Punjab Kesari: లాలా లాజపత్ రాయ్ జయంతి.. బ్రిటీష్ పాలకుల గడగడలాడించిన సింహం.!
- పంజాబ్ కేసరి లాలా లాజపత్ రాయ్ జయంతి
- స్వాతంత్ర్యానికి ఊపిరినిచ్చిన లాల్-బాల్-పాల్ త్రయం
- సైమన్ కమిషన్ వ్యతిరేక నిరసనలో రక్తపాతం
- విప్లవకారులకు స్ఫూర్తిగా నిలిచిన త్యాగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lala Lajpat Rai Birth Anniversary: భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ‘లాల్-బాల్-పాల్’ త్రయం గురించి వినని వారు ఉండరు. అందులో అత్యంత శక్తివంతమైన నాయకుడు, పంజాబ్ కేసరిగా పిలవబడే లాలా లాజపత్ రాయ్. 1865, జనవరి 28న పంజాబ్లోని మోగా జిల్లాలో జన్మించిన ఆయన, తన మాటలతో, చేతలతో దేశవ్యాప్తంగా విప్లవ జ్వాలలను రగిలించారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడి పోరాటాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం.
లాల్-బాల్-పాల్ త్రయంలో కీలక శక్తి
లాలా లాజపత్ రాయ్ అతివాద నాయకుడిగా పేరుగాంచారు. బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్లతో కలిసి ఆయన స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త ఊపిరి పోశారు. కేవలం విజ్ఞప్తులతో స్వాతంత్ర్యం రాదని, పోరాడి సాధించుకోవాలని నమ్మిన వ్యక్తి ఆయన. స్వదేశీ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో, విదేశీ వస్తువులను బహిష్కరించడంలో ఆయన చేసిన కృషి అనన్యం. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఆయన పత్రికలను, విద్యాలయాలను వేదికగా చేసుకున్నారు.
Also Read
- Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
- IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
- Adhika Masa Purnima: ఈ రోజే అధిక మాస పౌర్ణమి.. పవిత్ర స్నానాలకు, దానాలకు ఏ సమయం శుభప్రదమో తెలుసుకోండి!
- Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్థాపన , విద్యా సేవలు
లాలా లాజపత్ రాయ్ కేవలం రాజకీయ నాయకుడే కాదు, గొప్ప దార్శనికుడు కూడా. భారతీయుల ఆర్థిక స్వావలంబన కోసం 1894లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ను స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. స్వదేశీ బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలని ఆ రోజుల్లోనే ఆయన కలలు గన్నారు. అలాగే, దయానంద సరస్వతి బోధనలకు ప్రభావితుడై ‘ఆర్య సమాజ్’లో చేరి, అనేక విద్యా సంస్థల స్థాపనకు (DAV Schools) పునాదులు వేశారు.
సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటం – అమరత్వం
1928లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు “సైమన్ గో బ్యాక్” అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. లాహోర్లో జరిగిన నిరసన ప్రదర్శనకు లాలా లాజపత్ రాయ్ నాయకత్వం వహించారు. ఆ సమయంలో బ్రిటీష్ పోలీసులు జరిపిన క్రూరమైన లాఠీ ఛార్జీలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయాలతోనే పోరాడుతూ 1928, నవంబర్ 17న ఆయన తుదిశ్వాస విడిచారు. చనిపోయే ముందు ఆయన అన్న “నా శరీరంపై పడే ప్రతి లాఠీ దెబ్బ, బ్రిటీష్ సామ్రాజ్య శవపేటికకు కొట్టే ఒక్కో మేకు లాంటిది.” మాటలు చరిత్రలో నిలిచిపోయాయి..
లాలా లాజపత్ రాయ్ మరణం దేశవ్యాప్తంగా విప్లవకారులను ఉర్రూతలూగించింది. భగత్ సింగ్ వంటి యువ వీరులు ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని కంకణం కట్టుకున్నారు. ఆయన త్యాగం, ధైర్యం నేటికీ కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిదాయకం. దేశం కోసం సర్వస్వం ధారపోసిన ఆ పంజాబ్ కేసరికి ఘన నివాళులు అర్పిద్దాం.
తాజావార్తలు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!