Poster War: బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. తెలంగాణలో ఇరు పార్టీల మధ్య పోస్టర్ వార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poster War In Telangana: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ల మధ్య పోస్టర్ వార్ ముదురుతోంది. నువ్వా నేనా అన్నరీతిలో పోస్టర్లు పెడుతూ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ పనులపై ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తూ పోస్టర్ వెలిసింది. తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మోదీ నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఇప్పటికే బీఆర్ఎస్ మండిపడుతోంది. ఐదేళ్లు పూర్తి అయినా ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు 40 శాతం కూడా పూర్తి కాలేదని, ఇంకెన్నినాళ్లు ఈ ఫ్లైఓవర్ కడుతారంటూ మోదీని ప్రశ్నిస్తూ అడుగడుగున పోస్టర్లు వెలిశాయి.

Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
Read Also: Super Sketch: కృష్ణ కోసం సిమ్రాన్ను చంపిన జ్యోతి.. దారం, ముక్కు పుడకే ఆధారం
ఇదిలా ఉంటే బీజేపీ కూడా అంతేధీటుగా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వమే ఫ్లైఓవర్ నిర్మాణ జాప్యానికి కారణం అంటూ మంత్రి కేటీఆర్ పోస్టర్లు వెలిశాయి. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై పసుపు బోర్డు గురించి ప్రశ్నిస్తూ పోస్టర్లు వెలుగులోకిరాగా.. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ తలదించుకునేలా చేశారంటూ పోస్టర్లు వెలిశాయి.

గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన బీజేపీ నేత అరవింద్ ప్రధానంగా పసుపుబోర్డు హామీ ఇచ్చారు. దీనిని ప్రశ్నిస్తూ ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపుబోర్డు అంటూ ‘‘పసుపు కలర్ బోర్డు’’తో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ పోస్టర్ వార్ తో ఇరు పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుతోంది. మరోసారి బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి రావాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే బీజేపీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది. ఇన్నాళ్లు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలని భావిస్తోంది. అయితే అధికారం లేకపోతే ప్రతిపక్షం టార్గెట్ గా బీజేపీ రాజకీయాలు చేస్తోంది.
- Tags
- bjp
- BRS
- ktr
- mp arvind
- poster war
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..