Atrocious : 13ఏళ్ల బాలిక ప్రియుడితో సన్నిహితంగా ఉండగా చెల్లి చూసింది.. ఆ తర్వాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious : సినిమాల ప్రభావమో పెరిగే వాతావరణ ప్రభావమో తెలియదు కానీ..ఈ మధ్య చిన్న పిల్లలే దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. 13 ఏళ్ల బాలిక ప్రియుడితో సన్నిహితంగా ఉండగా ఆమె సొంత 9 ఏళ్ల చెల్లెలు చూసింది. ఈ విషయాన్ని ఎక్కడ తల్లిదండ్రులకు చెబుతుందో అన్న భయంతో ఆ బాలిక చెల్లెలు పట్ల దారుణంగా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి చెల్లిని క్రూరంగా చంపేసింది. అనంతరం ఏమీ తెలియనట్టు నటించింది. కానీ పోలీసుల దర్యాప్తులో ఆమె నేరం అంగీకరించింది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని వైశాలి జిల్లాలోని జందాహా బ్లాక్ లో దంపతులు తమ13 ఏళ్లు, 9 ఏళ్ల వయసు గల తమ కూతుర్లతో కలిసి జీవిస్తున్నారు. అయితే పేరెంట్స్ ఇటీవల ఓ పెళ్లి వేడుక కోసం వేరే గ్రామానికి వెళ్లారు. అక్కడే నాలుగైదు రోజులు ఉన్నారు. ఈ క్రమంలో 13 ఏళ్ల బాలిక తన ప్రియుడితో ఇంటి వద్ద సన్నిహితంగా మెలిగింది. దీనిని చెల్లెలు చూసింది. దీంతో అక్క, ఆమె ప్రియుడు ఒక్క సారిగా కంగుతిన్నారు. చెల్లి తన విషయం ఎక్కడ బయటపెడుతుందోనని భయంతో అక్క, ఆమె ప్రియుడు కలిసి ఆ బాలికను చంపేశారు. అనంతరం డెడ్ బాడీని ఇంట్లోనే ఉంచారు. అయితే రెండు, మూడు రోజుల తరువాత మృతదేహం కుళ్లిపోయి, దుర్వాసన రావడం మొదలయ్యింది. దీంతో ఆ మృతదేహాన్ని నరికి యాసిడ్ పోసి ఇంటి పెరట్లో పడేశారు. నాలుగైదు రోజుల తరువాత తల్లిదండ్రులు ఇంటికి చేరుకున్నారు. అయితే వారికి చిన్న కూతురు కనిపించలేదు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
Read Also:SSMB 28: తుఫాన్ వస్తుంది… అలర్ట్ గా ఉండండి
ఈ క్రమంలో కొందరు స్థానికులు మృతదేహాలను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్ స్క్వాడ్, ఎఫ్ఎస్ఎల్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం బాలిక అవశేషాలను సేకరించారు. వారి దర్యాప్తులో ఆ డెడ్ బాడీ తప్పిపోయిన బాలికదిగా గుర్తించారు. అనంతరం ఆధారాలను ల్యాబ్కు పంపించి శవపరీక్ష కూడా నిర్వహించారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా బాధితురాలి అక్కను ప్రశ్నించారు. దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించి మొత్తం సంఘటనలను బయటపెట్టింది. ఈ ఘటనపై వైశాలి ఎస్పీ రవి రంజన్ కుమార్ మాట్లాడుతూ.. మే 16న తొమ్మిదేళ్ల బాలిక అదృశ్యమైందని, మే 19న ఆమె అవశేషాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఈ ఘటనలో తగిన సాక్ష్యాధారాలు లభించడంతో మంగళవారం సాయంత్రం ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.
Read Also:IPL 2023: ఐపీఎల్ ఫైనల్ తర్వాతే.. ఆసియా కప్ వేదికపై తుది నిర్ణయం
తాజావార్తలు
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!