Bihar: జైల్లో ఉన్న భర్త ముఖాన్ని చూసి గర్భవతి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని భాగల్పూర్లోని ప్రత్యేక సెంట్రల్ జైలులో దారుణం జరిగింది. హత్యాయత్నం చేసి జైలులో ఉన్న భర్తను కలిసేందుకు వెళ్లిన భార్య.. భర్త ముఖం చూడగానే స్పృహతప్పి పడిపోయింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ మహిళ 8 నెలల గర్భిణి.. అయితే ఆమెకు ఈ నెల 27న ప్రసవం కావాల్సి ఉంది. ఆమె మృతికి పోలీసులే బాధ్యత వహించాలని మృతురాలి బంధవులు ఆరోపించారు.
Read Also: Rahul Gandhi Vs Dhankar: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన ఉప రాష్ట్రపతి ధన్కర్
Also Read
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
- Virat Kohli: "ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను".. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
- Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
నిజానికి భాగల్పూర్లోని స్పెషల్ సెంట్రల్ జైలులో జూన్ 6వ తేదీన దారుణ ఘటన జరిగింది. భాగల్పూర్కు చెందిన ఘోఘా గోవింద్పూర్కు చెందిన గుడ్డు యాదవ్కు ఘోఘా జనిదిహ్కు చెందిన పల్లవి యాదవ్తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరిది ప్రేమ వివాహం కాగా ప్రస్తుతం పల్లవి 8 నెలల గర్భిణి. గుడ్డు యాదవ్కు వినోద్ యాదవ్తో భూమి విషయంలో గొడవ జరిగింది. ఈ కేసులో గుడ్డుపై సెక్షన్ 307 కేసు నమోదైంది.. దీని కారణంగా అతను గత ఎనిమిది నెలలుగా భాగల్పూర్ ప్రత్యేక సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
Read Also: Prabhas: ఆదిపురుష్ కోసం రంగంలోకి దిగిన ‘మైత్రీ’…
జూన్ 6న పల్లవి తన భర్త గుడ్డును కలిసేందుకు జైలుకు వెళ్లింది. గుడ్డు నెంబర్ రాగానే అతని ఎదురుగా పల్లవి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో హడావుడిగా మాయాగంజ్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ఇక్కడ విచారణ జరిపిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. పల్లవి మరణంతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు.
Read Also: Fake Cakes: తక్కువ ధరకే కేక్.. కల్తీ కేటుగాళ్లపై పోలీసులు నజర్
బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లవి ఎనిమిదో నెలలో గర్భం దాల్చింది. జూన్ 27న డెలివరీ తేదీని కూడా వైద్యులు తెలిపారు. అయితే అంతకుముందే ఈ ఘటన జరిగింది. పోలీసుల ఇష్టారాజ్యం వల్లే పల్లవి ప్రాణాలు కోల్పోయిందని గుడ్డు సోదరుడు విక్కీ యాదవ్ ఆరోపించాడు. వినోద్ యాదవ్ నుంచి డబ్బులు తీసుకుని పోలీసులు నా అన్న గుడ్డును జైలుకు పంపారు అంటూ బాధితుడి తమ్ముడు ఆరోపించాడు. పల్లవి మృతి తర్వాత పోస్టుమార్టంకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అనంతరం చట్టబద్దమైన లాంఛనాల తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. పల్లవి భర్త అంత్యక్రియల కోసం పోలీసు రక్షణలో శ్మశానవాటికకు చేరుకున్నారు. అనంతరం భార్య అంత్యక్రియల చితికి నిప్పంటించారు.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
-
PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..