Bihar: జైల్లో ఉన్న భర్త ముఖాన్ని చూసి గర్భవతి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని భాగల్పూర్లోని ప్రత్యేక సెంట్రల్ జైలులో దారుణం జరిగింది. హత్యాయత్నం చేసి జైలులో ఉన్న భర్తను కలిసేందుకు వెళ్లిన భార్య.. భర్త ముఖం చూడగానే స్పృహతప్పి పడిపోయింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ మహిళ 8 నెలల గర్భిణి.. అయితే ఆమెకు ఈ నెల 27న ప్రసవం కావాల్సి ఉంది. ఆమె మృతికి పోలీసులే బాధ్యత వహించాలని మృతురాలి బంధవులు ఆరోపించారు.
Read Also: Rahul Gandhi Vs Dhankar: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన ఉప రాష్ట్రపతి ధన్కర్
Also Read
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
నిజానికి భాగల్పూర్లోని స్పెషల్ సెంట్రల్ జైలులో జూన్ 6వ తేదీన దారుణ ఘటన జరిగింది. భాగల్పూర్కు చెందిన ఘోఘా గోవింద్పూర్కు చెందిన గుడ్డు యాదవ్కు ఘోఘా జనిదిహ్కు చెందిన పల్లవి యాదవ్తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరిది ప్రేమ వివాహం కాగా ప్రస్తుతం పల్లవి 8 నెలల గర్భిణి. గుడ్డు యాదవ్కు వినోద్ యాదవ్తో భూమి విషయంలో గొడవ జరిగింది. ఈ కేసులో గుడ్డుపై సెక్షన్ 307 కేసు నమోదైంది.. దీని కారణంగా అతను గత ఎనిమిది నెలలుగా భాగల్పూర్ ప్రత్యేక సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
Read Also: Prabhas: ఆదిపురుష్ కోసం రంగంలోకి దిగిన ‘మైత్రీ’…
జూన్ 6న పల్లవి తన భర్త గుడ్డును కలిసేందుకు జైలుకు వెళ్లింది. గుడ్డు నెంబర్ రాగానే అతని ఎదురుగా పల్లవి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో హడావుడిగా మాయాగంజ్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ఇక్కడ విచారణ జరిపిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. పల్లవి మరణంతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు.
Read Also: Fake Cakes: తక్కువ ధరకే కేక్.. కల్తీ కేటుగాళ్లపై పోలీసులు నజర్
బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లవి ఎనిమిదో నెలలో గర్భం దాల్చింది. జూన్ 27న డెలివరీ తేదీని కూడా వైద్యులు తెలిపారు. అయితే అంతకుముందే ఈ ఘటన జరిగింది. పోలీసుల ఇష్టారాజ్యం వల్లే పల్లవి ప్రాణాలు కోల్పోయిందని గుడ్డు సోదరుడు విక్కీ యాదవ్ ఆరోపించాడు. వినోద్ యాదవ్ నుంచి డబ్బులు తీసుకుని పోలీసులు నా అన్న గుడ్డును జైలుకు పంపారు అంటూ బాధితుడి తమ్ముడు ఆరోపించాడు. పల్లవి మృతి తర్వాత పోస్టుమార్టంకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అనంతరం చట్టబద్దమైన లాంఛనాల తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. పల్లవి భర్త అంత్యక్రియల కోసం పోలీసు రక్షణలో శ్మశానవాటికకు చేరుకున్నారు. అనంతరం భార్య అంత్యక్రియల చితికి నిప్పంటించారు.
తాజావార్తలు
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!