Surgery : వైద్య చరిత్రలో మరో అద్భుతం.. 25నిమిషాల్లోనే వెన్నుముక ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Surgery : వృద్ధాప్యంలో ఎముక విరిగితే చాలా కష్టం. వయసు రీత్యా అతుక్కోవడానికి చాలా టైంపడుతుంది. అదే వెన్నుముకకు గాయమైతే అంతే సంగతులు మంచానికి పరిమితం కావాల్సిందే. ఇలాంటి క్లిష్టమైన ఈ సమస్యకు కొత్త టెక్నాలజీ పరిష్కారం కనుగొంది. ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఓఖ్లాలోని ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ కౌశల్ మిశ్రా ఉత్తర భారతదేశంలో మొదటిసారిగా 65 ఏళ్ల మహిళకు వెన్నుపూస సెప్టో ప్లాస్టీ సర్జరీ చేసి అద్భుతం సృష్టించారు. ఇప్పటి వరకు హార్ట్ సర్జరీలో స్టంట్స్ వాడేవారని డాక్టర్ కౌశల్ తెలిపారు. వెన్నెముక శస్త్రచికిత్సలో స్టంట్స్ను ఉపయోగించడం ఇదే తొలిసారి. సెప్టో ప్లాస్టీ అనేది ఒక విప్లవాత్మక సాంకేతికత అని, దీనిలో వెన్నుపూస శరీరం లోపల స్టాట్ను చొప్పించడం ద్వారా సిమెంట్ను పూస్తారని తెలిపారు. తీవ్రమైన నొప్పికి ఇది చాలా ప్రభావవంతమైన చికిత్సగా ఆయన అభివర్ణించాడు.
Read Also:Honey Rose : నా బాడీ షేప్ గురించి వాడు నోటికి వచ్చినట్లు వాగుతుంటే.. నవ్వారు
Also Read
రోగికి ఏమైంది..
బీహార్లోని బెగుసరాయ్లో నివాసముంటున్న సుధా సింగ్ తన ఇంట్లో పని చేస్తూ కుప్పకూలి పడిపోయింది. దీంతో తన స్వస్థలమైన బెగుసరాయ్లోని ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో ఆమెకు వెన్నుపూసలో కంప్రెషన్ ఫ్రాక్చర్ ఉందని తేలింది. దాని కారణంగా చాలా నొప్పి, వెన్నుపూస దెబ్బతినడం వల్ల ఆమె కనీసం నిలబడలేకపోయింది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసినా ఆమెకు నయం కాలేదు.. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఢిల్లీకి తీసుకొచ్చారు. డాక్టర్ కౌశల్ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వెన్నుపూసలో కంప్రెషన్ ఫ్రాక్చర్ సంభవించినట్లు కనుగొన్నారు. రోగికి అప్పటికే బోలు ఎముకల బలహీనత, అధిక రక్తపోటు, మధుమేహం, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి వ్యాధులు ఉన్నాయి. ఇవి శస్త్రచికిత్సకు ప్రమాద కారకంగా మారవచ్చు. దీంతో అన్ని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని వైద్యులు సంప్రదాయ శస్త్రచికిత్స పద్ధతిని అనుసరించకుండా సెప్టో ప్లాస్టీ విధానాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు డాక్టర్ కౌశల్ తెలిపారు.
కొత్త టెక్నాలజీ ఏంటి!
ఖచ్చితమైన ఫలితాల కోసం ఇతర స్టేజింగ్ విధానాల మాదిరిగానే సెప్టో ప్లాస్టీ ఉంటుందని డాక్టర్ కౌశల్ వివరించారు. కార్డియాక్ స్టెంటింగ్ లాగా, వెన్నుపూస సెప్టో ప్లాస్టీ కూడా స్థానిక అనస్థీషియాతో నిర్వహిస్తారు. సెప్టో ప్లాస్టీలో, విరిగిన ఎముక లోపల టైటానియంతో విస్తరించదగిన పంజరం చేర్చబడుతుంది. దీని తర్వాత పంజరం పరిమాణం పెంచి, విరిగిన ఎముకను తీసివేస్తారు. దీనితో ఎత్తు మునుపటిలాగానే మారుతుంది. వెన్నుపూసలో ఖాళీ ఏర్పడిన చోట సిమెంట్ నింపుతారు.
Read Also:AP NEWS: జనాల్లోకి జనసేనాని.. వారాహిపై ప్రచారానికి సిద్ధమైన పవన్ కల్యాణ్
త్వరగా రికవరీ
డాక్టర్ రవీంద్ర సింగ్ బిష్త్ మాట్లాడుతూ, ఈ టెక్నిక్ కారణంగా రోగి చాలా వేగంగా కోలుకోవడంతో శస్త్రచికిత్స తర్వాత నడవడం ప్రారంభించారని తెలిపాడు. శస్త్రచికిత్స తర్వాత ఎటువంటి సంక్లిష్టత లేదని, తద్వారా రోగి జీవితం మెరుగుపడిందని చెప్పారు. ఈ సందర్భంలో వెన్నుపూస లోపల స్టెంట్ను వదిలేశామని, అక్కడ సిమెంట్ లీక్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉందని, నాడీ సంబంధిత సమస్యలు కూడా తగ్గాయని ఆయన చెప్పారు. ఇది కాకుండా వెన్నుపూస ఎత్తు కూడా మెరుగుపడింది. కేవలం 25 నిమిషాల్లోనే ఈ సర్జరీ చేసి ఒక్కరోజులోనే డిశ్చార్జి చేశారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!