నిజామాబాద్ జిల్లాలో BJP, BRS మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై మరొకరు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేస్తూ నగరంలో హల్చల్ సృష్టిస్తున్నాయి.
త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఏప్రిల్ 9న 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్' జరగనుంది.ప్రధాని నరేంద్ర మోదీ కూడా కర్ణాటకలో పర్యటించనున్న రోజున రాహుల్ గాంధీ కర్ణాటకలో పర్యటించనున్నారు.
మంచిర్యాలలో పీపుల్స్ మార్చ్ సందర్భంగా భట్టి విక్రమార్క వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. లిక్కర్ స్కాం పై భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఢిల్లీ తరహాలో తెలంగాణ లో లిక్కర్ స్కాం జరుగుతుందని మండిపడ్డారు. లోతుగా విచారణ చేపట్టితే బయట పడుతుందని అన్నారు.
Poster War In Telangana: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ల మధ్య పోస్టర్ వార్ ముదురుతోంది. నువ్వా నేనా అన్నరీతిలో పోస్టర్లు పెడుతూ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ పనులపై ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తూ పోస్టర్ వెలిసింది.
Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై పలు విదేశాలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, జర్మనీలు పరిస్థితిని గమనిస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశాయి. అయితే నిన్న జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాహుల్ గాంధీ అనర్హతపై స్పందించింది. ‘‘ భారత్ లో రాహుల్ గాంధీకి జైలు శిక్ష, లోక్ సభ సభ్యత్వం కోల్పోవడం వంటి అంశాలను మేం గమనిస్తున్నాం, ఈ కేసులో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయి. రాహుల్ గాంధీ పైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు.’’ అని…
బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు దొంగలే అని ఎం.ఎల్.సి. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీతో రైతులకు, కూలీలకు రక్షణ కల్పిస్తే.. మోడీ ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు 12ల క్షల కోట్లు మాఫీ చేసిందని మండిపడ్డారు.
నల్లగొండ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా రాములోరి కళ్యాణం, ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంటే.. తిరుమలగిరిలో మాత్రం శ్రీరామ నవమి సందర్భంగా రికార్డింగ్ డాన్సులతో మారుమోగింది.