సాధారణంగా వంతెనలు అంటే సిమెంట్, లేదా స్టీల్తో నిర్మిస్తుంటారు. రోడ్డును దాటేంగుకు పాదచారుల కోసం చాలా ప్రాంతాల్లో ఐరన్, స్టీల్తో నిర్మించిన వంతెనలు కనిపిస్తుంటాయి. వాహనాలు ప్రయాణం చేసేందుకు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో వంతెనలు నిర్మిస్తున్నారు. ఇవి అన్ని చోట్ల ఉండేవే. కానీ, కొన్ని వంతెనలు చాలా స్పెషల్గా ఉంటాయి. అలాంటివే గ్లాస్ వంతెనలు. వంతెనలను గ్లాస్తో నిర్మిస్తారు. ఇలాంటివి దేశంలో రెండు ఉన్నాయి. అందులో ఒకటి సిక్కింలో ఉన్నది. సిక్కింలోని పెల్లింగ్ నగరంలో ఈ గ్లాస్…
కవితకు కాదేది అనర్హం అని శ్రీశ్రీగారు చెప్పినట్టుగా దోచుకోవడానికి దొంగలకు కాదేది అనర్హం అంటున్నారు బీహార్ దొంగలు. బీహార్లోని డెహ్రీ పట్టణంలో చారిత్రాత్మకమైన సూర్య గడియారాన్ని దొంగలు దోచుకుపోయారు. 1871లో బ్రిటీష్ పరిపాలన కాలంలో డెహ్రీ పట్టణంలో ఈ గడియారాన్ని ఏర్పాటు చేశారు. చారిత్రాత్మకమైన ఈ గడియారం ఉన్న ప్రాంతం చుట్టూ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ ఆఫీసులు ఉన్నాయి. నిత్యం ప్రజలు ఈ ప్రాంతంలో తిరుగుతుంటారు. అంతేకాదు, జిల్లా జెడ్జి, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, సబ్ డివిజినల్…
వరంగల్ రైల్వే పోలీసుల అప్రమత్తతో ఓ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వేగంగా వెళుతున్న ట్రైన్ నుంచి ప్లాట్ ఫాం పైకి పడిన యువకుడు కాసేపట్లో పట్టాలపై పడే ప్రమాదం నుంచి కాపాడిన వరంగల్ రైల్వే పోలీసుల్ని పలువురు అభినందిస్తున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లలో కదులుతున్న రైల్ నుండి దిగేందుకు ప్రయత్నించి అదుపు తప్పి పడిపోయాడు బీహార్ యువకుడు. అతడిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు రైల్వే పోలీసులు. బీహార్ కు చెందిన ప్రార్థన కుమార్ వరంగల్ నుండి…
దేశం సాంకేతికంగా పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. డిటిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా వరకు క్యాష్ ను క్యారీ చేయడం లేదు. ఏది కావాలన్నా ఫోన్పే, గూగుల్ పే ద్వారా కొనుగోలు చేస్తున్నారు. దీంతో వీధిలో ఉండే బెగ్గర్లు అవస్థలు పడుతున్నారు. ఎవర్ని అడిగినా డబ్బులు లేవని చెబుతుండటంతో వారు కూడా టెక్నాలజీకి అప్గ్రేడ్ అవుతున్నారు. పేటీఎం, ఫోన్పే తదితర డిజిటల్ పేమెంట్ బోర్డులను మెడలో వేసుకొని తిరుగుతున్నారు. ఎవరైనా చిల్లర లేదని అంటే…
ఫిబ్రవరి 10 వ తేదీన ఆర్జేడీ కార్యనిర్వాహక సమావేశం జరగనున్నది. ప్రతి ఏడాది పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి జరుగుతున్న మార్పులపై చర్చిస్తారు. ప్రజాసమస్యలపై ఎలాంటి పోరాటం చేయాలో పార్టీలో చర్చిస్తుంటారు. అయితే, దాణా కుంభకోణం కేసులో మొన్నటి వరకు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చారు. ఇక, 2020లో జరిగిన బీహార్ ఎన్నికల్లో లాలూ చిన్నకొడుకు తేజశ్వీ యాదవ్ నేతృత్వంలో…
బీహార్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫలితాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో వేలాదిమంది అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు గయాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గయాలో ఓ రైలుకు ఆందోళనకారులు నిప్పు అంటించారు. సీబీటీ 2 పరీక్ష తేదీని నోటిఫై చేయలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 2019లో విడుదల చేసిన నోటిఫికేషన్కు చెందిన ఫలితాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీటీ 2 పరీక్షను…
కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్ సీఎస్కు సమన్లు జారీ చేసింది.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఇవాళ విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. ఇరు రాష్ట్రాల సీఎస్లు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కోవాలని స్పష్టం చేసింది..…
బీహార్లో కల్తీ మద్యం కలకలం రేపింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలో సంక్రాంతి పండగ సందర్భంగా కల్తీ మద్యం తాగి 11 మంది మరణించారు. శనివారం ఆరుగురు మరణించగా… ఆదివారం మరో ఐదుగురు మరణించారు. బీహార్లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తుండటం గమనార్హం. 2016 నుంచి బీహార్లో మద్యపాన నిషేధం ఉండగా.. గత రెండు నెలల వ్యవధిలోనే కల్తీ మద్యానికి అలవాటు పడి…
పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.. తెలంగాణలో అయితే, ఏకంగా వడగళ్ల వానలు ఆందోళన కలిగిస్తున్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మోస్తరుగా వర్షాలు కురుస్తుండగా.. ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఓ మోస్తరుగా వర్షం పడుతోంది.. మరోవైపు.. జనగామ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది.. జిల్లాలోని బచ్చన్నపేట నర్మెట్ట మండలంలో రాళ్ల వర్షం కురిసింది.. ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ నెల 14వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరికలు…
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో వ్యాక్సిన్ను వేగంగా అందిస్తున్నారు. అర్హతకలిగిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశంలో 80 శాతం మంది వరకు మొదటి డోసు తీసుకున్నారు. 60 శాతానికిపైగా ప్రజలు రెండో డోసు తీసుకున్నారు. మిగిలిన వారు కూడా వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 11 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాడు. 12…