సాధారణంగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానాను విధిస్తూ ఉంటారు. బీహార్లో ఓ ద్విచక్ర వాహనదారుడు సీటు బెల్టు పెట్టుకోనందుకు విచిత్రమైన ట్రాఫిక్ చలాన్ అందుకున్నాడు.
Ram Navami violence: రామ నవమి రోజు బీహార్ ససారంలో ఊరేగింపు సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ హింసలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న మాజీ బీజేపీ ఎమ్మెల్యే జవహర్ ప్రసాద్ ను రోహ్తాస్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామం బీహార్ రాష్ట్రంలో జేడీయూ వర్సెస్ బీజేపీగా మారింది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జవహర్ ప్రసాద్ ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని…
బీహార్కు చెందిన జేడీయూ సీనియర్ నేత కైలాష్ మహతో దారుణంగా హత్యకు గురయ్యారు. ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు గురువారం కతిహార్లో గుర్తుతెలియని బైక్పై వచ్చిన దుండగులు కాల్చి చంపారు.
మూడు దశాబ్దాల క్రితం ఐఏఎస్ అధికారిని హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవించిన గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ఆనంద్ మోహన్ విడుదలను సులభతరం చేసిన బీహార్ జైలు నిబంధనల సవరణను సవాలు చేస్తూ పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ విషయంలో బీహార్ ప్రభుత్వ ఉత్తర్వులపై దళిత సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. 1994లో దళిత ఐఏఎస్ అధికారి అయిన గోపాల్గంజ్ జిల్లా మాజీ మేజిస్ట్రేట్ జి కృష్ణయ్యను హత్య చేసిన కేసులో దోషిగా ఉన్న ఆనంద్ మోహన్ మంగళవారం జైలు నుంచి విడుదలైయ్యారు.
40 మంది మహిళలకు ఒక్కడే భర్తట.. వారి పిల్లలకు అతనే తండ్రికూడనట.. ఒకే ప్రాంతానికి చెందిన 40 మంది మహిళలు చెప్పింది విన్న అధికారులు షాక్ కు గురయ్యారు. బీహార్ లోని అర్వాల్ లోని వార్డు నంబర్ 7లో 40 మంది మహిళలు తమ భర్త పేరును రూప్ చంద్ అని చెప్పారు.
గురువారం జమ్మూకశ్మీర్లోని పూంచ్లో ఐదుగురు సైనికులను చంపిన ఉగ్రదాడి 2024 లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర కావచ్చునని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర పేర్కొన్నారు.
బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం మరోమారు కలకలం చేరింది. మద్యపాన నిషేదంఉన్న బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది డిసెంబర్లో కల్తీ మద్యం సేవించి 75 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే రాష్ట్రంలోని మోతీహరి జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందారు.
రైల్వే భూముల కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మంగళవారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరు కానున్నారు. తేజస్వి ఉదయం 11 గంటలకు విచారణలో చేరే అవకాశం ఉంది. ఇదే కేసులో మార్చి 25న తేజస్వీ యాదవ్ ను సీబీఐని ప్రశ్నించింది.
Success Story: కష్టపడే తత్వం, తెలివితేటలు ఉంటే చాలా ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొని గొప్పగా మారొచ్చు. అందుకు ఈ దిల్ఖుష్కుమార్ జీవితమే ఓ ఉదాహరణ. పెద్దపెద్ద చదువులు చదివినా కొన్ని సార్లు రాని పేరు తన కష్టం, తెలివితో సాధించుకున్నాడు. రిక్షాపుల్లర్, సాధారణ డ్రైవర్, కూరగాయల వ్యాపారి స్థాయి నుంచి కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దేశంలో పేరొందిన ఐఐటీ, ఐఐఎం గ్యాడ్యుయేట్లకు తన సంస్థలో ఉద్యోగం ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.