Bihar: వంతెన స్లాబ్, పిల్లర్ మధ్య చిక్కుకున్న బాలుడు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్లోని రోహతాస్ జిల్లాలో వంతెన స్లాబ్, పిల్లర్ మధ్య చిక్కుకున్న 11 ఏళ్ల బాలుడిని రక్షించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గురువారం ప్రాణాలు కోల్పోయాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం రెస్క్యూ ఆపరేషన్కు నాయకత్వం వహించింది. బాలుడు తప్పిపోయిన రెండు రోజుల తర్వాత చిక్కుకున్న బాలుడిని రక్షించే ఆపరేషన్ బుధవారం ప్రారంభమైంది. బిక్రంగంజ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఉపేంద్ర పాల్ మాట్లాడుతూ.. వంతెన నుంచి బాలుడిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ సుమారు 12 నుంచి 14 గంటల పాటు కొనసాగిందని తెలిపారు.
Read Also: Afghanistan: ఆఫ్ఘన్ మంత్రి అంత్యక్రియల్లో ఆత్మాహుతి దాడి.. 11 మంది మృతి
Also Read
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
అంతకుముందు, బాలుడి తండ్రి శత్రుధన్ ప్రసాద్ మాట్లాడుతూ.. తన కొడుకు మానసిక స్థితి సరిగా లేదని, రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడని చెప్పాడు. బాలుడి కోసం వెతుకుతున్న సమయంలో, సోన్ నదిపై నిర్మించిన వంతెన స్తంభం నంబర్ 1 మరియు స్లాబ్ మధ్య అతను ఇరుక్కుపోయాడని ఒక మహిళ కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో అతడిని రక్షించేందుకు అధికార యంత్రాంగం కదిలింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం ఎంతో శ్రమించి ఆ బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. వారి రోధన అక్కడి వారిని కలచివేసింది.
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!