రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సమావేశం ఆగస్టు 8 వరకు జరగనుంది. ఈ సమావేశంలో రుణాన్ని చౌకగా ఇవ్వడంతో పాటు పలు నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఆడవారికి గుడ్ న్యూస్.. మూడు రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 6,470 ఉంది. అలాగే.. 8 గ్రాముల బంగారం ధర రూ. 51,760 ఉంది. 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 64,700 గా ఉంది. నిన్నటి ధర కంటే.. ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్లపై బంగారం ధర రూ. 100 తగ్గింది.
ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే ఖాతాదారుల నుంచి బ్యాంకులు పెనాల్టీ వసూలు చేస్తున్నాయి. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ ద్వారా రూ.8,500 కోట్లు ఆర్జించాయి.
విదేశాలకు వెళ్లాలంటే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి అనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఇకపై విదేశాలకు వెళ్లేందుకు ఈ సర్టిఫికెట్ తప్పనిసరని ప్రభుత్వం బడ్జెట్లో నిబంధన పెట్టినట్లు చెబుతున్నారు.
చైనాను వదిలిపెట్టి భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడం అంత సులువు కాదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. 'ELCIA టెక్ సమ్మిట్ 2024'లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం చైనా తయారీ సామర్థ్యంతో భారత్ పోటీపలేదని స్పష్టం చేశారు.
దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో రతన్ టాటా కంపెనీ భారీగా సంపాధించింది. బడ్జెట్లో బంగారం, వెండి దిగుమతులపై 6 శాతం పన్నును ఆర్థిక మంత్రి తగ్గించారు.