CM Revanth Reddy: నేడు ఏపీకి రేవంత్రెడ్డి.. ప్రత్యేక విమానంలో విజయవాడకు..
- పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
- మధ్యాహ్నం పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సమీక్ష..
- సాయంత్రం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి విజయవాడకు సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పంజాగుట్ట చౌరస్తాలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం సహా అందరూ ప్రజాభవన్కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి గాంధీభవన్కు చేరుకుని వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పిస్తారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిబిరాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయాన్ని సమీక్షించనున్నారు.
Read also: Shiva Stotram: సోమవారం నాడు ఈ స్తోత్రాలు వింటే శుభ ఫలితాలు చేకూరుతాయి.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్రెడ్డి విజయవాడకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరి చేరుకుని అక్కడ వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి రేవంత్ హాజరుకానున్నారు. సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు కూడా విజయవాడ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైఎస్ఆర్ కుమార్తె, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. వైఎస్ఆర్ అభిమానులను మళ్లీ ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలను టీపీసీసీ ఘనంగా నిర్వహిస్తోంది. ప్రజాభవన్, గాంధీభవన్లలో కార్యక్రమాలు జరిగాయి. ప్రజాభవన్లో వైఎస్ఆర్ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
PM Modi : నేటి నుంచి మూడు రోజుల పాటు మోడీ విదేశీ పర్యటన.. ఆస్ట్రియాతో కీలక చర్చలు జరిపే ఛాన్స్
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!