IND vs WI Qualification Scenarios: భారత్-వెస్టిండీస్ సెమీస్ రేస్ సమీకరణాలు.. అదే జరిగితే టీమిండియా ఇంటికే!
- మరింత ఉత్కంఠగా సెమీ ఫైనల్ రేస్
- భారత్-వెస్టిండీస్ సెమీస్ రేస్ సమీకరణాలు
- అదే జరిగితే టీమిండియా ఇంటికే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs West Indies Super 8 Qualification Scenario for Semi Finals in T20 World Cup 2026: టీ20 వరల్డ్కప్ 2026లో సెమీ ఫైనల్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది. గ్రూప్1లో ఇప్పటికే దక్షిణాఫ్రికా సెమీస్ చేరగా.. జింబాబ్వే నిష్క్రమించింది. ఇప్పుడు భారత్, వెస్టిండీస్ జట్ల సెమీస్ రేస్ రసవత్తరంగా ఉంది. మార్చి 1న జరిగే మ్యాచ్ ఇరు జట్ల భవితవ్యంను నిర్ణయించనుంది. ఈ పోరు కోల్కతా వేదికగా జరగనుండగా.. ప్రస్తుత సమీకరణాల ప్రకారం వెస్టిండీస్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
గురువారం (ఫిబ్రవరి 26) సాయంత్రం వరకు భారత్ సెమీస్ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఒక్కరోజే టీమిండియా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వెస్టిండీస్పై దక్షిణాఫ్రికా విజయం సాధించడం, జింబాబ్వేపై ఘన విజయం సాధించడంతో భారత్ ఒక్కసారిగా సెమీస్ రేసులో నిలిచింది. ఇక సెమీస్కు చేరాలంటే తప్పనిసరిగా మార్చి 1న వెస్టిండీస్పై గెలవాల్సిందే. విజయం సాధిస్తే సూర్య సేన నేరుగా సెమీస్ చేరుతుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే టీమిండియా ఇంటిదారి పట్టాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ రేండేసి పాయింట్లతో సమానంగా ఉన్నా.. నెట్ రన్ రేట్లో కరేబియన్లు (+1.791) ముందంజలో ఉన్నారు. భారత్ రన్ రేట్ -0.100గా ఉంది.
Also Read
- BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
- Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
- SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
Also Read: Suryakumar Yadav: ఆ వీడియోలు చూసి బరిలోకి దిగాం.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే భారత్, వెస్టిండీస్ జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. ఈ నేపథ్యంలో భారత్కు వెస్టిండీస్ మ్యాచ్ ‘డూ ఆర్ డై’ మ్యాచ్గా మారింది. సూర్య సేనకు గెలుపు తప్ప మరో మార్గం లేదు. వెస్టిండీస్ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. కరేబియన్లకు కూడా విజయం అవసరమే కానీ.. మ్యాచ్ వర్షం వల్ల రద్దయినా సెమీస్ చేరుతారు. అంటే విండీస్కు రెండు మార్గాలు ఉండగా.. భారత్కు మాత్రం ఒకటే మార్గం గెలుపు. ఈ మ్యాచ్లో నెట్ రన్రేట్కు ఎలాంటి పాత్ర ఉండదు. ఎవరు గెలిస్తే వారు ముందుకు వెళుతారు. దీంతో భారత్ అభిమానులు ఈ పోరును మినీ ఫైనల్ మ్యాచ్గా భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షం పడొద్దని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?