భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (45) ఎన్నికయ్యారు. జేపీ నడ్డా వారసుడిగా బీహార్ నేతకు అవకాశం దక్కింది. సోమవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కమల దళపతిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏప్రిల్లో ఖాళీ అయ్యే స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక బీహార్లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తర్వాత లాలూ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎన్నికలకు ముందు ఆర్జేడీ నుంచి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ను బహిష్కరించారు. ఇక ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమి తర్వాత కుటుంబంలో విభేదాలు నానా రచ్చ చేశాయి.
Giriraj Singh: బీహార్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేశారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్జేడీ, ఇతర ప్రతిపక్ష నేతలు కేంద్రమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. జనవరి 10న బెగుసరాయ్ జిల్లాలోని బచ్వారాలో జరిగిన సమావేశానికి బీహార్ పశుసంవర్ధక మంత్రి, బచ్వార ఎమ్మెల్యే సురేంద్ర మెహతా నిర్వహించారు. గిరిరాజ్ సింగ్ సహా సీనియర్ NDA నాయకులు హాజరయ్యారు. Read Also:…
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చీలికలు రచ్చకెక్కాయి. విభేదాలు కారణంగా కుటుంబ సభ్యులంతా ఎవరికి వారే వేరైపోయినట్లుగా తెలుస్తోంది. తాజాగా లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఆసక్తికర ట్వీట్ చేశారు.
బీహార్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. అధికార జేడీయూలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పార్టీ సీనియర్ నాయకుడు కేసీ త్యాగిని అధిష్టానం బహిష్కరించింది.
బీహార్లో నెలకొన్న హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ వేదికపై నియామక పత్రాలు అందజేశారు. ఆ సందర్భంగా ముస్లిం వైద్యురాలు హిజాబ్ ధరించుకుని వేదికపైకి వచ్చింది. అయితే నితీష్ కుమార్ పత్రాన్ని అందజేసే క్రమంలో వైద్యురాలి హిజాబ్ తొలగించే ప్రయత్నం చేశారు.
బీహార్లో గతేడాది వర్షాకాలంలో అనేక బ్రిడ్జ్లు కూలిపోయాయి. దీంతో నితీష్ కుమార్ సర్కార్పై అనేక విమర్శలు వచ్చాయి. ఇక గత నెలలో మరోసారి నితీష్ కుమార్ ప్రభుత్వం గద్దెనెక్కింది. కొత్త సర్కార్ ఏర్పడిన నెలరోజులకే ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రోప్ వే కూలిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఎట్టకేలకు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసింది. పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్లోని బంగ్లాలో 19 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని లాలూ కుటుంబానికి నోటీసులు ఇచ్చింది. దీనిపై గత కొద్దిరోజులుగా రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఖాళీ చేసేందుకు నిరాకరించింది. ముఖ్యమంత్రులుగా పని చేసిన తమకు బంగ్లాను…
బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వేదికపై ఓ ముస్లిం వైద్యురాలి హిజాబ్ తొలగించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో విపక్షాలు, నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. ఈ వ్యవహారం రాజకీయంగా చాలా దుమారమే చెలరేగింది.