Ratan Tata: ఒంటరితనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రతన్ టాటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ratan Tata: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడంలో ముందుంటారు. తాజాగా ఆయన గుడ్ ఫెల్లోస్ అనే స్టార్టప్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. మంగళవారం జరిగిన ఈ స్టార్టప్ కంపెనీ ప్రారంభోత్సవంలో రతన్ టాటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంటరితనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక తోడుంటే బాగుండు అని ఒంటరిగా సమయం గడిపే వరకు.. ఒంటరితనమంటే తెలియదని రతన్ టాటా వ్యాఖ్యానించారు. అలాగే వాస్తవంగా వయసు మళ్లే వరకు వృద్ధాప్యం గురించి ఎవరూ పట్టించుకోరని తెలిపారు. ప్రస్తుతం సహజంగా అందరితో కలిసి ఉండటం సవాలుతో కూడుకుందని రతన్ టాటా వెల్లడించారు.
Read Also: Kerala: కేరళలో దారుణం.. మైనర్ పై తండ్రి స్నేహితుల అత్యాచారం
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
కాగా వృద్ధులకు ప్రతి పనిలో ఆసరాగా నిలిచేలా శంతను నాయుడు అనే యువకుడు ప్రారంభించిన ‘గుడ్ ఫెల్లోస్’ స్టార్టప్లో రతన్ టాటా పెట్టుబడులు పెట్టడం విశేషం. శంతను నాయుడు న్యూయార్క్లోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్గా ఉంటున్నారు. అనంతర కాలంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. రతన్ టాటాకు, ఈ యువకుడికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అయితే శునకాలపై ప్రేమ వీరిద్దరిని కలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 మిలియన్ల మంది వృద్ధులు స్వతహాగా జీవిస్తున్నారని, వారితో జీవితాన్ని పంచుకునే వ్యక్తులు లేకుండా ఉన్నారని శంతను నాయుడు వ్యాఖ్యానించారు. ఒంటరితనం లేదా సహవాసం లేకపోవడం మానసిక క్షీణతకు ప్రధాన కారణమన్నారు. ఒంటరితనం కారణంగా శారీరక ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే ఈ స్టార్టప్ కంపెనీ కింద సానుభూతితో వ్యవహరించేవారిని, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కలిగిన వారిని నియమించుకుంటామని తెలిపారు. వారు వృద్ధులకు సహచరుల్లా వ్యవహరిస్తూ ప్రతి పనిలో ఆసరాగా నిలుస్తారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..