YS Jagan: గల్ఫ్లో చిక్కుకున్న ఆంధ్రులను వెంటనే రప్పించండి.. ప్రభుత్వానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: గల్ఫ్లో చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను వెంటనే వెనక్కి రప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మధ్య పాశ్చ్య దేశాల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు జగన్.. గల్ఫ్ దేశాల్లో వేలాది మంది ఆంధ్రులు ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరుక్కుపోయారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. గల్ఫ్ దేశాల్లో వేలాది మంది ఆంధ్రులు ఉపాధి కోసం పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల వల్ల వారి భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొన్నదన్నారు. విమాన సర్వీసుల రద్దు, విమానాశ్రయాల్లో ఆంక్షలు విధించడంతో అనేక మంది అక్కడికక్కడే ఇరుక్కుపోయారని తెలిపారు.
Read Also: Bollywood : చేతులు కాలుతోన్న మలయాళ రీమేక్స్ మోజులో బాలీవుడ్
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్. అవసరమైతే ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి ప్రవాసాంధ్రులను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని సూచించారు. అలాగే గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, రాష్ట్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి హెల్ప్లైన్ నంబర్లను ప్రకటించాలని కోరారు. అక్కడి పరిస్థితులపై వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ఈ సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రవాస ఆంధ్రుల భద్రత మరియు సురక్షిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యంగా ఉండాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!