Ring Roads In Telangana: తెలంగాణ జిల్లాలకు మహర్దశ.. ప్రతీ జిల్లాకో రింగు రోడ్డు..
- ప్రతీ జిల్లాకు రింగు రోడ్డు నిర్మాణం..
- అనుసంధానంగా ప్రధాన హైవేలు..
- అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ.. ప్రతి జిల్లా కేంద్రానికి రింగు రోడ్డు సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కేవలం నగరాలకే పరిమితం కాకుండా.. జిల్లాల అభివృద్ధిని కాంక్షిస్తూ చేపడుతున్న ఈ బృహత్తర ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాన జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, సరుకు రవాణాను వేగవంతం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. ప్రతి జిల్లా రింగు రోడ్డును సమీపంలోని జాతీయ రహదారులతో అనుసంధానిస్తారు. దీనివల్ల భారీ వాహనాలు పట్టణాల్లోకి రాకుండా నేరుగా హైవేలకు చేరుకుంటాయి. జిల్లా కేంద్రం నుంచి రింగు రోడ్డుకు చేరుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా ‘రేడియల్ రోడ్లను’ అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read
- Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
Also Read:Ration Cards : రేషన్ కార్డుతో సంబంధం లేదు.. ఇక నుంచి ఫ్యామిలీ కార్డులే..
హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల నెట్వర్క్ను రూపొందిస్తున్నారు. రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (RDC) ను బలోపేతం చేస్తున్నారు. ఆర్ అండ్ బీ శాఖకు ఉన్న సుమారు 400 ఎకరాల భూమిని ఆర్డీసీకి బదలాయించి.. వాటిపై బాండ్ల రూపంలో నిధులు సేకరిస్తారు.
Also Read:GHMC: గుడ్న్యూస్ చెప్పిన జీహెచ్ఎంసీ.. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట..
రాష్ట్రంలో ఇంధన విక్రయాల ద్వారా వచ్చే సెస్సులో 2 శాతం వాటాను నేరుగా ఆర్డీసీకి కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా నెలకు సుమారు రూ. 400 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఇకపై కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) మాత్రమే కొనుగోలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. అద్దెకు తీసుకునే వాహనాలు కూడా ఈవీలే ఉండాలని పేర్కొన్నారు. రవాణా శాఖలో అవినీతికి తావులేకుండా అన్ని కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ఆన్లైన్ చేస్తున్నారు. రోడ్ సెక్టార్ పాలసీ-2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం.. రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
తాజావార్తలు
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
-
Top 5 Expensive Phones: భారత్లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!