రాష్ట్రం మొత్తం మావైపే చూస్తుందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. శనివారం ప్రగతి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కాంగెస్, సీపీఐ, జనసమితి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, సీపీఐ, జనసమితి పార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మా కలయికతో బీఆర్ఎస్ను ఓడిస్తున్నాం. ప్రచార కో ఆర్డినేషన్ కమిటీ వేసుకొని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నాం. ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది’…
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తుక్కుగూడలో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనతో తెలంగాణ చేరుకోవాల్సిన స్థాయికి చేరుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి డ్రామా చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ రాజకీయ జీవితం ప్రారంభం అయిందే కాంగ్రెస్ నుండే అని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు…
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి కేసీఆర్ సర్కారుని ఇంటికి పంపాలా వద్దా.. 2024లో మోదీని మరోసారి ప్రధాని కావాలా వద్దా అని అన్నారు. రామప్ప దేవాలయంలోని రుద్రేశ్వరస్వామికి నమస్కరించి చెబుతున్నా.. 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని అడ్డుకుందని ఆరోపించారు. 2019లో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన…
అయోధ్య రామ మందిరం ప్రారంభానికి అందరూ రావాలని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ వేములవాడ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే జనవరిలో అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తున్నామని, దానికి మీరంత రావాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా శనివారం ఉమ్మడి కరీంనగర్ రాజన్న సిరిసిల్లాలో బీజేపీ అభ్యర్థి వికాస్ రావు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు యోగి ఆదిత్య బహిరంగ సభలో ప్రసంగించారు. ‘టీఆర్ఎస్, కాంగ్రెస్తో జతకట్టి ప్రజలను మోసం…
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణలో మూడు రోజులు పర్యటించనున్నారు. అందులో భాగంగానే.. కామారెడ్డిలో ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారని.. ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ నుండి విముక్తి కోరుతున్నారని తెలిపారు. ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని మోదీ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ విధానాలు ఉన్నాయన్నారు. తాను ఇచ్చే మాటలే గ్యారంటీ అని అన్నారు. దేశానికి…
వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలంలోని జగత్ పల్లి, మణిగిళ్ల, మోజర్ల, మదిగట్ల, అమ్మపల్లి, ఆల్వాల, చిన్న మందడి, దొడగుంట పల్లి, అంకాయ పల్లి తండా గ్రామాల్లో మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, నాయకుడు నాగం తిరుపతి రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదిగట్ల గ్రామంలో బీజేపీ పార్టీ…
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రయాంక గాంధీ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కల్లూరు పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లో ఆమె ప్రసంగించారు. ‘ఇందిరగాంధీకి తెలంగాణ అంటే చాలా ఇష్టం. చనిపోయిన ఇన్నేళ్లకు కూడా ఇందీరా గాంధీ మీ అందరికి గుర్తున్నారంటే ఆమె చేసిన పాలనే. భూమి.. నీళూ.. నీధుల కోసం పోరాటం చేసి అభివృద్ధి చేశారు కాబట్టే మిరందరూ ఆమెను గుర్తుపెట్టుకున్నారు. నాయకులు తప్పు చేసినప్పుడు ప్రశ్నించాలి.. ఎదిరించాలి. కేసిఆర్ పది…
నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలంలో నేడు జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాచాలపల్లి, ఉర్కొండపేట, జకినాలపల్లి, గునగుంట్లపల్లి తదితర గ్రామాల్లో ప్రచారం కొనసాగించారు.
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. అందులో భాగంగా.. ఆదిలాబాద్ లోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో కాంగ్రెస్ ప్రజా విజయభేరి సభలో అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుధ్ధంగా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. ప్రజలు కన్న కలలు నెరవేరటంలేదు.. అమరుల ఆశయాలు నెరవేరట్లేదని ఆరోపించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పర్యటిస్తున్నారు. పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఆమె రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాకం గాంధీ మాట్లాడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీకి ఉద్యాగాలు వచ్చాయి.. తెరాస్ ను తప్పించండి.. కాంగ్రెస్ ను తీసుకుని రండి..