే రానున్న ఎనిమిదేళ్లలో ఇండియా బ్రిటన్ మధ్య వాణిజ్యం రెట్టింపుకానుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, టెక్నాలజీలో పెట్టుబడులు, గ్లోబల్ సప్లై చైన్లో మార్పులు చేర్పులు, సులభతర వ్యాపార వాతావరణం ఇరు దేశాల వాణిజ్యాభివృద్ధికి దోహదపడనున్నాయి. బ్రిటన్ మీట్స్ ఇండియా రిపోర్ట్-2022లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఇండియా రికార్డ్
ప్రపంచంలోనే అత్యధిక డైలీ స్టార్టప్స్ రికగ్నైజింగ్ రేట్ కలిగిన దేశంగా ఇండియా ఘనత సాధించింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటున్న మన దేశంలో ప్రస్తుతం 75 వేల స్టార్టప్స్ ఉండటం విశేషం. మొదటి 10 వేల స్టార్టప్లకు ప్రభుత్వ గుర్తింపు రావటానికి ఏకంగా 808 రోజులు పట్టగా చివరి 10 వేల స్టార్టప్లకు కేవలం 156 రోజుల్లోనే రికగ్నిషన్ వచ్చింది. దీని ప్రకారం రోజుకి సగటున 80కి పైగా గుర్తింపు పొందాయి. ఇది ప్రపంచంలోనే అత్యధిక రేటు.
సబ్సిడీకి నో
886 మిలియన్ డాలర్ల సబ్సిడీ ఇవ్వాలన్న స్పేస్ఎక్స్ విజ్ఞప్తిని ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ తిరస్కరించింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్కి చెందిన ఈ సంస్థకి అమెరికాలోని దాదాపు ఆరున్నర లక్షల ప్రాంతాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు అందించేందుకు నిధుల అవసరం ఏర్పడింది. స్పేస్ఎక్స్కి అనుబంధంగా ఉన్న స్టార్లింక్ సంస్థ ఈ సర్వీసులపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవటం వల్లే సబ్సిడీని నిరాకరించినట్లు ఎఫ్సీసీ పేర్కొంది.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..