Iran: ఇరాన్లో డేంజర్ బెల్స్.. అణు కేంద్రం నుంచి రేడియేషన్ లీక్.. శాస్త్రవేత్తల్లో భయాందోళనలు
- ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు
- నతాంజ్ అణు కేంద్రం నుంచి రేడియేషన్ లీక్
- భయాందోళనలో నియంత్రణ నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తున్నాయి. దీంతో ఫోర్డో, నతాంజ్ , ఎస్ఫహాన్ అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అణు కేంద్రాల నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్లుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. నగరాలు.. నగరాలనే ఖాళీ చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: US Iran War: వ్యూహం మార్చిన ఇరాన్.. ఆ దేశాలే టార్గెట్.. భారతీయులకు పొంచి ఉన్న ముప్పు!
Also Read
వాస్తవంగా అణు కేంద్రాలపై దాడి చేయకూడదని ఐక్యరాజ్యసమితిలోని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ వార్నింగ్ ఇచ్చింది. కానీ తాజా దాడుల్లో అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ కూడా అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దాడుల జరుగుతాయన్న నేపథ్యంలో యురేనియం నిల్వలను అణు కేంద్రాల నుంచి ముందుగానే బదిలీ చేశారని, రేడియేషన్కు కారణమయ్యే పదార్థాలు అక్కడ లేవని ఇరాన్ రాష్ట్ర ప్రసార సంస్థ తెలిపింది.
ఇది కూడా చదవండి: Bollywood : చేతులు కాలుతోన్న మలయాళ రీమేక్స్ మోజులో బాలీవుడ్
గత శనివారం నుంచి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సహా ప్రభుత్వ పెద్దలు నేలకూలారు. దీంతో ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్ మద్దతు గల దేశాలపై దాడులు చేస్తోంది. తాజా యుద్ధంలో ఇప్పటి వరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

తాజావార్తలు
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!