Bihar: జైల్లో ఉన్న భర్త ముఖాన్ని చూసి గర్భవతి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని భాగల్పూర్లోని ప్రత్యేక సెంట్రల్ జైలులో దారుణం జరిగింది. హత్యాయత్నం చేసి జైలులో ఉన్న భర్తను కలిసేందుకు వెళ్లిన భార్య.. భర్త ముఖం చూడగానే స్పృహతప్పి పడిపోయింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ మహిళ 8 నెలల గర్భిణి.. అయితే ఆమెకు ఈ నెల 27న ప్రసవం కావాల్సి ఉంది. ఆమె మృతికి పోలీసులే బాధ్యత వహించాలని మృతురాలి బంధవులు ఆరోపించారు.
Read Also: Rahul Gandhi Vs Dhankar: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన ఉప రాష్ట్రపతి ధన్కర్
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
- New T20 captain Shreyas Iyer: 'సింహాల్లా ఆడదాం'.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
నిజానికి భాగల్పూర్లోని స్పెషల్ సెంట్రల్ జైలులో జూన్ 6వ తేదీన దారుణ ఘటన జరిగింది. భాగల్పూర్కు చెందిన ఘోఘా గోవింద్పూర్కు చెందిన గుడ్డు యాదవ్కు ఘోఘా జనిదిహ్కు చెందిన పల్లవి యాదవ్తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరిది ప్రేమ వివాహం కాగా ప్రస్తుతం పల్లవి 8 నెలల గర్భిణి. గుడ్డు యాదవ్కు వినోద్ యాదవ్తో భూమి విషయంలో గొడవ జరిగింది. ఈ కేసులో గుడ్డుపై సెక్షన్ 307 కేసు నమోదైంది.. దీని కారణంగా అతను గత ఎనిమిది నెలలుగా భాగల్పూర్ ప్రత్యేక సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
Read Also: Prabhas: ఆదిపురుష్ కోసం రంగంలోకి దిగిన ‘మైత్రీ’…
జూన్ 6న పల్లవి తన భర్త గుడ్డును కలిసేందుకు జైలుకు వెళ్లింది. గుడ్డు నెంబర్ రాగానే అతని ఎదురుగా పల్లవి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో హడావుడిగా మాయాగంజ్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ఇక్కడ విచారణ జరిపిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. పల్లవి మరణంతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు.
Read Also: Fake Cakes: తక్కువ ధరకే కేక్.. కల్తీ కేటుగాళ్లపై పోలీసులు నజర్
బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లవి ఎనిమిదో నెలలో గర్భం దాల్చింది. జూన్ 27న డెలివరీ తేదీని కూడా వైద్యులు తెలిపారు. అయితే అంతకుముందే ఈ ఘటన జరిగింది. పోలీసుల ఇష్టారాజ్యం వల్లే పల్లవి ప్రాణాలు కోల్పోయిందని గుడ్డు సోదరుడు విక్కీ యాదవ్ ఆరోపించాడు. వినోద్ యాదవ్ నుంచి డబ్బులు తీసుకుని పోలీసులు నా అన్న గుడ్డును జైలుకు పంపారు అంటూ బాధితుడి తమ్ముడు ఆరోపించాడు. పల్లవి మృతి తర్వాత పోస్టుమార్టంకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అనంతరం చట్టబద్దమైన లాంఛనాల తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. పల్లవి భర్త అంత్యక్రియల కోసం పోలీసు రక్షణలో శ్మశానవాటికకు చేరుకున్నారు. అనంతరం భార్య అంత్యక్రియల చితికి నిప్పంటించారు.
తాజావార్తలు
-
IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ
-
Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
-
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
-
SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!