CM Revanth Reddy: నేడు ఏపీకి రేవంత్రెడ్డి.. ప్రత్యేక విమానంలో విజయవాడకు..
- పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
- మధ్యాహ్నం పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సమీక్ష..
- సాయంత్రం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి విజయవాడకు సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పంజాగుట్ట చౌరస్తాలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం సహా అందరూ ప్రజాభవన్కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి గాంధీభవన్కు చేరుకుని వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పిస్తారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిబిరాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయాన్ని సమీక్షించనున్నారు.
Read also: Shiva Stotram: సోమవారం నాడు ఈ స్తోత్రాలు వింటే శుభ ఫలితాలు చేకూరుతాయి.
Also Read
అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్రెడ్డి విజయవాడకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరి చేరుకుని అక్కడ వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి రేవంత్ హాజరుకానున్నారు. సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు కూడా విజయవాడ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైఎస్ఆర్ కుమార్తె, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. వైఎస్ఆర్ అభిమానులను మళ్లీ ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలను టీపీసీసీ ఘనంగా నిర్వహిస్తోంది. ప్రజాభవన్, గాంధీభవన్లలో కార్యక్రమాలు జరిగాయి. ప్రజాభవన్లో వైఎస్ఆర్ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
PM Modi : నేటి నుంచి మూడు రోజుల పాటు మోడీ విదేశీ పర్యటన.. ఆస్ట్రియాతో కీలక చర్చలు జరిపే ఛాన్స్
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!