స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 68వ జయంతి సందర్భంగా.. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా టీడీపీ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఎర్రన్న ఆశయాలు కొనసాగిస్తామని తెలిపారు. ఎర్రన్నాయుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు.. దివంగత ఎన్టీఆర్ ఆశయ సాధనకు ఎర్రన్న పనిచేశారని పేర్కొన్నారు.
హైదరాబాద్ గాంధీ భవన్లో ఇందిరా గాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు, ఎంపీ అనిల్ యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
CM Revanth Reddy: వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పంజాగుట్ట చౌరస్తాలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ మన పీవీ నర్సింహారావు అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. నాడు ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని సీఎం కేసీఆర్ తెలిపారు. మాజీ భారత ప్రధాని పీవీ నరసింహరావు 102 వ జయంతి సందర్భంగా సీఎం కేసిఆర్ వారి సేవలను స్మరించుకున్నారు.
హైదరాబాద్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మారకం ఆవిష్కరణ నేడు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్సాగర్ తీరంలో 125 అడుగుల భారీ విగ్రహాన్ని మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అట్టహాసంగా ఆవిష్కరించనున్నారు.
Dhakshina Murthy: ‘సంసారం సంసారం.. ప్రేమ సుధా తీరం.. నవజీవన సారం..’ అన్న మధురాన్ని 1950లో ‘సంసారం’ కోసం పలికించిన సుస్వరాల సుసర్ల దక్షిణా మూర్తి స్వరప్రయాణం తెలుగువారి మది పులకింపచేస్తూ సాగింది. గానకోకిల లతామంగేష్కర్ స్వరవిన్యాసాలను తెలుగులో తొలుత వినిపించిందీ ఆయనే. ‘సంతానం’లో లత పాడిన ‘నిదుర పోరా తమ్ముడా…’ గానం ఈ నాటికీ సంగీత ప్రియులను మురిపిస్తూనే ఉంది. ‘ఇలవేల్పు’ లోనూ ‘చల్లని రాజా ఓ చందమామ..’ పాటతో నిజంగానే ప్రేక్షకుల మదిలో చల్లని…
ఈరోజు తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీలుస్తోందంటే వల్లభాయి పటేల్ కారణమన్నారు ఎంపీ బండి సంజయ్ కుమార్ బండిసంజయ్. ఉక్కు మనిషి దివంగత సర్దార్ వల్లభాయి పటేల్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
కే.వి.రెడ్డిగా జనం మదిలో నిలచిన కదిరి వెంకటరెడ్డి తెలుగు సినిమాకు వెలుగులు అద్దిన వారిలో మేటి అనిపించుకున్నారు. దర్శకునిగా, నిర్మాతగా కేవీ రెడ్డి తనదైన బాణీ పలికించారు.
సిరివెన్నెల సీతారామారాశాస్త్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. ఆయన పాటల పూదోటలో విహరించని మనిషి ఉండడు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా ఆయన సాహిత్యం ఎప్పుడూ మన మధ్యనే ఉండేలా తానా ఒక గొప్ప నిర్ణయం తీసుకొంది. సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చేందుకు తానా సంకల్పించింది. నేడు ఆయన జయంతిని పురస్కరించుకొని హైదరాబాదు శిల్పకళావేదికలో “సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్య సంపుటి – 1” పుస్తకావిష్కరణ వేడుక…