Shahid Afridi: అవి అసలు విజయాలా, భారత్కు సెమీస్ చేరే అర్హత లేదు.. షాహిద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు!
- భారత్ ప్రదర్శనపై ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు
- టీమిండియా సాధించిన విజయాలు విజయాలేనా
- భారత్కు సెమీస్ చేరే అర్హత లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahid Afridi’s criticism sparks debate ahead of IND vs WI Match: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. లీగ్, సూపర్-8లో టీమిండియా సాధించిన విజయాలు.. అసలు విజయాలేనా అని విమర్శించాడు. చిన్న జట్లపైనే టీమిండియా ప్రతాపం చూపిస్తుందని, పెద్ద జట్లపై తేలిపోతుందని ఎద్దవా చేశాడు. వరల్డ్ కప్ 2026లో భారత్కు సెమీస్ చేరే అర్హత లేదన్నాడు. టోర్నీలో భారత్ కంటే వెస్టిండీస్ మెరుగైన ప్రదర్శన చేసిందని, సెమీఫైనల్ చేరేందుకు కరేబియన్లకే 100 శాతం అర్హత ఉందని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఆఫ్రిది వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ… ‘భారత్ చిన్న జట్లను మాత్రమే ఓడించి టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్కు చేరడం టోర్నమెంట్ స్థాయిని దిగజార్చినట్లే. ఈ పోటీ నిష్పక్షపాతంపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. బలమైన జట్లను ఎదుర్కొన్నప్పుడు భారత్ అస్థిరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో పూర్తిగా ఆధిపత్యం కోల్పోయింది. అమెరికాపై సూర్యకుమార్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అలాగే పాకిస్తాన్తో మ్యాచ్లో కొన్ని కీలక పరిణామాలు జరిగి ఉంటే భారత్ ఓడిపోయే అవకాశం కూడా ఉండేది. టోర్నీలో భారత్ కంటే వెస్టిండీస్ మెరుగైన ప్రదర్శన చేసింది. సెమీఫైనల్ చేరేందుకు భారత్కు అర్హత లేదు. విండీస్ టీమ్ సెమీస్కు అర్హత గల టీమ్’ అని అన్నాడు.
Also Read
- Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
Also Read: Vijay-Rashmika Love Journey: పరిచయం, ప్రేమ, ప్రచారం, సినీ ప్రయాణం.. విజయ్-రష్మిక లవ్ జర్నీ ఇదే!
బలమైన జట్లపై విజయాలు సాధించకపోతే సెమీఫైనల్ అర్హత విలువ తగ్గిపోతుందని షాహిద్ ఆఫ్రిది అంటున్నాడు. ఆఫ్రిది వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. కొందరు ఆఫ్రిది విశ్లేషణను సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం భారత్ సాధించిన విజయాలను ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నాడని విమర్శిస్తున్నారు. సూపర్-8లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఓడి సెమీస్ అవకాశాలను భారత్ సంక్లిష్టం చేసుకున్న విషయం తెలిసిందే. జింబాబ్వేపై గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకొంది. ఇక వెస్టిండీస్పై గెలిచి సెమీస్ చేరాలని చూస్తోంది. మార్చి 1న వెస్టిండీస్తో భారత్ తలపడనుంది.
తాజావార్తలు
-
Janhvi Kapoor: టాలీవుడ్ తర్వాత కోలీవుడ్పై ఫోకస్.. భారీ వెబ్ సిరీస్తో జాన్వీ కపూర్ డిజిటల్ ఎంట్రీ!
-
Vastu Tips: మనీ ప్లాంట్ను ఈ దిశలో పెడితే ధన యోగం వస్తుందా?.. వాస్తు నిపుణులు చెప్పే సూచనలు ఇవే
-
Astrology: జూన్ 30 సోమవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Indian Army: అరుణాచల్లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!